అన్వేషించండి

Varla Ramaiah : జగన్‌ కేసులను ఈడీ ఎందుకు పట్టించుకోదు ? - టీడీపీ ప్రశ్న

TDP : 8 ఎకరాల అంశంపై ఈడీ ఝార్ఖండ్ సీఎంను అరెస్ట్ చేస్తే 43 వేల కోట్ల అవినీతిని చేసిన జగన్‌ను ఎందుకు వదిలేశారని టీడీపీ ప్రశ్నించింది. జగన్ పదవిలో ఉండటానికి అనర్హుడని వర్ల రామయ్య స్పష్టం చేసారు.

TDP Varla Ramaiah :  8 ఎకరాల పొలం అన్యాక్రాంతం చేశాడని ఝార్ఖండ్ సీఎంను అరెస్టు చేశారు, 11సీబీఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలున్న సీఎం జగన్ ను ఎందుకు అరెస్టు చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించారు.  మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో  వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. 

ఈడీకి జగన్ అవినీతి ఎందుకు కనిపించడం లేదు ? 
 
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చూపు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు పడడంలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ ది విపరీతమైన, విచిత్రమైన మనస్తత్వం. ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు జగన్ ఏనాడూ సమాధానం చెప్పలేదు. మేం ఏదైనా అడిగితే కాదు అని ఆయన గాని, ఆయన అనుయాయులుగానీ చెప్పరు. జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని రూ.43 వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ జగన్ పై 11 ఛార్జిషీట్లు వేసింది. ఈ ఛార్జిషీట్లు రికార్డు పరంగా నమోదయ్యాయి. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకొంది. అన్నింటికి కేలెండర్ నెంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో 31.03.2012న ఛార్జిషీట్లు వేశారు. జగన్ పై ఛార్జిషీట్లు వేసి 11 సంవత్సరాలైంది. ఆయన పై ఉన్న కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. 

జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని 43వేల కోట్లు దోపిడి

జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని రూ.43 వేల కోట్లు  కొట్టేసినట్లు సీబీఐ చెప్పకనే చెప్పింది. అదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ 5 కేసులు నమోదు చేసి ఛార్జిషీట్లు వేశారు రూ.2 వేల కోట్ల పైచిలుకు ఆస్తులు స్వాధీనపరచుకున్నారు.  8 ఎకరాల పొలం బిట్లు బిట్లుగా 10, 15 సెంట్లు చేసి అన్యాక్రాంతం చేశాడని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అరెస్టు చేశారు. అప్పటికప్పుడు ఆయన చేత సీఎం పదవికి రాజీనామా చేయించారు. సెంట్రల్ జైలుకు పంపారు. ఈ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ శాఖను నేను అభినందిస్తున్నాను. ఇందులో భాగంగానే మ  సీఎం జగన్ వైపు కూడా ఒక సారి చూడాలి. నేరం చేసినవాడు ఎంతటివారైనా చట్టం వదలదని దీని ద్వారా అవగతమైంది. 11సీబీఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు, 2 వేల కోట్ల పైచిలుకు  సాక్ష్యాలున్న సీఎం జగన్ ను ఎందుకు వదిలేశారు? 4 సంవత్సరాల 10 నెలలుగా జగన్ సీఎంగా ఉన్నారు, అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చూపు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు పడడంలేదు? ఎన్ ఫోర్స్ మెంట్ చూపు పడని సేఫ్ ప్లేస్ లో జగన్ ఉన్నారా? దీనికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
  
2004లో 2.12 కోట్లు ఉన్న ఆస్తులు2009లో 77 కోట్లు ఎలా అయ్యాయి?

