అన్వేషించండి

Akhanda Godavari Project: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన, డబుల్ ఇంజిన్ సర్కార్‌కు అర్థం చెప్పిన పవన్ కళ్యాణ్

AP Deputy CM Pawan Kalyan | అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం జరిగిన సైన్స్ కేంద్రం ప్రారంభం, ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌, బీజేపీ ఎంపీ పురందేశ్వరి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో కేంద్రంతో కలిసి కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టింది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా చారిత్రక నగరం రాజమహేంద్రవరంను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది తీరం. ఇలాంటి చోట నాగరికత, భాష ఉంటాయి. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జన్మించిన నేల. ఆదికవి నన్నయకు జన్మనిచ్చిన నేల. బాపు రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ సహా ఎంతో సాహితీవేత్తలు, ప్రముఖులు పుట్టిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని భావించాం. రూ.430 కోట్లతో ఈరోజు మొత్తం 7 ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ముఖ్యమైనది అఖండ గోదావరి ప్రాజెక్టు. 


Akhanda Godavari Project: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన, డబుల్ ఇంజిన్ సర్కార్‌కు అర్థం చెప్పిన పవన్ కళ్యాణ్

2024 ఎన్నికల సమయలో కూటమి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పింది. పర్యాటక రంగంలో 800 మందికి ఉపాధి దొరుకుతుంది. అన్ని ప్రాజెక్టులు, పనులు పూర్తయితే ఏడాదికి 4 లక్షల మంది పర్యాటకులు వస్తారు. ఎంపీ పురంధేశ్వరి చెప్పినట్లు డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి చెప్పారు. సీసీ పవర్ ఎక్కువుంటే బండి అంత ముందుకు వెళ్తుంది. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ మన ప్రభుత్వం ఉంటే పనులు వేగంగా, అనుకున్నట్లుగా జరుగుతాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థం ఇదే. 

35 లక్షల మందిని ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్టు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా జల్ శక్తి మంత్రిగా ఉండి కూడా బీజాలు వేసింది కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావల్. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి సైతం ఆయన సహకరించారు. ఏపీకి కావాల్సిన సాయం చేయడానికి కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అఖండ గోదావరి హేవ్ లాక్ వంతెన (Havelock Bridge). 970 కిలోమీటర్ల తీరం ఏపీకి ఉంది. మిగతా దేశాల్లో ఇలాంటి ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేస్తారు. కానీ మనం నదిని జీవనంలో, సంస్కృతిలో భాగంగా చూస్తాం. పుష్కర ఘాట్లలో మన సంస్కృతి, కళలకు సంబంధించి షాపులు పెడతారు. కందుల దుర్గేశ్ నాయకత్వంలో టూరిజం డెవలప్ అవుతుంది. కేంద్రం సహకారంతో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్టును తీర్చిదిద్దుతాం. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఈ ప్రాజెక్టును గొప్పగా ముందుకు తీసుకెళ్లినందకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. వీరులు పుట్టిన రాజస్తాన్ గడ్డ నుంచి వచ్చారు గజేంద్ర సింగ్ షేకావత్. అలాంటి పౌరుషం ఉన్న గడ్డ నుంచి వచ్చిన ఆయనకు అలాంటి వీరత్వం ఉన్న ఏపీ గురించి బాగా అర్థమవుతుందని’ పవన్ కళ్యాణ్ అన్నారు.

అంతకుముందు ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటిక్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జనసేన, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా పుష్కర ఘాట్ కు చేరుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
Eluru Railway Station: ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
Embed widget