By: ABP Desam | Updated at : 29 Jul 2021 05:03 PM (IST)
POLAVARAM SIGHT
పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ సాధించింది. నిధుల ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయింది. తనను కలిసిన వైసీపీ ఎంపీలతో కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సంతోషకరమైన వార్త అందించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో సవరించిన అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు.
టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన 47,725 కోట్ల రూపాయల సవరించిన అంచనాలకు ఆమోద ముద్రపడింది. గురువారం ఆర్థిక శాఖకు జల్శక్తిమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించనుంది. వచ్చే వారం కేంద్ర మంత్రివర్గం ముందుకు పోలవరం సవరించిన అంచనాల ఫైల్ చర్చకు రానుంది.
పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించేందుకు వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రి జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిశారు. సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరం భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగానే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్టు గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
ఈ నిధుల ఇష్యూతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలించాలని కూడా వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రిని రిక్వస్ట్ చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు రియింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎంపీలు.
ఐదు అంశాలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చించారు వైసీపీ ఎంపీలు. సవరించిన 55,656 కోట్ల రూపాయలకు ఆమోద ముద్రవేయాలని అభ్యర్థించారు. టిక్నికల్ అడ్వైజరీ కమిటీ చెప్పినట్టుగా .47,725 కోట్లు అంచనాలకే ఆమోదం తెలుపుతున్నట్టు కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. ఆమోదించిన నిధులను వీలైనంత త్వరగా ఎస్క్రో అకౌంట్స్ తెరిచి బదిలీ చేయాలని ఎంపీలు కోరారు.
ఎస్క్రో అకౌంట్ ద్వారా నిధులు పంపడం వీలైయ్యేది కాదని... ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చు చేసిన 1920 కోట్ల రూపాయలని రీయింబర్స్ చేస్తామన్నారు కేంద్రమంత్రి. వారం పది పదిరోజుల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టిన అమౌంట్ను స్టేట్ అకౌంట్లో వేసే ఛాన్స్ ఉంది. 47,725 కోట్ల రూపాయలు మాత్రం కేబినెట్ ఆమోదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాజమండ్రికి తరలించే అంశంలో కూడా కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించినట్టు వైసీపీ ఎంపీలు తెలిపారు.
కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ ఇచ్చిన హామీపై వైసీపీ ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యానికి పోలవరం పూర్తి చేసేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని... కేంద్రం నిధులు ఇవ్వక ముందే ఖర్చు పెట్టి పోలవరం పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు వైసీపీ ఎంపీలు.
Chiru Pawan Meets: ఒకే రాజకీయ వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ - ప్రజారాజ్యం తర్వాత 13 ఏళ్లకు తొలిసారి అరుదైన సందర్భం
Rain Updates: ఏపీలో ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు - తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
Modi Tour In AP: ఏపీలో మోదీ టూర్లో కఠిన ఆంక్షలు- వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు
East Godavari News : కోనసీమ జిల్లాలో ఘోరం, తల్లీకూతురు సజీవదహనం, అల్లుడిపై అనుమానం!
AP Government On Bamboo: వెదురు పెంచితే సూపర్ ఆఫర్- మీ తోటలో పెంచినా రాయితీ
BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
IND vs ENG 5th Test Day 3: కమ్బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?
Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?
Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!