అన్వేషించండి

JC Brothers : జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ కీలక నిర్ణయాలు !

అనంతపురం జిల్లా టీడీపీలో పరిస్థితుల్ని మెరుగుపర్చాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టి.. సీనియర్ నేతలపై ఆరోపణలు చేస్తున్న జేసీ బ్రదర్స్‌ను కంట్రోల్‌లో పెట్టాలని నిర్ణయించారు.

తెలుగుదేశం పార్టీలో జేసీ బ్రదర్స్‌కు ఉక్కపోత ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.  అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలందరిపైనా ఆరోపణలు చేస్తూ తాము ఒక్కరే కార్యకర్తలను పట్టించుకుంటున్నామన్నట్లుగా ప్రకటనలు చేయడంపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. తాడిపత్రిలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ వారు వేలు పెట్టడమే కాకుండా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు వంటి వారిపై ఆరోపణలు చేయడంపై టీడీపీ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. 

JC Brothers : జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ కీలక నిర్ణయాలు !

Also Read : పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు... నిర్మాణాలు ఆపాలని కీలక ఆదేశాలు

అనంతపురం టీడీపీలో పరిస్థితుల్ని చక్క బెట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం వల్ల ప్రతీ సారి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఇక నుంచి ఇలాంటి వాటిని సహించకూడదని భావిస్తున్నారు. అందుకే  ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టి ..  పార్టీ సీనియర్ నేతలపై ఆరోపణలు చేస్తున్న జేసీ వర్గానికి చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల శింగనమల నియోజకవర్గంలో జేసీకి సన్నిహితులకు కాకుండా ఇతరులకు పార్టీ పదవులు అప్పగించారు. ఇంచార్జిగా ఉన్న బండారు శ్రావణి జేసీ వర్గం. ఆమెకు ప్రాధాన్యత తగ్గించి ఇతరులకు ప్రాధాన్యత కల్పించారు. ఈ అంశంపై అమరావతి వెళ్లి అచ్చెన్నాయుడుని కలిసినప్పటికీ వారికి సానుకూల స్పందన రాలేదు.
JC Brothers : జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ కీలక నిర్ణయాలు !

Also Read : దర్శనం టిక్కెట్లు, గదుల బుకింగ్ ఇక ‘జియో’ ద్వారానే.. ఎంవోయూ చేసుకున్న టీటీడీ !

ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు హెచ్చరికగా ఓ లేఖ విడుదల చేశారు. ఇతరుల నియోజకవర్గాల్లో వేరే ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోకూడదని.. ఎవరైనా అలా జోక్యం చేసుకొంటే.. వారి కార్యక్రమాల్లో ఇతరులు పాల్గొంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని లేఖలో హెచ్చరించారు. ఇప్పటికీ జేసీ బ్రదర్స్ తమ రాజకీయాలను మార్చుకోకపోతే  మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకొనేందుకు పార్టీ అధిష్ఠానం సిద్దం అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయం అంచనాకు రావడంతో జేసీ బ్రదర్స్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎప్పడూ పార్టీ కమిటీ మీటింగ్లో పాల్గొనని జెసి అస్మిత్ రెడ్డి...  శుక్రవారం అనంతపురం పార్టీ కమిటీ సమావేశంలో తాడిపత్రి ఇంచార్జ్ హోదాలో హాజరయ్యారు.
JC Brothers : జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ కీలక నిర్ణయాలు !

Also Read : విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...

అనంతపురం పార్టీ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న పార్టీ అదిష్ఠానం ఎవరైనా...ఎంతవారైనా సరే పార్టీ లైన్ దాటితే సహించేది లేదన్న బలమైన మెసెజ్ పంపింది.ఇ న్నాళ్లు జెసి వర్గంగా చెలామణి అవతున్న పలువురు నేతలు కూడా పరిస్థితులను గమనిస్తున్నారు తప్పితే ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.  రాయలసీమలో తెలుగుదేశం పటిష్టంగా వున్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం తగ్గడం లేదు. దీంతో  వీరిని మార్చకపోతే పార్టీ నష్టపోతుందని కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో జేసీ బ్రదర్స్‌ని కంట్రోల్ చేయడం ద్వారా పార్టీని చక్కదిద్దే ప్రయత్నాన్ని టీడీపీ హైకమాండ్ ప్రారంభించింది . 

Also Read: అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు... పాలు పోసే రైతులే యాజమానులు... వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget