అన్వేషించండి

Chandrababu: 'బటన్ నొక్కడం కాదు, నీ బొక్కుడు సంగతేంటి?' - జగన్ పాలన అంతమొందించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు

AP politics: అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు. జగన్ నొక్కేవి ఉత్తుత్తి బటన్లేనని ఎద్దేవా చేశారు.

Chandrababu Comments in Madugula Meeting: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమని.. ఈ ఎన్నికల్లో జగన్ పాలనకు అంతం పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrbabu) ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో (Madugula) నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో ఆయన మాట్లాడారు. ఇంకో 64 రోజుల్లో టీడీపీ (TDP) - జనసేన (Janasena) ప్రభుత్వం రాబోతోందని అన్నారు. సీఎం జగన్ బటన్స్ నొక్కుతున్నానని గొప్పులు చెప్పుకొంటున్నారని.. 'బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి.?' అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని గుర్తు చేశారు. 'ఈ ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజలు గెలవాలి. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్ లేదు. ఇలాంటి సీఎంను నా జీవితంలో నేను చూడలేదు. ప్రజలపై భారం వేసిన గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. ఆయన బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయింది. కరెంట్ ఛార్జీలు పెంచి రూ.64 వేల కోట్ల భారం ప్రజలపై మోపారు. జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు.?' అని ప్రశ్నించారు. జగన్ ది ఉత్తుత్తి బటన్ నొక్కుడని.. జాబు కావాలంటే బాబు రావాల్సిందే అని పునరుద్ఘాటించారు.

'జగన్ ఓటమి ఖాయం'

జగన్ బటన్ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని.. ఎన్నికల్లో రేపు ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారని, ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయమని చంద్రబాబు అన్నారు. 'మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశారు. ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారు. ధన దాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశారు. రుషికొండను అనకొండలా మింగేశారు. విశాఖలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారు. రూ.500 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. తన సలహాదారులకే రూ.150 కోట్లు దోచిపెట్టారు. విశాఖ ఉక్కుపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖను గంజాయి కేంద్రంగా.. క్రైమ్ సిటీగా మార్చేశారు.' అంటూ మండిపడ్డారు. 

అనంతరం చింతలపూడి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్ ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని.. ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారని.. అర్జునుడిని అని చెప్పుకొంటున్న జగన్.. అక్రమార్జునుడు అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ధ్వజమెత్తారు. 

Also Read: YSRCP : చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ - మరో దళిత నేత రాజీనామా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Embed widget