అన్వేషించండి

Godavari Flood: గోదావరి మహోగ్రరూపం- ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari News: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరంతా గోదావరిలోకి చేరడంతో మహోగ్రరూపం దాల్చింది. దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.

Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటితో పోటెత్తుతోంది. పదిలక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు వస్తుండటంతో ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..

వదలని వరుణుడు
జోరువానలతో ఉమ్మడి గోదావరి(Godavari) జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. లంకగ్రామాల్లోకి నీరు చేరి పంటపొలాలన్నీ నీటమునిగాయి. బాహ్య ప్రపంచంతో లంకగ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం(Dhavaleswaram) వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోనసీమలో వరి పంట మొత్తం నీట మునిగింది. మూడురోజులుగా  వరద నీటిలోనే పంట నానిపోవడంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. డ్రెయిన్‌లు బాగుచేయకపోవడంతో మురుగునీరు బయటకి పోయే పరిస్థితులు లేవు. 

గోదావరికి వరదపోటు
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు తోడు..ఛత్తీస్‌గడ్‌ నుంచి భారీగా వరదనీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో కోనసీమవాసులు(Konasema) బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం(Polavaram) ప్రాజెక్ట్ ఎగువ కాపర్‌డ్యాంను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు దాటగా...అంతే మొత్తంలో నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ బృందాలను సిద్ధం చేసింది. గోదావరి మహోగ్రరూపంతో లంకగ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఏ క్షణంలో వరద వచ్చి మీదపడిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లంకల్లోని భూములన్నీ నీట మునిగాయి. కూరగాయలు, ఆకుకూరలు తొటలన్నీ గోదావరి(Godavari) నీటిలో కలిసిపోయాయి. గోదావరి ఉద్ధృతికి లంక భూములు కోతకు గురవుతోంది.

పొంగుతున్న ఉపనదులు
మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరి(Sabari), ప్రాణహిత(Pranahitha), ఇంద్రావతి(Indravathi),తాలిపేరు(Taliperu), కిన్నెరసాని(Kinerasani) ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువున ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వీటికి తోడు వాగులు, వంకల నుంచి పెద్దఎత్తున నీరు గోదావరిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌ 48 గేట్లను ఎత్తి దిగువు నీటిని విడుదల చేస్తున్నారు. శబరి ఉద్ధతికి చింతూరు(Chinthuru), వీఆర్‌పురం(V.R.Puram) మండలంలో రాకపోకలు నిలిచిపోయాయి. కుయినూరు వాగు ఉద్ధృతితో ఏపీకి ఒడిశాకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వేలేరుపాడు మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది. 30 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అధికారులు అప్రమత్తం
గోదవరికి వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరికి వరద మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో బలహీనంగా ఉన్న ఏటిగట్లు వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. నీట మునిగిన లంకగ్రామాలకు బోట్లు ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. అటు బ్రిడ్జిలు తెగిపోయి రాకపోకలు నిలిచిన ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. వాహన ప్రయాణికులు వరద నీటిని దాటకుండా తిప్పి వెనక్కి పంపిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమినిస్తూ...దిగువకు విడుదల చేస్తున్నారు. ఏటిగట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
Uttar Pradesh : రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు  ?
రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు ?
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Embed widget