అన్వేషించండి

Game Changer Event Rajahmundry: రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ ప్రి రిలీజ్ ఈవెంట్‌ రాజమండ్రికి ఎందుకు షిప్ట్‌ అయిందో తెలుసా!

ఈనెల 4న జ‌ర‌గ‌నున్న గేమ్ చేంజ‌ర్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ త‌ర‌లిరానుంది.. చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుతోపాటు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ రాజమండ్రికి ఎందుకు షిప్ట్‌ అయ్యిందో తెలుసా..
రాజమండ్రి: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్‌ మూవీ అప్డేట్‌ గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్లుగానే గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ మూవీ టీమ్‌ అయితే ముందుగా కాకినాడ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనుకుంది. దీనికోసం గత నెల రోజులుగా కూడా కాకినాడ - పిఠాపురం మధ్యలో మెయిన్‌ రోడ్డుకు ఆనుకుని భారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఆఖరి నిముషంలో మాత్రం అనూహ్యంగా గేమ్‌ చేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే వేమగిరి ప్రాంతంలో నేషనల్‌ హైవేకు ఆనుకుని ఉన్న సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలంలో ఈవెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
 
కాకినాడలో జరగాల్సిన ఈవెంట్‌ మార్పునకు కారణం ఏంటి..
 
రామ్‌ చరణ్‌ బాబాయ్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో  ఉన్నప్పుడు రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మూవీ టీమ్‌ నెల రోజుల క్రితం కాకినాడ ` పిఠాపురం మధ్య ఎక్కడైనా భారీ ప్రాంగణం గురించి పరిశీలించారు. అన్ని అనుకూలతలు ఉండేలా ఆ స్థాయిలో ముఖ్యంగా 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉండేలా ప్లాన్‌ చేశారు. అయితే ఈప్రాంతంలో ఆస్థాయి భారీ ప్రాంగణం దొరకకపోవడం రాజమండ్రికి ఈవెంట్‌ మారిందనే టాక్‌ వినిపిస్తోంది. పైగా ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతిచెందడం, అది పెద్ద వివాదంగా మారి.. నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌కు దారితీసింది. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గోదావరి జిల్లాల్లో అనువైన ప్రాంతాన్ని వెతగ్గా రాజమండ్రికి సమీపంలోని వేమగిరిలో సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఖరారుచేసి ఈవెంట్‌ అక్కడే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
గతంలో టీడీపీ మహానాడు
 
నేటి (శనివారం) సాయంత్రం జరగనున్న గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌ తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిధిలోని వేమగిరిలోని నాలుగు లైన్ల జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న భారీ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్‌ వెలుగంటి వెంకటాచలానికి చెందిన ఈభారీ ఖాళీ స్థలంలో గతంలో టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆతరువాత ప్రధాని మోదీ బీజేపీ భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించారు. సుమారు లక్ష మందికి ఎంట్రీ పాస్‌లు మూవీ టీమ్‌ ఇవ్వనుండగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, ఎస్‌బీ ఏఎస్పీ మురళీకృష్ణలు సభా స్థలాన్ని పరిశీలించి ఈవెంట్‌ నిర్వాహకులతో మాట్లాడారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్లాన్‌ను సిద్ధంచేశారు.
 
ఈవెంట్‌కు హాజరు కానున్న మెగా ఫ్యామిలీ..
 
గేమ్‌చేంజర్‌ మెగా ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం తరలిరానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నాగబాబుతోపాటు మెగా ఫ్యామిలీ అంతా తరలిరానుంది. దాంతో భారీగా జనసందోహం తరలివచ్చే అవకాశాలున్నందున అత్యంత భారీ భద్రత నడుమ ప్లాన్ ప్రకారం ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
 

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget