అన్వేషించండి

MP Margani Bharat: రాజమండ్రి మహానాడులో తొక్కిసలాట జరిగితే చంద్రబాబుదే పూర్తి బాధ్యత: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ భరత్

MP Margani Bharat: రాజమండ్రిలో జరిగే మహానాడులో ఏదైనా జరిగితే చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్.

MP Margani Bharat: మహానాడు అంటూ హడావుడి చేస్తున్న టీడీపీ లీడర్లు అనుమతులు లేకుండా ఇష్టం వచ్చిన చోట తవ్వకాలు చేస్తున్నారని ఫ్లెక్సీలు కడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. అధికారులు అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా జనాలు ఎక్కువ కనిపించేలా ఇరుకుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శించారు. అందుకే అక్కడ తొక్కిసలాట జరిగినా, ఎవరికీ ఏమైనా అయినా పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు భరత్. 

అలాంటి ప్రచారం పిచ్చితోనే రాజమండ్రి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్ట బెట్టుకుంది టీడీపీ అధినేత చంద్రబాబే అంటూ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. పుష్కరాల సమయంలో జనాలందరినీ రాత్రి నుంచి అక్కడే ఉండి జమ చేసి డ్రోన్ షాట్లు, వీడియోలు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత వీళ్లు కుటుంబ సమేతంగా పూజలు జరిపించుకున్న తర్వాతే రాత్రి నుంచి అక్కడే ఉన్న వేలాది మంది ప్రజలను ఒక్కసారిగా వదలడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు.

పుస్కరాల తొక్కిసలాట ఘటనపై సోమయాజులు అనే ఓ కమిషన్ వేశారని అన్నారు. మీడియా, భక్తుల అత్యుత్సాహం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ఆ కమిటీ తెలిపిందన్నారు. ప్రమాదానికి కారణం అయిన చంద్రబాబుకు, 29 మంది మృతికి ఎలాంటి సంబంధం లేదని చివరకు తేల్చి చెప్పడం దారుణం అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఇంతకంటే దారుణం అయిన విషయం ఇంకేమైనా ఉంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబు తప్పు చేసి ఉండకపోతే.. ఆరోజు అంటే తొక్కిసలాట జరిగిన రోజు సీసీటీపీ ఫుటేజీని విడుదల చేయాలని సవాల్ విసిరారు. 29 మంది మృతికి, 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలవడానికి కారణం చంద్రబాబే అంటూ చెప్పుకొచ్చారు. 

పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ దూరం

చంద్రబాబుది ఎవరినైనా వాడుకుని వదిలేసే మనస్తత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను దేవుడు అంటూనే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో కూడా వాడి పేరు తీసేయాలంటూ ఎన్టీఆర్ గురించి చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే పార్టీ లేదు బొక్కా లేదంటూ చేసిన కామెంట్లను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు.

పిల్లనిచ్చిన మామమే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు చేయడం ఏంటని అన్నారు. చంద్రబాబు బుద్ధిని ముందుగా గ్రహించే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మహనాడు పేరుతో రాజమండ్రి నగరాన్ని టీడీపీ నేతలు అస్తవ్యస్థం చేస్తున్నారని ఎంపీ భరత్ ఫైర్ అయ్యారు. మహానాడు జరిగేది రూరల్ మండలంలో అయితే టీడీపీ నేతలు సిటీలో హడావిడి చేస్తున్నారన్నారు.

మహానాడుకు అవసరమైతే తాము వాలంటరీ సేవలు అందిస్తామని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. కార్యక్రమాన్ని ఎలాంటి అపశృతులు లేకుండా జరిపించాలని సూచనలు చేశారు. ఏదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత చంద్రబాబే తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

దెందులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని.. తాను వాహనంలో ఉన్నానని నిరుపించడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారన్నారు. ఆ వాహనం తన పేరు మీద లేదని.. అలాగే ఆ వాహనంలో కూడా తాను లేనని పేర్కొన్నారు. జగన్ అన్న ప్రభుత్వంలో విద్యా దీవెన, అమ్మవడి నూతన ఒరవడి సృష్టించిందని ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కాలేజీలకు బకాయి పెట్టిందన్నాురు. నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తుంది వైసీపీ ప్రభుత్వమే అన్నారు.  ఇప్పటికే 14 వేల కోట్ల రూపాయలను ఫీ రీయంబర్స్ మెంట్ కింద చెల్లించినట్లు తెలిపారు. వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకో వందకు 98.4 శాతం హామీలను నెరవేర్చినట్లు వివరించారు. 

మహానాడు అంతా ఓ మోసం: మంత్రి వేణు

రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడు అంతా ఓ మోసం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. ఎన్టీఆర్ పేరును చంద్రబాబు చెరిపేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లాను సీఎం జగన్  ఏర్పాటు చేశారని వివరించారు. అందుకు మహానాడులో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయండంటూ టీడీపీకి సూచించారు. పుష్కరాల్లో 29మంది మరణాలకు పశ్చాత్తాపం పడుతూ మహానాడులో తీర్మానం చేయాలన్నారు. అలాగే చంద్రబాబును నమ్ముకుని నాడు ఎన్టీఆర్ రాజకీయ జీవితం క్లోజ్ అయిందని ఆరోపించారు. నేడు చంద్రబాబు కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం క్లోజ్ అయిందన్నారు. పవన్ సీఎం అవుతారని అనుకున్నవారు ఇప్పుడు నిరాశలో ఉన్నారని మంత్రి వేణు వివరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Donald Trump: ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Embed widget