అన్వేషించండి

CM Jagan Photo: సీఎం జగన్ ఫోటోను రథంపై ఊరేగించిన ప్రజలు, ఈ సంబరాలు ఎందుకో తెలుసా?

ఈ నాలుగు గ్రామాలకు ఇప్పుడు వంతెన నిర్మాణం కల సాకారమవ్వబోతోంది. గత వరదల సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి హామీ ఇచ్చారు.

లంక వాసులంతా దాదాపు ఒక్కటై ఈ హడావిడి చేశారు.. ఇంతకీ ముఖ్యమంత్రి జగన్‌పై ఎందుకింత అభిమానాన్ని చూపించారనే కదా.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లంక గ్రామాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గంటి పెదపూడి వద్ద గోదావరి పాయ అవతలివైపున ఉన్న నాలుగు గ్రామాల ప్రజలకు రోడ్డు సదుపాయం లేదు. వేసవి కాలంలో అయితేనే ఎండిపోయిన నదీపాయమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.. అదే వరదల సమయంలో అయితే ఖచ్చితంగా పడవలే ఆశ్రయం.. దశాబ్ధాల కాలంగా వంతెన నిర్మించాలని ఈ గ్రామాల ప్రజల చిరకాల కోరిక.. ఈ కల ఇంతవరకు నెరవేరలేదు. వరదల సమయంలో పరీక్షలు రాసే విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోగుల అవస్థలు వర్ణనాతీతం.. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు గ్రామాలకు ఇప్పుడు వంతెన నిర్మాణం కల సాకారమవ్వబోతోంది.. దీంతో ఈ గ్రామాల ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది..

హామీ ఇచ్చి రూ.50 కోట్లు విడుదల..

ఇటీవల కోనసీమకు వరదలు పోటెత్తిన సందర్భంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో ఊడిమూడలంక, గంటిపెదపూడి లంక, అరిగెలవారిపేట, బూరిగులంక,  వద్ద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అన్నట్లుగానే యద్ధప్రాతిపదికన ఈ లంక గ్రామాలకోసం వంతెన నిర్మాణం చేపట్టేందుకు రూ.50 కోట్లు విడుదల చేశారు. దీంతో ఈప్రాంతాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పరిశీలన చేసి 
వంతెన నిర్మాణ పనులు కోసం సాంకేతిక నిపుణులు పరిశీలన చేస్తున్నారు. దీంతోఈలంక గ్రామాల ప్రజల సంతోషానికి అవధులు లేకుండాపోయింది. దశాబ్ధాల కాలంగా తాము పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయని భావించిన ఈ లంక గ్రామాల ప్రజలు సీఎం జగన్‌ చిత్రపటాన్ని రధంపై ఊరేగించారు. బ్యాండు మేళాలు, బాణాసంచా డప్పు వాయిద్యాల నడుమ సీఎం ఫోటోను ఊరేగించి ఆపై పాలాభిషేకం చేశారు.  

వంతెన నిర్మాణ స్థలంపై వివాదం..

వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.50కోట్లు మంజూరు చేయగా ఈ వంతెన మాగ్రామ పరిధిలో నిర్మించాలంటూ రెండు గ్రామాల ప్రజలు పట్టుపట్టడం కొంత వివాదానికి ఆజ్యం పోస్తోంది. దీనిపై సాంకేతిక నిపుణులు ఇప్పటికే రెండుచోట్ల సాయిల్ టెస్ట్ లు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఊడిమూడి లంక గామపరిధిలోకి వచ్చే చింతావారిపేట, ఉచ్చులవారిపేట వద్ద పూర్వం శంకుస్థాపన చేశారు. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని, కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు.. అందుకే వంతెన నిర్మాణం ఇక్కడే చేపట్టాలని కోరుతున్నారు ఆ గ్రామస్తులు.. ఇదిలా ఉంటే గంటి పెదపూడి వద్ద కొంత మంది వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఇది చినికి చినికి కొంత వివాదాన్ని రేపగా అధికారుల ఇరు గ్రామాల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget