అన్వేషించండి

Nuzuvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెరుగుపడని పరిస్థితులు - ఇప్పటివరకూ 1300 మందికి అస్వస్థత!

Andhra News: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో తాజాగా 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Students Illness In Nuzivid IIIT: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో (Nuzivid IIIT) విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. తాజాగా, 113 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 1300 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్ర వాతావరణంతో గతం వారం రోజులుగా వందల మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది. ప్రధానంగా 3 మెస్‌ల్లో ఆహారం తిన్న విద్యార్థులు చాలా మంది అనారోగ్యం పాలు కాగా.. గత 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం 131, తాజాగా 113 మంది ఆస్పత్రుల్లో చేరారు. 

అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, ట్రిపుల్ ఐటీని తనిఖీ చేసేందుకు వెళ్లిన గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథికి విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మంత్రి కాలేజీ పరిసరాలు, మెస్‌లను పరిశీలించగా.. అక్కడి దారుణాలను ఆయనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దుర్వాసన వస్తోన్న కూరలు, అపరిశుభ్రంగా ఉన్న వంటగది, నాణ్యత లేని భోజనం వంటి వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి ట్రిపుల్ ఐటీపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లా వైద్యాధికారి కాలేజీని పరిశీలించారని.. ఆ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. అనంతరం మంత్రి అధికారులు, మెస్ నిర్వాహకులతో సమావేశమై.. కాలేజీ, మెస్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మారని తీరు

ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్థసారథి పర్యటించినా.. నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేసినా పరిస్థితి ఏమాత్రం మారలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిశీలించిన అనంతరం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని అన్నారు. రోగుల సంఖ్య తక్కువగా చూపించేందుకు ఓపీలు కూడా రాయడం లేదని.. ఆరోగ్య పరిస్థితి విషమించినా మందులిచ్చి పంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

అటు, అల్లూరి జిల్లాలోని (Alluri District) అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ (Dumbriguda) మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి 50 మంది విద్యార్థులు రాత్రి ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే వారిని అరకులోయలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. 

భోజనం బాగోలేదని..

మరోవైపు, అంబేడ్కర్ జిల్లా కె.గంగవరం మండలంలోని బట్లపలిక స్కూల్‌లో భోజనం బాగోలేదని విద్యార్థులు నిరసన తెలిపారు. భోజనం నాణ్యత లేదని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ విమర్శలు చేసింది. విద్యార్థులు ఆకలితో ఇంటికి వెళ్లిపోతున్నారంటూ.. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Pencsions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget