అన్వేషించండి

Prashant Kishar Meet Chandrababu : చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ - షాక్‌లో వైసీపీ!

Prashant Kishar Meet Chandrababu : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ పరిణామం వైసీపీ వర్గాల్లోనూ సంచలనం అయింది.

Prashant Kishar in Chandrababu House  :   ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి నివాసంతో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చారు. తర్వాత వారు ఒకే వాహనంలో ఉండవల్లికి వెళ్లారు.  ఈ పరిణామం ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రశాంత్ కిషోర్ వైసీపీకి స్ట్రాటజిస్ట్. గత ఎన్నికల్లో ఆయన వ్యూహాలతోనే విజయం సాధించామని సీఎం జగన్  నేరుగానే చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నేరుగా పని చేయకపోయినప్పటికీ..,  ఐ ప్యాక్ ఇప్పటికీ వైసీపీకి పని చాస్తుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లడం వైసీపీ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. 

విజయవంతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్  

ప్రశాంత్ కిషోర్ విజయవంతమైన వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.  అయితే ఆయన చివరి సారిగా బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన స్ట్రాటజిస్టుగా  పని చేయలేదు. ఆయన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మాత్రం వివిధ పార్టీలకు పని చేస్తోంది. ప్రస్తుతం ఐ ప్యాక్ కు చెందిన రిషి రాజ్ .. వైసీపీకి పని చేస్తున్నారు. వైసీపీ కార్యకలాపాలు పూర్తిగా ఐ ప్యాక్ చేతుల మీదుగానే నడుస్తున్నాయన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డి పాలనా తీరుకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు చేశారు. 

ఇటీవల వైసీపీకి వ్యతిరేకంగా  మాట్లాడుతున్న పీకే        

వివిధ మీడియా చానళ్ల డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు..ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డికి పని చేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ సారి చెప్పారు. అలాంటి వ్యతిరేక వ్యాఖ్యల తర్వాత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సహజంగానే రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత ఏడాది బీఆర్ఎస్ కోసం కొన్నాళ్లు పని చేశారు కానీ.. తర్వాత కేసీఆర్ వద్దనుకున్నారు.  
టీడీపీకి  పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని గతంలో జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.   అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నేరుగా  టీడీపీ హైకమాండ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం.. సంచలనంగా మారింది. ఇది వైసీపీ క్యాంపును దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు. 

టీడీపీకి పని చేస్తారా ? సలహాలిస్తారా ?           

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కూడా ఓ స్ట్రాటజిస్ట్ ఉన్నారు. రాబిన్  శర్మ అనే స్ట్రాటజిస్ట్ నేతృత్వంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ లో పని చేసిన వారే. తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీకి కారణం ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ కోసం పని చేస్తారా.. సలహాలిస్తారా అన్నది తేలాల్సి ఉంది.            

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget