అన్వేషించండి

Raghurama Cancelled Bhimavaram Tour: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో ఎంపీ రఘురామ పేరు లేదు: ఏలూరు డీఐజీ క్లారిటీ

Raghurama Cancelled Bhimavaram Tour: భీమవరం వచ్చేందుకు బయలుదేరిన ఎంపీ రఘురామ మధ్యలోనే ట్రైన్ దిగి ఇంటికి వెళ్లిపోయారు. ప్రధాని మోదీ పర్యటనకు ఎంపీ రఘురామ హాజరవుతారని ఏ జాబితాలో లేదని పోలీసులు తెలిపారు.

Raghurama Cancelled Bhimavaram Tour: వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చివరి నిమిషంలో భీమవరం పర్యటనను విరమించుకోవడం తెలిసిందే.  భీమవరం వచ్చేందుకు బయలుదేరిన ఎంపీ రఘురామ మధ్యలోనే ట్రైన్ దిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లింగంపల్లిలో రైలు ఎక్కిన ఎంపీ రఘురామకృష్ణరాజు బృందం బేగంపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగిపోయారు. ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కార్యక్రమానికి నరసాపురం ఎంపీ రఘురామ హాజరవుతానని ఇటీవల ప్రకటించారు. చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకుని ఏపీ ప్రభుత్వానికి ట్విస్ట్ ఇచ్చారు.

రఘురామకృష్ణరాజు ఏ జాబితాలోనూ లేరు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటనలో తాను పాల్గొంటున్నట్లు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించారు. తనను ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అయితే ప్రధాన మంత్రి ఆఫీసు నుంచి వచ్చిన జాబితాలో గానీ, ఆ వేదికపై ఉండే వారి జాబితాలోగానీ, లేదా ప్రధాని మోదీని హెలిప్యాడ్ వద్ద ఆహ్వానించే వారి జాబితాలో కూడా ఎంపీ రఘురామ పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈవెంట్‌కు ఎంపీ రఘురామ ఎలా హాజరు అవుతున్నారో తమకు తెలియదన్నారు. నరసాపురం ఎంపీ విషయంలో తాము చట్టాన్ని అనుసరిస్తామని, అదే విధంగా రఘురామ ఫోన్ నెంబర్‌ను సైతం రాష్ట్ర పోలీస్ శాఖ బ్లాక్ లిస్టులో పెట్టలేదని వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనకు హాజరయ్యే వారిలో వాయుమార్గంలో రావాలనుకున్న వారు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.

మా వాళ్లను అక్రమంగా నిర్బంధించారు: రఘురామ 
తాను నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయలుదేరానని ఎంపీ రఘురామ ఆదివారం రాత్రి తెలిపారు. అయితే తాను రైల్వే స్టేషన్ కు వచ్చే లోపు తన వాళ్లను ఇప్పటివరకూ 50 మందిని అరెస్టుచేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు. వారిలో కొంత మందిని కొడుతూ పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. తన వాళ్ల కోసం వారి తల్లిదండ్రుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, అభిమానులు, మద్దతుదారుల క్షేమం కోసమే తాను భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. తన ప్రయాణం రద్దు చేసుకుంటేనే, అభిమానులను వదిలేస్తామని సమాచారం అందడంతో చివరి నిమిషంలో భీమవరం వెళ్లకుండా మార్గం మధ్యలోనే రైలు దిగానని వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు బయలుదేరిన తాను ప్రయాణం మధ్యలో ఆగిపోవడానికి గల కారణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన దారుణమైన కుట్రలపై నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ ఫేస్‌బుక్ లో ఓ వీడియో రూపంలో తెలిపారు.

Also Read: MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోనే ట్రైన్ దిగిపోయిన ఎంపీ  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
Embed widget