అన్వేషించండి

Amalapuram Violence: వాట్సాప్ మెస్సేజ్‌లతో ప్లాన్ ప్రకారం అమలాపురంలో విధ్వంసం సృష్టించారు : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

Amalapuram Violence: ప్రణాళిక ప్రకారం కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం సృష్టించారని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు.

AP DGP Rajendranath Reddy: అమలాపురం: వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రణాళిక ప్రకారం కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం సృష్టించారని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత నెలలో అమలాపురం అల్లర్లలో దగ్ధమైన మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని ఏపీ డీజీపీ సోమవారం పరిశీలించారు. అల్లర్లు జరిగిన 20 రోజుల అనంతరం రాష్ట్ర డీజీపీ అమలాపురంలో విధ్వంసం జరిగిన ప్రాంతాల పరిశీలనకు వచ్చారు. అయితే డీజీపీ పర్యటనను కవర్ చేసేందుకు మాత్రం మీడియాకు అనుమతి ఇవ్వలేదు.

అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్ల (Amalapuram Violence)లో పాల్గొన్న నిందితులు అందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన నిందితులు ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, జరిగిన ఆస్తి నష్టానికి రెండింతలు నిందితులనుండి రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. అమలాపురం అల్లర్ల కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 268 మంది నిందితులను గుర్తించామని వారిలో 142 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

వారిని పట్టుకోవడానికి ఏడు బృందాలు ఏర్పాటు
కోనసీమ జిల్లాల్లో విధ్వంసానికి పాల్పడిన వారిలో సగం మంది వరకు అరెస్ట్ చేశారు. మరో 126 మంది నిందితులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి ఏడు బృందాలని ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. అమలాపురం అల్లర్ల కేసులలో రాజకీయ పార్టీల పరంగా కార్యకర్తలను టార్గెట్ చెయ్యలేదని, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తించామని స్పష్టం చేశారు. అల్లర్ల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సంయమనం పాటించారని డీజీపీ చెప్పారు.
  
వాట్సాప్ మెస్సేజ్‌లతోనే విధ్వంసం..
సోషల్ మీడియా వేదికగా అమలాపురంలో విధ్వంసానికి ప్లాన్ చేశారని డీజీపీ తెలిపారు. వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రణాళిక ప్రకారం విధ్వంసం సృష్టించారని, ఆస్తి నష్టం రికవరీపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. త్వరలోనే ఈ నివేదికను ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిందితుల నుండి ఆస్తినష్టం రికవరీకి ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో 135 మంది అరెస్ట్, హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న స్పెషల్  

Also Read: Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరో 3 రోజులు వానలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget