అన్వేషించండి

Nuzuvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెరుగుపడని పరిస్థితులు - ఇప్పటివరకూ 1300 మందికి అస్వస్థత!

Andhra News: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో తాజాగా 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Students Illness In Nuzivid IIIT: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో (Nuzivid IIIT) విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. తాజాగా, 113 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 1300 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్ర వాతావరణంతో గతం వారం రోజులుగా వందల మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది. ప్రధానంగా 3 మెస్‌ల్లో ఆహారం తిన్న విద్యార్థులు చాలా మంది అనారోగ్యం పాలు కాగా.. గత 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం 131, తాజాగా 113 మంది ఆస్పత్రుల్లో చేరారు. 

అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, ట్రిపుల్ ఐటీని తనిఖీ చేసేందుకు వెళ్లిన గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథికి విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మంత్రి కాలేజీ పరిసరాలు, మెస్‌లను పరిశీలించగా.. అక్కడి దారుణాలను ఆయనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దుర్వాసన వస్తోన్న కూరలు, అపరిశుభ్రంగా ఉన్న వంటగది, నాణ్యత లేని భోజనం వంటి వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి ట్రిపుల్ ఐటీపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లా వైద్యాధికారి కాలేజీని పరిశీలించారని.. ఆ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. అనంతరం మంత్రి అధికారులు, మెస్ నిర్వాహకులతో సమావేశమై.. కాలేజీ, మెస్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మారని తీరు

ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్థసారథి పర్యటించినా.. నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేసినా పరిస్థితి ఏమాత్రం మారలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిశీలించిన అనంతరం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని అన్నారు. రోగుల సంఖ్య తక్కువగా చూపించేందుకు ఓపీలు కూడా రాయడం లేదని.. ఆరోగ్య పరిస్థితి విషమించినా మందులిచ్చి పంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

అటు, అల్లూరి జిల్లాలోని (Alluri District) అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ (Dumbriguda) మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి 50 మంది విద్యార్థులు రాత్రి ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే వారిని అరకులోయలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. 

భోజనం బాగోలేదని..

మరోవైపు, అంబేడ్కర్ జిల్లా కె.గంగవరం మండలంలోని బట్లపలిక స్కూల్‌లో భోజనం బాగోలేదని విద్యార్థులు నిరసన తెలిపారు. భోజనం నాణ్యత లేదని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ విమర్శలు చేసింది. విద్యార్థులు ఆకలితో ఇంటికి వెళ్లిపోతున్నారంటూ.. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Pencsions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget