అన్వేషించండి

Andhra Pradesh: జగన్ పాలనపై ప్రజల్లో అనుమానాలు.. కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయ్‌: నాదెండ్ల మనోహర్

ఏపీని ఆర్థిక లోటు వేధిస్తోంది…వేలకోట్లు ఏమైపోతున్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ . రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . జగన్ ప్రభుత్వంపై రాష్ట్రంలో ఎక్కడ చూసినా విమర్శలు వ్యక్తమవుతున్నాయని..రోజురోజుకీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని… యువత ఉపాధి కోల్పోయి వలసలు వెళ్తున్నారని.. భవిష్యత్‌పై వారికి భయం పట్టుకుందన్నారు. యువతకు అండగా జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా నిరసన తెలుపుదామన్నా పోలీసుల అండతో ఇబ్బంది పెట్టాలని చూసిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆర్ధికలోటు వేధిస్తోందని, వేలకోట్లు ఎటు వెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి గాడి తప్పి ఉందనే విషయం దేశమంతటా తెలిసిందన్నారు.

 “జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిన కార్యకర్తలను అభినందించడం అందరి ప్రథమ కర్తవ్యం అన్నారు నాదెండ్ల మనోహర్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరణ కార్యకర్తలకు బీమా పత్రాలు, ఐడీ కార్డులతో కూడిన కిట్లను అందించారు. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులను అభినందించారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రమాదం జరిగినప్పుడు దేశ, విదేశాల్లో ఉన్న పార్టీ సానుభూతి పరులు స్పందించి బాధిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకుంటున్నారని…అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు పార్టీలో చాలా మంది ఉన్నారని తెలిపారు మనోహర్. వారందరి స్ఫూర్తితోనే కియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.

ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన

ఇప్పటి వరకూ దేశంలో ఏ పార్టీలోనూ లేని విధంగా కార్యకర్తలకు ప్రమాద బీమా  5 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు మనోహర్. అలాంటి పార్టీ కోసం ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని క్రియాశీలక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే లక్షకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని….సంఖ్య మరింత పెరిగేలా అందరం కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదని” హామీ ఇచ్చారు.

మరిడమ్మను దర్శించుకున్న శ్రీ నాదెండ్ల మనోహర్

తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ పెద్దాపురంలో మరిడమ్మ ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం…ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్, పెద్దాపురం నియోకవర్గ ఇంచార్జి శ్రీ తుమ్మల బాబు సహా పలువురు జిల్లాకు చెందిన జనసేన నాయకులు పాల్గొన్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget