అన్వేషించండి

Chandrababu : వరుపుల రాజా మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణం, కేసులు పెట్టి వేధించారు- చంద్రబాబు

Chandrababu : టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుపుల రాజాపై కేసులు పెట్టి వేధించారని, అది తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చిందన్నారు.

Chandrababu : ప్రత్తిపాడు నియోజకవర్గo ఇన్ ఛార్జ్ వరుపుల రాజా భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వరుపుల రాజా మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాజాపై అనేక కేసులు పెట్టి మానసికంగా వేధించారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు  వచ్చిందన్నారు. రాజా మరణాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

కేసులతో వేధించారు 

"కరోనా తర్వాత గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఇంకొకటి ప్రభుత్వం కూడా వరుపుల రాజాను వేధించింది. 12 కేసులు పెట్టి వేధించారు. ఆయన హత్యను రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా కుటుంబాలు పెద్ద దిక్కులు కోల్పోయాయి.  పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. 2007లో ఎంపీపీగా ఎన్నికై, ఆ తర్వాత డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. ఆయనను కేసులతో వేధించినప్పుడు పార్టీ పరంగా నిలిచాం. కేసుల టెన్షన్, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల రాజా చనిపోయారు. రాజా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది." - చంద్రబాబు

పార్టీకి తీరని లోటు 

అంతకు ముందు వరుపుల రాజా హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. రాజా కుటుంబసభ్యులను ఫోన్‌ లో పరామర్శించి  తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ప్రత్తిపాడు వచ్చారు చంద్రబాబు. ప్రత్తిపాడులో వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు.  టీడీపీ నేత వరుపుల రాజా మృతి షాక్‌కి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం కుటుంబం మరో నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం చేరుకుని రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను, పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని పార్టీ బలోపేతానికి వరుపుల రాజా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.వరుపుల రాజా కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
      
తెదేపా నాయకులు వరుపుల రాజా గుండె పోటుకు గురై కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు పరిధిలోని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకునిగా తెలుగుదేశం పార్టీ తరఫున నియమితులై, సాలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బంజు దేవ్ లతో కలిసి మండల కేంద్రం సాలూరులో ఎన్నికల ప్రచారం శనివారం పూర్తి చేసుకుని సాయంత్రం 6గంటలకు స్వగ్రామం చేరుకున్న ఆయన తన సమీప బంధువుతో మాట్లాడుతుండగా ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శంఖవరంలోని పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వత సురేష్ కు సమాచారం అందించారు. వెంటనే కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా హృదయ స్పందన శాశ్వతంగా ఆగిపోయింది. కడపటి ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో రాజా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ప్రత్తిపాడు చేరుకుని రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.రాజా అంతిమ యాత్ర క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. చంద్రబాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 
 
వరుపుల రాజా 1976 ఆగస్టు 14న పెదశంకర్లపూడిలో జన్మించారు.అసలు పేరు జోగిరాజు. తాత వరుపుల జోగిరాజు ఒకసారి, చిన్న తాత వరుపుల సుబ్బారావు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. భార్య సత్యప్రభ, పిల్లలు మాధురి, తర్షిత్.2066లో పెదశంకర్లపూడి ఎంపీటీసీ సభ్యులుగా,2009వరకు ఎంపీపీ గా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైకాపా యువజన అధ్యక్షునిగా పనిచేశారు.2011లో సొసైటీ అధ్యక్షుడు నుండి డీసీసీబీ చైర్మన్ గా,2014లో తెదేపా లో చేరి ఆప్కాబ్ వైస్ ఛైర్మన్ గా పనిచేశారు.2019లో తెదేపా టిక్కెట్ సాధించి ప్రత్తిపాడు నుండి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget