అన్వేషించండి

Amaravati Case: సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా - ఎన్నికల్లోపు తేలనట్లే !

Supreme Court : అమరావతి కేసులను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతి వాదులను ఆదేశించింది.

Supreme Court Amaravati Case: ఏపీ రాజధాని అమరావతి కేసు ఈ రోజు సుప్రీంలో  ఏప్రిల్‌కు వాయిదా పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినపిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. గత ఏడాది జూలైలో డిసెంబర్‌కు వాయిదా వేసింది. అయితే డిసెంబర్ లో విచారణకు రాలేదు. జనవరిలో విచారణకు వచ్చింది కానీ ఏప్రిల్ కు వాయిదా పడటంతో అప్పటికి ఏపీలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిపోతుంది. రాజధాని అంశానికి ఓ ముగింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. 

అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు

అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.  అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు.  అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే  జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ కేసు విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 

హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పు స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వటం సహేతుకం కాదని పేర్కొంది. దీని పైన కొంత కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఇక, ఈ రోజు విచారణ తరువాత సుప్రీంకోర్టు ప్రతివాదులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పైన సుప్రీంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. 

మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు వేయలేకపోయిన ప్రభుత్వం  

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఏడాది డిసెంబర్ లో మూడు రాజధాను ప్రతిపాదన చేసారు. ఈ దిశగా చట్ట సభల్లో బిల్లులు తీసుకొచ్చారు. హైకోర్టులో విచారణ వేళ ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది. తరువాత తీర్పు ఇచ్చిన హై కోర్టు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆదేశిస్తూ...కాల పరిమితిని నిర్దేశిస్తూ స్పష్టత ఇచ్చింది.ఈ తీర్పు పైన సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని పేర్కొంది.   రాష్ట్ర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని రాజధానిని కేవలం అమరావతికే పరిమితం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని నివేదికలు సూచించిన అంశాన్ని సుప్రీంకు వివరించింది. 2014-19 కాలంలో అమరావతి ప్రాంతంలో 10 శాత మౌలిక వసతలు పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ కోసం ఏప్రిల్ కు వాయిదా వేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget