అన్వేషించండి

AP News: వైసీపీకి వరుస షాకులు- టీడీపీలోకి శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు.

Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ (YSRCP)కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy), వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. తెలుగుదేశం (Tdp), జనసేన (Janasena) కండువాలు కప్పుకుంటున్నారు.  ఎప్పుడు ఎవరు వైసీపీకి ఝలక్ ఇస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వైసీపీలో ఉన్న నాయకులు...రేపు ఉంటారో లేదో తెలియడం లేదు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన కీలక నేతలంతా ఒక్కొక్కొరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రీజినల్ కో-అర్డినేటర్లు నచ్చజెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొందరికి సీఎంవో నుంచి పిలుపు వచ్చినా వెళ్లడం లేదు. కొందరు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడిన తర్వాత కూడా పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి పార్థసారథి, నిన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తాజాగా శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. పార్టీకి రాం రాం చెబుతున్నట్లు సుభాష్ ప్రకటించారు. 

5వేల మందితో ర్యాలీ
తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శనివారం 5వేల మంది అనుచరులతో ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పెట్టారని వాసంశెట్టి సుభాష్ వాపోయారు. ఇబ్బందుల పాల్జేసిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని చెప్పినా...వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల కేసులోనూ...తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరినా...హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. 

ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు రక్షణనిధి, ఎలిజా
తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎలిజా ఇప్పటికే పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  వైసీపీ అధిష్ఠానం మోసం చేసిందని, వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి తిరుగుబావుట ఎగురవేశారు. ఓ ఎంపీ చెప్పిన మాట విని...తనకు సీటు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. 

మరోవైపు రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేశారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే...ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్‌ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget