అన్వేషించండి

AP News: వైసీపీకి వరుస షాకులు- టీడీపీలోకి శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు.

Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ (YSRCP)కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy), వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. తెలుగుదేశం (Tdp), జనసేన (Janasena) కండువాలు కప్పుకుంటున్నారు.  ఎప్పుడు ఎవరు వైసీపీకి ఝలక్ ఇస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వైసీపీలో ఉన్న నాయకులు...రేపు ఉంటారో లేదో తెలియడం లేదు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన కీలక నేతలంతా ఒక్కొక్కొరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రీజినల్ కో-అర్డినేటర్లు నచ్చజెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొందరికి సీఎంవో నుంచి పిలుపు వచ్చినా వెళ్లడం లేదు. కొందరు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడిన తర్వాత కూడా పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి పార్థసారథి, నిన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తాజాగా శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. పార్టీకి రాం రాం చెబుతున్నట్లు సుభాష్ ప్రకటించారు. 

5వేల మందితో ర్యాలీ
తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శనివారం 5వేల మంది అనుచరులతో ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పెట్టారని వాసంశెట్టి సుభాష్ వాపోయారు. ఇబ్బందుల పాల్జేసిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని చెప్పినా...వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల కేసులోనూ...తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరినా...హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. 

ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు రక్షణనిధి, ఎలిజా
తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎలిజా ఇప్పటికే పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  వైసీపీ అధిష్ఠానం మోసం చేసిందని, వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి తిరుగుబావుట ఎగురవేశారు. ఓ ఎంపీ చెప్పిన మాట విని...తనకు సీటు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. 

మరోవైపు రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేశారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే...ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్‌ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Tamil 8: చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
Mudragada: చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Embed widget