అన్వేషించండి

Vangalapudi Anitha: ఏపీలో బాధలు భరించలేక మాజీ మంత్రులే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు - వంగలపూడి అనిత

తరువాత మేము అధికారంలోకి వస్తాం, చేతులు కట్టుకుని కూర్చుంటామా.. అంటూ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్‌ అయ్యారు. మీ బాధలు భరించలేక మాజీ మంత్రులే కన్నీరు పెట్టుకుంటున్నారు.

తరువాత మేం అధికారంలోకి వస్తాం, చేతులు కట్టుకుని కూర్చుంటామా.. అంటూ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫైర్‌ అయ్యారు. రాజమండ్రిలో అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె సోదరుడు ఎంపీ రామ్మోహన్‌ నాయుడును కలిసి సంఘీభావం తెలిపిన తరువాత అనిత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా అని ఓపెన్‌ డిబేట్‌ పెడితే మీ వాలంటీర్లు, మీకు ఓటేసినవాళ్లు, మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు మా వద్దకు క్యూ కడతారన్నారు. మీ బాధలు భరించలేక మాజీ మంత్రులే కన్నీరు పెట్టుకుంటున్నారని, మీ ఎమ్మెల్యేలే వద్దురా బాబు మీకో దన్నం అంటున్నారు. ఆఖరికి ప్రెసిడెంట్‌లు, మేయర్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీడీపీ నాయకుల మీద అవినీతి మరక అంటించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, అయిన మహా అయితే మీరు జైలులో పెట్టించగలరని అంతకన్నా ఇంకే చేస్తారు అని వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసు అంటే కిరీటం వంటిదనుకుంటున్నాం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసులంటే భయపడేవారేమో కానీ ఇప్పుడు కేసులు అంటే కిరీటం, రత్నం, వజ్రంలాంటిదని భావిస్తున్నామని, ఇంతకు మించి మీరు ఏమీ చేయలేరు అని అనిత అన్నారు. 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నాయకులమీద అవినీతి మరక అంటించేందుకు ప్రయత్నిస్తున్నారంటే మీమీద ఎంతటి ప్రజ్యావతిరేకత ఉందో అర్ధం చేసుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు.

కుక్క బ్రతుకు అయిపోవడమంటే ఇదేనేమో..
మొన్నటి వరకు జగనన్నే మా నమ్మకం అంటూ స్టిక్కర్లు అంటించారు. అవి కుక్కలు, కోతులు పీకేస్తున్నాయని, స్టిక్కర్లును కూడా కుక్కలు లాగేయడమంటే ఇదేనేమో, కుక్కలకు కూడా నచ్చడం లేదన్నారు. కుక్క బత్రుకు అయిపోవడమంటే ఇదేనేమోనని ఎద్దేవా చేశారు. మళ్లీ ఇప్పుడు జగనన్నకు చెబుదాం అంటూ సీఎం జగన్‌ రెడ్డి ఓఫోన్‌ పట్టుకుని టోల్‌ఫ్రీ నెంబర్‌ పెట్టుకునేకంటే జనాల వద్దకు వెళ్లేటప్పుడు పరదాలు లేకుండా వెళ్లాలని ఛాలెంజ్‌ విసిరారు. వాళ్ల డబ్బావాళ్లు కొట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. భక్త జన బృందం మాత్రం జగన్‌ను జాకీలేసి లేపుతున్నారన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసులతో ములాఖత్‌ అయ్యేందుకు జైలు వద్దకు మా నాయకుడు చంద్రబాబు వస్తే ములాఖత్‌కు పర్మిషన్‌ ఇచ్చినందుకు అర్ధరాత్రి గిరిజన సూపరింటెండెంట్‌ ను ఎందుకు బదిలీచేశారని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ మంత్రిపై పరోక్ష విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీల దాడులు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి సైకో పాలన చేస్తున్నాడని విమర్శించారు.

అక్కడ రామోజీ, ఇక్కడ ఆదిరెడ్డిపై వేధింపులు..
ఓ మీడియా అధినేత రామోజీరావు గొప్ప వ్యక్తి అని, 30 ఏళ్లుగా లేని మచ్చలన్నీ జగన్మోహన్‌ రెడ్డికే కనిపిస్తున్నాయని అనిత సెటైర్లు వేశారు. అదేవిధంగా ఆదిరెడ్డి భవానీ కుటుంబంపై పడ్డారని, గత 30 ఏళ్లుగా వ్యాపారంలోనే కాదు, ప్రజా జీవితంలోనూ ఉన్నారు. ఒక్కఛాన్స్‌ వేవ్‌లో కూడా 30 వేలు మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఎవ్వరూ కంప్లైంట్‌ ఇవ్వకున్నా.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సీఐడీ పోలీసులను ఉపయోగించి సీఎం జగన్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు అనిత.

కంప్లైంట్‌ లేకున్నా వేధిస్తున్నారు.. 
గత 25 ఏళ్లుగా ఆదిరెడ్డి కుటుంబం వ్యాపారం చేస్తోందని అయితే ఇప్పుడు ఎవ్వరూ కంప్లైంట్‌ ఇవ్వకున్నా సీఐడీ పోలీసులు ఇంటివరకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కనీసం సుమోటోగా తీసుకునేందుకు ఏదైనా పత్రికలోనూ, టీవీల్లోనూ వచ్చిందా.. కక్ష కట్టి సీఐడీ పోలీసులను పంపించి అరెస్ట్‌లు చేయాల్సిన అవసరం ఏముందని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నామని రాష్ట్రానికి ఇదేం కర్మ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget