అన్వేషించండి

Mylavaram YSRCP : మైలవరం నుంచి పోటీకే జోగి రమేష్ మొగ్గు - సజ్జలతో భేటీలో క్లారిటీ ఇచ్చేశారా ?

మైలవరం వైఎస్ఆర్‌సీపీలో నేతల మధ్య పంచాయతీని తీల్చేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారు. జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తామని జోగి రమేష్ తాజాగా ప్రకటించారు.


Mylavaram YSRCP :  పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశం అయ్యారు. బుధవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సజ్జలను కలిశారు. నియోజకవర్గంలో జోగి రమేష్ తన అనుచరులతో చేయిస్తున్న రాజకీయంపై ఫిర్యాదు చేశారు. పోటీ చేయమంటేనే చేస్తానని లేకపోతే పార్టీ కోసం పని చేస్తానని చెప్పి వచ్చానని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు. తర్వాతి రోజే సజ్జలను జోగి రమేష్ కలిశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటామని భేటీ తర్వాత జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కృష్ణప్రసాద్‌తో కలిసి పని చేస్తామని.. సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే..అక్కడ పోటీ చేస్తానని జోగి రమేష్ మీడియాకు తెలిపారు. 

మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులే ఇంచార్జులుగా ఉన్నారు. అయితే వీరంతా నందిగామ నుంచి దిగుమతి అయినవారేనని జోగి రమేష్ వర్గీయులంటున్నారు.  అందరూ ఎమ్మెల్యే బామ్మర్ది కనుసన్నల్లో పనిచేస్తున్నారని..  ఈ ఇన్‌చార్జ్‌లు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని .. జోగి రమేష్ వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను..కూడా జోగి రమేష్ తన అనుచరులతో ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కృష్ణ ప్రసాద్‌కు ఆహ్వానాలు అందడం లేదు. దీంతో వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తికి గురవుతున్నారు. 

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ ఆ ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా పైన గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జోగి రమష్ పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అయితే, మైలవరంలో జోగి రమేష్ మద్దతు వర్గం పార్టీలో పని చేస్తోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానని కానీ నియోజకవర్గంలో పార్టీ చీలిపోతుందంటే తాను తప్పుకోవడానికి సిద్దమని ఎమ్మెల్యే చెబుతున్నారు.  

జోగి రమేష్  మనసు అంతా మైలవరం నుంచే ఉంది. ఆయన అనుచర వర్గం ఎక్కువగా మైలవరంలనే ఉంది. కానీ జగన్ ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాల రీత్యా.. పెడన నుంచి పోటీ చేయాలని సూచించారు. దానికి జోగిరమేష్ అంగీకరించారు. గెలిచారు కూడా. అయితే ఇటీవల జరగినస్థానిక ఎన్నికల్లో ఓ జడ్పీటీసీ స్థానంలో  టీడీపీ గెలిచింది. అందుకే తనకు అక్కడి కన్నా.. మైలవరమే సేఫ్ ప్లేసని..  జోగి రమేష్ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. వసంత కృష్ణప్రసాద్ కన్నా ఎక్కువ నోరు ఉంది. అంతే కాకుండా చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడం.. రఘురామరాజుపై తీవ్రంగా విరుచుకుపడటం వంటి చర్యల ద్వారా హైకమాండ్ మద్దతు పొందారు. అందుకే.. మైలవరం విషయంలో పార్టీ హైకమాండ్ ఆయన వైపే సానుకూలంగా ఉందని చెబుతున్నారు.  అందుకే టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తా లేదంటే లేదని వసంత కృష్ణప్రసాద్ అంటున్నారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget