అన్వేషించండి

Sajjala: ఎస్సీ, బీసీ డిక్లరేషన్ అంటూ మాయ మాటలు, ఆ అర్హత చంద్రబాబుకు లేదు - సజ్జల

Sajjala Ramakrishna Reddy: వడ్డెర్ల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

14 సంవత్సరాలు ముఖమంత్రిగా పని చేసినప్పుడు బీసీలను అడుగడునా మోసం చేసిన చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించమని వెళ్తే తోకలు కత్తిరిస్తానని అవమానాల పాలు చేసిన చంద్రబాబు నేడు బీసీల ఓట్ల కోసం దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీసీలు అన్ని రంగాలలో అభివృధ్ది చెందాలంటూ వారికోసం నిరంతరం తపిస్తూ వారిలో నాయకత్వలక్షణాలను ప్రోత్సహిస్తున్న శ్రీ వైయస్ జగన్ అండగా రాష్ర్టంలోని బీసీలంతా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటలను నమ్మేస్దితిలో బీసీలు లేరని అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర్ల ఆత్మీయసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. 

ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలుగుదేశం పార్టీ దుస్సాహసానికి ఒడిగడుతోంది. ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లో,కమ్యూనిస్టు పార్టీ లాంటివాళ్లో బీసీ డిక్లరేషన్ పెట్టారంటే అర్ధముంటుంది. మూడు సార్లు అదికారంలోకి వచ్చినా 14 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చినా ప్రతిసారి చంద్రబాబు  బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. నరేంద్రమోది,పవన్ కల్యాణ్ సహకారంతో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అదీకూడా  కేవలం 1 శాతం ఓటుతేడాతో అధికారంలోకి వచ్చారు. జన్మభూమి కమిటీలను మాఫియా గ్యాంగ్ ల్లాగా తయారుచేశారు. జన్మభూమి కమిటీలనే వ్యవస్ధను టిడిపి ప్రయోజనాలకోసం రూపొందించారు. పెన్సన్లు,మరే లబ్ది కావాలన్నా కూడా ఆ కమిటీల ద్వారా నడిచేవి.లేని మరుగుదొడ్లు,నీరు చెట్టు పధకం ద్వారా ఆ దోపిడీ విపరీతంగా సాగిందన్నారు.

ఆ అక్రమాలు, దోపిడీల నేపధ్యంలో ప్రజలు చంద్రబాబును 2019లో చెత్తబుట్టలో పడేశారు. జగన్ అనేక ఆటుపోట్లను  ధైర్యంగా ఎదుర్కొని ముఖ్యంగా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నా కూడా ఆ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర చేశారు. ప్రజలతో మమేకమైన జగన్ గారిని ప్రజలు అక్కున చేర్చుకుని 151 స్ధానాలతో తిరుగులేని విధంగా ఘనవిజయాన్ని అందించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా గ్రామసచివాలయాలను వాలంటీర్ల వ్యవస్ధను తీసుకువచ్చారు. 

ఇక్కడ అందరూ గుర్తించాల్సింది ఏమంటే రానున్నఎన్నికలలో  మారీచులకంటే మాయోపాయాలు పన్నే,కుట్రలు చేసేవారితో యుధ్దం చేస్తున్నాం. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలనే భావనతో చంద్రబాబు లాంటి వారు ఉన్నారు. బీసీలకు ఎంతగా ప్రయారిటీ  ఇస్తారంటే వడ్డెర్లకు సంబందించి చూస్తే  గుంటూరులో చంద్రగిరి ఏసురత్నం లాంటి వాళ్ళు ఎంఎల్ ఏగా విజయం సాధించలేని పరిస్దితి ఉంటే ఆయనకు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించారు. బీసీ డిక్లరేషన్ అని మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు.ఓటుబ్యాంకుగా వాడుకుని అధికారం వచ్చాక వారిని మోసం చేశారన్నారు.పచ్చమీడియాతో కలసి మాఫియాలాగా తయారు చేసి బీసీ డిక్లరేషన్ అంటూ బీసీ లను ఉద్దరిస్తానంటూ బయల్దేరారన్నారు.అయితే బీసీలు ఎంతో చైతన్యవంతులైయ్యారని వారికి జగన్ గారు చేసిన మేలు వారికోసం అమలు చేస్తున్న సంక్షేమపధకాలు వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు.

పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడితో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరు జగన్ పై  దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాటిని నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు. చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు. 2014-19 మధ్య ప్రజలకు ఏమీ చేశారో చెప్పి ప్రజలను ఓట్లడిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మంచి సేవలందుతున్నాయని గర్వంగా చెప్పగలం. మీ హయాంలో దోపీడీలు చేసిన జన్మభూమి కమిటీ లు మళ్ళీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ పై రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ... గొడ్డలి పోటు అంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
Embed widget