2004లో తండ్రి ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తులు 2.12 కోట్లు అన్నారు.  2009 ఎన్నికల అఫిడెవిట్ లో తన  ఆస్తి రూ.77 కోట్ల 40 లక్షలకు ఎలా ఎగబాకింది? నాలుగు సంవత్సరాల్లో ఇది అనితర సాధ్యమా? ఏ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పరు. గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయం నుండి రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఇదీ ప్రశ్నలు పలు దఫాలుగా అడగడం జరిగింది. వ్యాపారం చేసినట్లుగానో, కాయాకష్టం చేసినట్లుగానో, కంపెనీలు నడిపినట్లుగానో చెప్పాలిగదా! రూ. 77 కోట్లు ఎలా వచ్చిందో చప్పడట.. ఆస్తులొచ్చాయట.. ఎలా వచ్చాయో చెప్పరట.. ఇది పద్ధతేనా? మౌనం అర్ధాంగికారమా? మీ మౌనం శిక్షార్హం కాదా? అవినీతి చేసి సంపాదించిన డబ్బు అని నేనంటే అది అంగీకరించినట్లు కాదా? మీరు శిక్షకు అర్హులేకదా? ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవరమా? నేనడిగిన ప్రశ్నలకు సమాధానం ప్పకపోతే ప్రజా క్షేత్రంలో జగన్ తప్పుడు మనిషేగా? అతి కొద్ది కాలంలోనే జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా రూపాంతంరం చెందారు? 

లోటస్ పాండ్ మీదా? కాదా? మీదైతే మీకెక్కడిది?

29 ఎకరాల్లో అమెరికా శ్వేత తలదన్నే సౌధం బెంగళూరులో ఎలా నిర్మించగలిగారు? జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది? ఎందుకు ఎదురుతిరిగిందో చెప్పగలరా? బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణ అడిగిన మీరు, తర్వాత హైకోర్టు నుండి దానిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కోడికత్తి శీను ను మీ కుట్రలో పావుగా వాడుకొని 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా ఎందుకుంచారో చెప్పగలరా?  జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో కూడా మనీ ల్యాడరింగ్ చేశారని లెటర్స్ ఆఫ్ లేబొరేటరీ 6 దేశాలు వర్జీనియా, మారిషస్, కౌలాలంపూర్ లాంటి 6 దేశాలకు పంపారు. ఈ 6 దేశాల్లో ఈ మనీ ల్యాండరింగ్ జరిగినట్లు సుస్పష్టంగా తేలింది. ఈ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఏం చేర్యలు తీసుకున్నారో చెప్పాలి. సోరెన్ అవినీతి కనిపించిన ఎన్ ఫోర్స్ మెంట్ కు జగన్ అవినీతి ఎందుకు కనబడలేదు? 

జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడలేదా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బడా బడా పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ పరంగా రాయితీలిచ్చారు. ఎకరం 50 లక్షలు చేసేదాన్ని ఎకరం 50 వేలకు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వాన్ పిక్ కు 28 వేల ఎకరాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉన్నాయి. ఈ 28 వేల ఎకరాలు స్వీకరించినవారు జగన్మోహన్ రెడ్డికి జగతి పబ్లికేషన్, సాక్షి పేపర్ లో 8 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం వాస్తవం కాదా? ప్రపంచ వ్యాప్తంగా పత్రికా రంగం లాభసాటి వ్యాపారం కాదు, జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు లాభసాటి అయింది. ఇంతకంటే రుజువులు ఏంకావాలి? కన్నతల్లిని సరిగా చూసుకోనివాడు, పట్టెడన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు పెడతానంటే ఎవరైనా నమ్మగలరా? జగన్ పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది.  జగన్ రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. రాజకీయాలకు పనికిరారు. ఎప్పటికైనా జగన్ కేసులపై కోర్టుల్లో తీర్పు వస్తుంది. జగన్ కోర్టు కేసుల్లో హాజరు కావాలని సూచిస్తున్నాను. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. కోడికత్తి కేసులో జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నిజా నిజాలు బయటపడతాయి. ఇప్పటికైనా జగన్ విపరీతమైన, విచిత్రమైన మనస్తత్వాన్ని వదలి తాము అడిగే ప్రశ్నలకన్నింటికి సమాధానాలు చెప్పాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget