అన్వేషించండి

MLA Karumuri Nageswara Rao: అరిమిల్లి హయాంలో రూ.1000 కోట్ల టీడీఆర్ స్కాం: ఎమ్మెల్యే కారుమూరి ఆరోపణలు

YSRCP MLA Karumuri Nageswara Rao: తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఓ అవినీతి కాలనాగు అని టీడీపీ నేత పట్టాభి ఇటీవల ఆరోపించారు. టీడీపీ నేత హయాంలో రూ.1000 కోట్ల స్కామ్ అని కారుమూరి కౌంటర్ ఇచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తణుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఓ అవినీతి కాలనాగు అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇటీవల ఆరోపించారు. కారుమూరి అవినీతిదెబ్బకు పేదలు బలవుతున్నారని, వందల కోట్ల అవినీతి చేశారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ సీతారామ్ గతంలోనే లేఖ రాశారని పట్టాభి వ్యాఖ్యానించారు. తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణ (TDP Leader Arimilli Radha Krishna) హయాంలోనే రూ.1000 కోట్ల టీడీఆర్ స్కాం (ట్రాన్స్ ఫరబుల్ డెవలప్ మెంట్ రైట్ కింద ఇచ్చే పత్రాలు) జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు (YSRCP MLA Karumuri Nageswara Rao) తాజాగా ఆరోపించారు.

తణుకు మున్సిపాల్టీలో 39 మందికి పైగా టీడీపీ సానుభూతి పరులు టీడీఆర్ బాండ్లు పొందినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి పేర్కొన్నారు. వారు కూడా తన బినామీలేనా అని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణను ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ నేత కారుమూరి ప్రశ్నించారు. ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు జారీ చేసే సర్టిఫికెట్లతో తనకు సంబంధాన్ని ముడిపెట్టటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణ హయాం నుంచే టీడీఆర్ బాండ్లు జారీ మొదలైందని.. అందులో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయని కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. 

విచారణకు సిద్ధమే..
వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. తణుకులో తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణ అరాచకాలను ఉక్కుపాదంతో అణిచి వేస్తామని వ్యాఖ్యానించారు. తాను చాలా క్రమశిక్షణతో ఎదిగానని జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పని చేశానని.. కానీ పార్టీ నేతలు కొన్ని సందర్భాల్లో తనపై కుట్రలు చేస్తున్నారని గతంలోనే మండిపడ్డారు.

అవినీతి కాలనాగు కారుమూరి: టీడీపీ నేత పట్టాభి
వైఎస్సార్‌సీపీ అవినీతి పుట్టలో నుంచి అవినీతి కాలనాగు తణుకు ఎమ్మెల్యే కారుమూరి అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇటీవల ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని కొల్లగొట్టడంలో కింది వారు తనను చూసి నేర్చుకోవాలని సీఎం వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దోపిడీకి లైసెన్స్ ఇచ్చేశారని వ్యాఖ్యలు చేయడం అప్పట్లో నేతల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలకు కారణమైంది. 2020-21 ఏడాదిలో తణుకు పట్టణానికి సమీపంలో వీరభద్రాపురం-కొమరవరంరోడ్డులో గ్రీన్ ఫీల్డ్ జోన్‌లో ఉన్న వ్యవసాయ భూములను తన బినామీలతో కారుమూరి కొనుగోలు చేయించారని ఆరోపణలున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget