అన్వేషించండి

Viral News: డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి, కోనసీమ జిల్లాల్లో విషాదం

Dasara ending celebration: ఉత్సవాలకు వినియోగిస్తున్న డీజేలు ప్రాణాలు తీస్తున్నాయి. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ఉత్సవంలో జరిగిన ఇదే తరహా సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. 

Konaseema Crime News | ఉత్సవాలకు వినియోగిస్తున్న డీజేలు ప్రాణాలు తీస్తున్నాయి.. గతంలో డీజే సౌండ్‌ బాక్సుల ముందు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన సంఘటనలు చాలానే జరిగాయి. డీజే సౌండ్‌ బాక్సుల నుంచి వచ్చే పరిమితికి మించి గుండెలదిరేలా వచ్చే సౌండ్‌తో చిట్టి గుండెలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి.. దసరా ఉత్సవంలో ఇదే తరహా సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. 

కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ఉత్సవం అనగానే వెంటనే గుర్తొచ్చేది చెడీతాలింఖానా. ఈ ప్రదర్శనలతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా దసరా ముగింపు కార్యక్రమాలు శనివారం అమలాపురంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ ఊరేగింపుకోసం డీజే సౌండ్‌లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వీటికి పోలీసులు కూడా అనుమతులు ఇచ్చారు.

అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు స్థానిక కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. శనివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో డీజే సౌండ్‌ బాక్సుల ముందు యువకులు డ్యాన్స్‌లు చేస్తున్నారు. అంతా సంతోషంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటీన అమలాపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయువకుడు మృతిచెందినట్లు నిర్ధారించారు.

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన యువకుడిని పప్పుల వినయ్‌ (21)గా గుర్తించారు. అమలాపురం రూరల్‌ మండలం బండారులంక గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. దసరా ఉత్సవాల కోసం కొంకాపల్లికి వచ్చిన వినయ్‌ గుండెపోటుతో మృతిచెందడంతో విషాదం నెలకొంది.  డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత దగ్గరగా డ్యాన్స్‌లు చేయడం వల్ల గుండె లయ తప్పి కార్డియాక్‌ అరెస్ట్‌ అయినట్లు భావిస్తున్నారు.

గతంలో ఎన్నో సంఘటనలు..

డీజే సౌండ్‌ ప్రకంపనలకు గతంలో గుండె ఆగిపోయి మృతిచెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. తెలంగాణాలోని వివాహం అనంతరం జరిగే వేడుకలో నూతన వరుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు.. దీంతో పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది ఈ సంఘటన.. తెలుగు రాష్ట్రాల్లో పలు ఉత్సవాల్లో డీజే సౌండ్‌ బాక్సుల ముందు డ్యాన్స్‌లు చేస్తూ కుప్పకూలి మృతిచెందిన సంఘటనలు చాలా జరిగాయి.. గతేడాది అనంతపురం జిల్లా ధర్మవరంలో గణపతి మండపం ముందు డీజే బాదాడు.. తెలంగాణాలోని నిర్మల్‌ జిల్లాలో కూడా ఈతరహా సంఘటన చోటుచేసుకుక్సుల ముందు ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి గుండెపోటుతో మృతిచెంంది..  తాజాగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అమలాపురంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో విషాదాన్ని నింపింది..

పరిమితికి మంచి వచ్చే సౌండ్‌తో కార్డియాక్‌ అరెస్ట్‌లు..

ఉత్సవాల ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ బాక్సులు పదుల సంఖ్యలో ఏర్పాటు చేసి ఆపై పరిమితికి మించిన సౌండ్‌ను వదులుతుండడం వల్లనే ఈతరహా కార్డియాక్‌ అరెస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత దగ్గరలో అంటే కేవలం ఒక మీటరు దూరంలోనే డ్యాన్స్‌లు చేయడంతో స్పీకర్లు నుంచే వచ్చే ధ్వనితో ఈ ప్రభావం చెవులు, గుండెపై పడుతుందని హెచ్చరిస్తున్నారు... ఈ డీజే సౌండ్‌ బాక్సు ముందు డ్యాన్స్‌లు చేసిన వారు రెండు రోజుల వరకు చిన్న చిన్న శబ్ధాలను వినే సామార్ధ్యాన్ని కోల్పోతారని, ఇది చాలా మందిని పరిశీలిస్తే గమనిస్తామంటున్నారు. సాధారణంగా మన చెవులు 70 డిజెబుల్స్‌ వరకు తట్టుకోగలవు.. కానీ డీజే సౌండ్‌ బాక్సుల నుంచి 100 నుంచి 130 డిసిబెల్స్‌ వరకు ధ్వనిని వ్యాప్తిచేస్తున్నాయని, దీనికి తోడు అత్యధిక బేసే ధ్వనిని విడుదల చేయడం, ఈ ధ్వని తరంగాలు గుండెకు అనుసంధానంగా ఉండే కర్ణికను ప్రేరేపిస్తుందని, దీనివల్ల గుండెపోటుకు దారితీస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.. ధమనుల్లో అధిక రక్తపోటు, ఆర్టీఫీషియల్‌ హైపర్‌ టెన్షన్‌ పెరిగి గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి సంభవించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. 

హైదరాబాద్‌లో డీజే సౌండ్స్‌ నిషేధం

సౌండ్‌ పొల్యూషన్‌తో ప్రజలు ప్రాణాలకు ప్రమాదంగా మారిన డీజే సౌండ్‌లను హౖెెదరాబాద్‌లో పోలీసులు నిషేదం విధించారు. మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపుల్లో డీజే సౌండ్స్‌ వినియోగించకూడదని ఉత్సవ కమిటీలకు ఆదేశాలు జారీచేశారు.. దీనిపై హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి అమలు చేయాలని ఆదేశించారు. డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు, హృదయ సంబంధిత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై ఫిర్యాదులు పెరగంతో ఈనిర్ణయం తీసుకున్నామని వెల్లడిరచడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అయితే కేవలం హైదరబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల డీజే సౌండ్‌లను నిషేదించాలని ప్రజలు కోరుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget