అన్వేషించండి

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం

Kakinada Crime News | కాకినాడ గాంధీనగర్‌లో APSP కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

కాకినాడ: కాకినాడ నగరంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్ నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఒక్కసారిగా దాడి చేసిన నిందితులు, కత్తితో గొంతు కోయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సొంత బామ్మర్దులే హత్య చేశారా..!

నాగేశ్వరరావు ఏపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన గాంధీ నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ గొడవల కారణంగా సొంత బావమర్ధులే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ 
దళిత యువకుడు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో పోలీసులు మరో ఇద్దరు నిందితులు కడియాల చిన్నబాబు(A2), కడియాల సతీశ్‌(A3)లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న వీరిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అనంతబాబు ఆదేశాలతో చిన్నబాబే సాక్షులను బంధించి, ప్రలోభాలకు గురిచేసి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచే చిన్నబాబు ఫోన్‌కు వీడియో కాల్ చేసి సాక్షులను బెదిరించినట్లు సమాచారం. మాజీ మంత్రి కన్నబాబుకు సన్నిహితుడైన చిన్నబాబును విచారిస్తే, సాక్షుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది.

చేపల చెరువులో పడి ఇద్దరు మృతి..
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం కాకాని చేపల చెరువులో మేతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు పడవ బోల్తా పడటంతో మృతి చెందారు. కొమ్మాలపాడు వాసులు చెరువును లీజుకు తీసుకొని చేపల పెంపకం చేపట్టారు. ఆదివారం చేపల మేతకు చెరువులోకి వెళ్లగా పడవ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మృతులు అగ్రహారానికి చెందిన హుస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేగా పోలీసులు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Advertisement

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
10K Steps Daily : రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Embed widget