అన్వేషించండి

Game Changer Event Rajahmundry: రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ ప్రి రిలీజ్ ఈవెంట్‌ రాజమండ్రికి ఎందుకు షిప్ట్‌ అయిందో తెలుసా!

ఈనెల 4న జ‌ర‌గ‌నున్న గేమ్ చేంజ‌ర్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ త‌ర‌లిరానుంది.. చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుతోపాటు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ రాజమండ్రికి ఎందుకు షిప్ట్‌ అయ్యిందో తెలుసా..
రాజమండ్రి: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్‌ మూవీ అప్డేట్‌ గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్లుగానే గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ మూవీ టీమ్‌ అయితే ముందుగా కాకినాడ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనుకుంది. దీనికోసం గత నెల రోజులుగా కూడా కాకినాడ - పిఠాపురం మధ్యలో మెయిన్‌ రోడ్డుకు ఆనుకుని భారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఆఖరి నిముషంలో మాత్రం అనూహ్యంగా గేమ్‌ చేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే వేమగిరి ప్రాంతంలో నేషనల్‌ హైవేకు ఆనుకుని ఉన్న సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలంలో ఈవెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
 
కాకినాడలో జరగాల్సిన ఈవెంట్‌ మార్పునకు కారణం ఏంటి..
 
రామ్‌ చరణ్‌ బాబాయ్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో  ఉన్నప్పుడు రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మూవీ టీమ్‌ నెల రోజుల క్రితం కాకినాడ ` పిఠాపురం మధ్య ఎక్కడైనా భారీ ప్రాంగణం గురించి పరిశీలించారు. అన్ని అనుకూలతలు ఉండేలా ఆ స్థాయిలో ముఖ్యంగా 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉండేలా ప్లాన్‌ చేశారు. అయితే ఈప్రాంతంలో ఆస్థాయి భారీ ప్రాంగణం దొరకకపోవడం రాజమండ్రికి ఈవెంట్‌ మారిందనే టాక్‌ వినిపిస్తోంది. పైగా ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతిచెందడం, అది పెద్ద వివాదంగా మారి.. నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌కు దారితీసింది. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గోదావరి జిల్లాల్లో అనువైన ప్రాంతాన్ని వెతగ్గా రాజమండ్రికి సమీపంలోని వేమగిరిలో సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఖరారుచేసి ఈవెంట్‌ అక్కడే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
గతంలో టీడీపీ మహానాడు
 
నేటి (శనివారం) సాయంత్రం జరగనున్న గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌ తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిధిలోని వేమగిరిలోని నాలుగు లైన్ల జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న భారీ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్‌ వెలుగంటి వెంకటాచలానికి చెందిన ఈభారీ ఖాళీ స్థలంలో గతంలో టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆతరువాత ప్రధాని మోదీ బీజేపీ భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించారు. సుమారు లక్ష మందికి ఎంట్రీ పాస్‌లు మూవీ టీమ్‌ ఇవ్వనుండగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, ఎస్‌బీ ఏఎస్పీ మురళీకృష్ణలు సభా స్థలాన్ని పరిశీలించి ఈవెంట్‌ నిర్వాహకులతో మాట్లాడారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్లాన్‌ను సిద్ధంచేశారు.
 
ఈవెంట్‌కు హాజరు కానున్న మెగా ఫ్యామిలీ..
 
గేమ్‌చేంజర్‌ మెగా ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం తరలిరానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నాగబాబుతోపాటు మెగా ఫ్యామిలీ అంతా తరలిరానుంది. దాంతో భారీగా జనసందోహం తరలివచ్చే అవకాశాలున్నందున అత్యంత భారీ భద్రత నడుమ ప్లాన్ ప్రకారం ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget