అన్వేషించండి

మత మార్పిడి రిజర్వేషన్ల తీర్మానం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు: సోము వీర్రాజు

మత మార్పిడిలు పొందిన ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్ధమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు లభించిన రిజర్వేషన్లును మత మార్పిడి పొందిన ఎస్సీలకు కూడా ఇవ్వాలని తీర్మానాన్ని అసెంబ్లీలో చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు (AP BJP Chief Somu Veerraju) సోము వీర్రాజు విమర్శించారు. రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును తప్పుపట్టారు. ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోకుంటే దీనిని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో తీర్మాణం చేసింది. బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లా ?
మత మార్పిడిలు పొందిన ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్ధమని వీర్రాజు అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తీర్మాణించడం జరిగిందని, దీనిపై అప్పట్లో కూడా భారతీయ జనతాపార్టీ (BJP) ఉద్యమం చేయడం జరిగిందని, గవర్నర్‌ను సమయం అడిగామని, 27న కలవడానికి ప్రయత్నంచేస్తామని వెల్లడించారు. ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. కేవలం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్లనే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామని, మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీలో తీర్మానిస్తూ ప్రకటించిన సీఎం జగన్..
నా రాజకీయ ప్రయాణం మొదలయ్యాక ఎస్టీలు నన్ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో, నేను వారిని అలానే గుండెల్లో పెట్టుకుంటాను. వారికి అన్యాయం జరగకుండా చూస్తామని శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేస్తున్నాం. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలానే తీర్మానం చేశారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతుంది. 

ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరొక మతంలోకి వెళ్తే వారి సాంఘిక, ఆర్థిక, జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రావు. మతం అనేది ఆ మనిషికి ఆ దేవుడికి మధ్య ఉన్న సంబంధం అన్నారు. మతం మార్పిడితో ఏం నష్టం జరగదని తెలుసు. అందుకే  క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని కొరుతూ తీర్మానాలు చేస్తూ కేంద్రానికి పంపిస్తున్నాం. అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయాలనేది నా ప్రయత్నం. వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ అవ్వాలని నిర్ణయించుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు..

క్రైస్తవ వర్గాల హర్షాతిరేకాలు...
అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయడంపై దళిత క్రైస్తవ నాయకులు హర్ష వ్యక్తం చేశారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం  ప్రాంతాల్లో సమావేశమైన పలువురు దళిత క్రైస్తవ నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుందని, ఎన్నో ఏళ్లుగా దళిత క్రైస్తవులు అనేక అవకాశాలు కోల్పోతున్నారని, అట్రాసిటీ కేసుల్లో కూడా బాధితులు ఎస్సీలు కాదని నిందితులు ఆరోపిస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, ఇది వారికి ఒక అస్త్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget