అన్వేషించండి

Nuzuvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెరుగుపడని పరిస్థితులు - ఇప్పటివరకూ 1300 మందికి అస్వస్థత!

Andhra News: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో తాజాగా 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Students Illness In Nuzivid IIIT: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో (Nuzivid IIIT) విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. తాజాగా, 113 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 1300 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్ర వాతావరణంతో గతం వారం రోజులుగా వందల మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది. ప్రధానంగా 3 మెస్‌ల్లో ఆహారం తిన్న విద్యార్థులు చాలా మంది అనారోగ్యం పాలు కాగా.. గత 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం 131, తాజాగా 113 మంది ఆస్పత్రుల్లో చేరారు. 

అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, ట్రిపుల్ ఐటీని తనిఖీ చేసేందుకు వెళ్లిన గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథికి విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మంత్రి కాలేజీ పరిసరాలు, మెస్‌లను పరిశీలించగా.. అక్కడి దారుణాలను ఆయనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దుర్వాసన వస్తోన్న కూరలు, అపరిశుభ్రంగా ఉన్న వంటగది, నాణ్యత లేని భోజనం వంటి వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి ట్రిపుల్ ఐటీపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లా వైద్యాధికారి కాలేజీని పరిశీలించారని.. ఆ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. అనంతరం మంత్రి అధికారులు, మెస్ నిర్వాహకులతో సమావేశమై.. కాలేజీ, మెస్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మారని తీరు

ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్థసారథి పర్యటించినా.. నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేసినా పరిస్థితి ఏమాత్రం మారలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిశీలించిన అనంతరం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని అన్నారు. రోగుల సంఖ్య తక్కువగా చూపించేందుకు ఓపీలు కూడా రాయడం లేదని.. ఆరోగ్య పరిస్థితి విషమించినా మందులిచ్చి పంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

అటు, అల్లూరి జిల్లాలోని (Alluri District) అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ (Dumbriguda) మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి 50 మంది విద్యార్థులు రాత్రి ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే వారిని అరకులోయలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. 

భోజనం బాగోలేదని..

మరోవైపు, అంబేడ్కర్ జిల్లా కె.గంగవరం మండలంలోని బట్లపలిక స్కూల్‌లో భోజనం బాగోలేదని విద్యార్థులు నిరసన తెలిపారు. భోజనం నాణ్యత లేదని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ విమర్శలు చేసింది. విద్యార్థులు ఆకలితో ఇంటికి వెళ్లిపోతున్నారంటూ.. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Pencsions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget