News
News
X

టీడీపీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత- వైసీపీలో చేరిన వెంటనే పదవీయోగం !

తెలుగుదేశం సీనియర్‌ నేత జయమంగళ వెంకట రమణ వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు.. వెంటనే ఆయన్ని ఎమ్మెల్సీ పదవి వరించనుందని సమాచారం.

FOLLOW US: 
Share:

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మారే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులనే చూశాం.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 

తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ పార్టీ మారుతున్నారు. ఆయన సైకిల్‌ దిగి.. ఫ్యాన్‌ గూటికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం జగన్‌తో సమావేశమై పార్టీ కండువా కప్పుకోనున్నారు. 

కైకలూరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న జయమంగళ వెంకట రమణ చాలా కాలం నుంచి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని టాక్. అవకాశం కోసం చూస్తున్న ఆయనకు వైసీపీ ఆఫర్ ప్రకటించిందని తెలుస్తోంది.  ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పడంతో వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారని సమాచారం. 

వెంకటరమణ పార్టీలోకి తీసుకురావడంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 
ఇప్పుడు ఏపీలో వచ్చే నెలలో ఖాళీలు అయ్యే స్థానాలతో కలుపుకొని మొత్తం పద్నాలు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందలో ఒకటి వెంకటరమణకు ఇవ్వబోతున్నట్టు వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

వెంకటరమణ పని తీరు బాగాలేదని.. అందుకే ఆయన్ని కైకలూరు స్థానం నుంచి తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని ఎప్పటి నుంచో టీడీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకట రమణ పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. 

జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటిసి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యేఅయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలంగా కనిపించడం లేదు. 

Published at : 13 Feb 2023 11:17 AM (IST) Tags: YSRCP MLC Telugu Desam Party Jagan Jayamangala Venkata Ramana

సంబంధిత కథనాలు

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

MP Bharat Fires On Raghurama : పండు కోతిలా ఉండే నవ్వు నన్ను నల్లోడా అంటావా? రఘురామకృష్ణరాజుపై ఎంపీ భరత్ ఫైర్

MP Bharat Fires On Raghurama : పండు కోతిలా ఉండే నవ్వు నన్ను నల్లోడా అంటావా? రఘురామకృష్ణరాజుపై ఎంపీ భరత్ ఫైర్

East Godavari Crime News: పశ్చిమ గోదావరి జల్లాలో ఇసుక వ్యాపారి ప్రేమ్ రాజు ఆత్మహత్య కలకలం

East Godavari Crime News: పశ్చిమ గోదావరి జల్లాలో ఇసుక వ్యాపారి ప్రేమ్ రాజు ఆత్మహత్య కలకలం

Konaseema District News: హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడ్డ నర్సింగ్ విద్యార్థిని - ఎవరో తోసేశారన్న బాధితురాలు!

Konaseema District News: హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడ్డ నర్సింగ్ విద్యార్థిని - ఎవరో తోసేశారన్న బాధితురాలు!

టాప్ స్టోరీస్

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్