అన్వేషించండి

Chandrababu : వరుపుల రాజా మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణం, కేసులు పెట్టి వేధించారు- చంద్రబాబు

Chandrababu : టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుపుల రాజాపై కేసులు పెట్టి వేధించారని, అది తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చిందన్నారు.

Chandrababu : ప్రత్తిపాడు నియోజకవర్గo ఇన్ ఛార్జ్ వరుపుల రాజా భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వరుపుల రాజా మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాజాపై అనేక కేసులు పెట్టి మానసికంగా వేధించారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు  వచ్చిందన్నారు. రాజా మరణాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

కేసులతో వేధించారు 

"కరోనా తర్వాత గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఇంకొకటి ప్రభుత్వం కూడా వరుపుల రాజాను వేధించింది. 12 కేసులు పెట్టి వేధించారు. ఆయన హత్యను రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా కుటుంబాలు పెద్ద దిక్కులు కోల్పోయాయి.  పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. 2007లో ఎంపీపీగా ఎన్నికై, ఆ తర్వాత డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. ఆయనను కేసులతో వేధించినప్పుడు పార్టీ పరంగా నిలిచాం. కేసుల టెన్షన్, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల రాజా చనిపోయారు. రాజా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది." - చంద్రబాబు

పార్టీకి తీరని లోటు 

అంతకు ముందు వరుపుల రాజా హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. రాజా కుటుంబసభ్యులను ఫోన్‌ లో పరామర్శించి  తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ప్రత్తిపాడు వచ్చారు చంద్రబాబు. ప్రత్తిపాడులో వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు.  టీడీపీ నేత వరుపుల రాజా మృతి షాక్‌కి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం కుటుంబం మరో నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం చేరుకుని రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను, పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని పార్టీ బలోపేతానికి వరుపుల రాజా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.వరుపుల రాజా కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
      
తెదేపా నాయకులు వరుపుల రాజా గుండె పోటుకు గురై కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు పరిధిలోని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకునిగా తెలుగుదేశం పార్టీ తరఫున నియమితులై, సాలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బంజు దేవ్ లతో కలిసి మండల కేంద్రం సాలూరులో ఎన్నికల ప్రచారం శనివారం పూర్తి చేసుకుని సాయంత్రం 6గంటలకు స్వగ్రామం చేరుకున్న ఆయన తన సమీప బంధువుతో మాట్లాడుతుండగా ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శంఖవరంలోని పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వత సురేష్ కు సమాచారం అందించారు. వెంటనే కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా హృదయ స్పందన శాశ్వతంగా ఆగిపోయింది. కడపటి ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో రాజా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ప్రత్తిపాడు చేరుకుని రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.రాజా అంతిమ యాత్ర క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. చంద్రబాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 
 
వరుపుల రాజా 1976 ఆగస్టు 14న పెదశంకర్లపూడిలో జన్మించారు.అసలు పేరు జోగిరాజు. తాత వరుపుల జోగిరాజు ఒకసారి, చిన్న తాత వరుపుల సుబ్బారావు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. భార్య సత్యప్రభ, పిల్లలు మాధురి, తర్షిత్.2066లో పెదశంకర్లపూడి ఎంపీటీసీ సభ్యులుగా,2009వరకు ఎంపీపీ గా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైకాపా యువజన అధ్యక్షునిగా పనిచేశారు.2011లో సొసైటీ అధ్యక్షుడు నుండి డీసీసీబీ చైర్మన్ గా,2014లో తెదేపా లో చేరి ఆప్కాబ్ వైస్ ఛైర్మన్ గా పనిచేశారు.2019లో తెదేపా టిక్కెట్ సాధించి ప్రత్తిపాడు నుండి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు.

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Megastar Chiranjeevi: అలా ఆలోచించిన తొలి నటుడు చిరంజీవి - మెగాస్టార్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
అలా ఆలోచించిన తొలి నటుడు చిరంజీవి - మెగాస్టార్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Samantha: కష్ట సమయంలో అతను నా వెంటే ఉన్నాడు - ఆ రిలేషన్‌కు పేరు పెట్టలేనన్న సమంత
కష్ట సమయంలో అతను నా వెంటే ఉన్నాడు - ఆ రిలేషన్‌కు పేరు పెట్టలేనన్న సమంత
Viral News: కాలేజీ విద్యార్థిని ఖాతాలో 35 కోట్లు - ఎక్కడివో తెలుసుకుని పోలీసులు షాక్ !
కాలేజీ విద్యార్థిని ఖాతాలో 35 కోట్లు - ఎక్కడివో తెలుసుకుని పోలీసులు షాక్ !
Embed widget