అన్వేషించండి

Leopard In Rajahmundry: రాజమండ్రి శివార్లులో చిరుత సంచారం-భయాందోళనలో ప్రజలు!

Rajahmundry: రాజ‌మండ్రి లాలాచెరువు శివారు ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలతో చిరుతగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు.

East Godavari News: ఏడాదిన్నర కాలం క్రితం కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది.. చివరకు అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.. ఆరు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు మండలం శివారు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం చేస్తుందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి.. ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి శివారు  లాలాచెరువు సమీపంలో దూరదర్శన్‌, ఆల్‌ఇండియా రేడియో రిలే స్టేషన్‌ ప్రాంగణంలో చిరుత పులి సంచారం చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి..

శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో పంది వెనుక మాటు వేసి వెళ్తు దానిపై దాడికి పాల్పడిన దృశ్యాలను బమ్మూరు పోలీసులకు దూరదర్శన్‌ సిబ్బంది అందజేశారు. అయితే గురువారం రాత్రి కూడా చిరుతపులికి సంబందించిన అలజడి అయితే లాలాచెరువు శివారు ప్రాంతంలో కనిపించిందని పలువురు స్థానికులు చెప్పారు..  అదే రోజు హౌసింగ్‌బోర్డు కాలనీ పుష్కరవనం వద్ద పులి ఏదో జంతువును నోట కరిచుకుని రోడ్డు దాటిందని, ఆతరువాత అది ఫారెస్ట్‌ క్వార్టర్స్‌ వైపుగా వెళ్లిందని మరికొందరు వాహనచోదకులు తెలిపారని కొందరు తెలిపారు.. అయితే దీనిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా దూరదర్శన్‌ కేంద్రం వద్ద సీసీ కెమారాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

చిరుతపులిగా నిర్ధారించిన ఫారెస్ట్‌ అధికారులు..

రాజమండ్రి శివారు లాలాచెరువు వద్ద పులి సంచారంపై వస్తున్న వార్తల విషయంలో జిల్లా అటవీశాఖ అధికారులు నిజనిర్ధారణ చేపట్టారు.. అది సంచరించిందని చెబుతున్నవారి ద్వారా వివరాలు సేకరించి ఆపై దాని పాదముద్రల ఆనవాళ్లును గుర్తించే పనిలో నిమగ్నమయినా పూర్తిస్థాయి సమాచారం రాలేదు.. అయితే దూరదర్శన్‌ కేంద్రం వద్ద లభ్యమైన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు అక్కడ లభించిన పాదముద్రల ద్వారా అక్కడ సంచారం చేసింది చిరుత పులేనని నిర్ధారణకు వచ్చారు. 

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
జనావాసాల వద్ద చిరుత పులి సంచారం చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు హెచ్చరించారు. పులి అడుగులను గుర్తించి అది చిరుతపులిగా గుర్తించామని వెల్లడిరచారు. దీంతో లాలాచెరువు ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు- మరో రెండు రోజులు కుండపోతే!

ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు.. 

రాజమండ్రి శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులిని గుర్తించి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటుచేశారు. పులిసంచారంపై ఓ నిర్ధారణకు వచ్చిన అధికారులు ట్రాప్‌ కెమెరాల ద్వారా దాని కదలికలను గుర్తించి ఆపై బోన్‌ ద్వారా దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈలోపు ఎక్కడైనా పులికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించినా వెంటనే సమాచారం అందివ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాజమండ్రికి పులిసంచారం కొత్తకాదు..

రాజమండ్రి శివారు ప్రాంతం అటవీప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఆవాసాల మధ్యకు పులుల సంచారం గతంలో కూడా చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. 2008లో స్థానిక లలితానగర్‌లోకి ఓ చిరుత పులి చొరబడి తీవ్ర అలజడి రేపింది. ఓ బాత్‌రూమ్‌లో నక్కిఉండడంతో గమనించిన స్థానికులు బాత్‌రూమ్‌ గడియపెట్టి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు. 2011లో ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ బేస్‌కాంప్లెక్స్‌ ప్రాంగణంలో ప్రవేశించిన చిరుతపులి ఓ పెంపుడుకుక్కపై దాడి చేసింది. చివరకు బోనులు ఏర్పాటుచేసి బంధించారు. ఇదే ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌లో 2018లోనూ రెండు చిరుత పులులు చొరబడగా వాటిని బోన్లు ద్వారా ఫారెస్ట్‌ అధికారులు బందించారు. ఆతరువాత సెంట్రల్‌జైలుకు సమీపంలో కూడా ఓసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. తాజాగా లాలా చెరువు సమీపప్రాంతంలో చిరుత సంచారం కలవరాన్ని రేపింది. అయితే రాజమండ్రివైపుగా వస్తున్న పులులన్నీ అడ్డతీగల అటవీప్రాంతం నుంచే దారితప్పి వస్తున్నట్లు భావిస్తున్నారు అధికారులు.. 

Also Read: పరాయి వ్యక్తితో మాట్లాడింద‌ని దారుణం, ఆ వ్యక్తితో వివాహితకు బలవంతంగా పెళ్లి!

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget