అన్వేషించండి

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం

Kakinada Crime News | కాకినాడ గాంధీనగర్‌లో APSP కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

కాకినాడ: కాకినాడ నగరంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్ నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఒక్కసారిగా దాడి చేసిన నిందితులు, కత్తితో గొంతు కోయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సొంత బామ్మర్దులే హత్య చేశారా..!

నాగేశ్వరరావు ఏపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన గాంధీ నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ గొడవల కారణంగా సొంత బావమర్ధులే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ 
దళిత యువకుడు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో పోలీసులు మరో ఇద్దరు నిందితులు కడియాల చిన్నబాబు(A2), కడియాల సతీశ్‌(A3)లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న వీరిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అనంతబాబు ఆదేశాలతో చిన్నబాబే సాక్షులను బంధించి, ప్రలోభాలకు గురిచేసి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచే చిన్నబాబు ఫోన్‌కు వీడియో కాల్ చేసి సాక్షులను బెదిరించినట్లు సమాచారం. మాజీ మంత్రి కన్నబాబుకు సన్నిహితుడైన చిన్నబాబును విచారిస్తే, సాక్షుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది.

చేపల చెరువులో పడి ఇద్దరు మృతి..
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం కాకాని చేపల చెరువులో మేతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు పడవ బోల్తా పడటంతో మృతి చెందారు. కొమ్మాలపాడు వాసులు చెరువును లీజుకు తీసుకొని చేపల పెంపకం చేపట్టారు. ఆదివారం చేపల మేతకు చెరువులోకి వెళ్లగా పడవ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మృతులు అగ్రహారానికి చెందిన హుస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేగా పోలీసులు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
Embed widget