అన్వేషించండి

PM Modi: ఏపీ వ్యక్తిని మెచ్చుకున్న ప్రధాని మోదీ, మన్ కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావన

PM Modi: మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి పేరును ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

PM Modi In Mann Ki Baat: ప్రధాని మోదీ ఆదివారం (మే 30) ప్రసంగించిన 89వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పేరు ప్రస్తావించారు. ప్రధాని నోటి వెంట ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి పేరు వచ్చేసరికి అందరి దృష్టి ఆయనపై పడింది సుకన్య సమృద్ధి యోజన గురించి మోదీ మాట్లాడుతూ మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగిని గుర్తు చేశారు. రాం భూపాల్ రెడ్డి పదవీ విరమణ చెందిన తర్వాత ఆయన తన ఆదాయం మొత్తాన్ని బాలికల విద్య కోసం ఖర్చు పెట్టార‌ని తనకు తెలిసిందని అన్నారు. ఇది చాలా గర్వించదగినదని అన్నారు. 

రాం భూపాల్ రెడ్డి ఇప్పటి వ‌ర‌కు వంద మంది బాలికలకు సుకన్య సమృద్ధి పథకం ద్వారా బ్యాంకు అకౌంట్లు తెరిచి వారి పేరుతో ఇప్పటిదాకా రూ.25 లక్షలకుపైగా జమ చేశారని మోదీ గుర్తు చేస్తూ ఆయన్ను ప్రశంసించారు. స్వలాభం కోసం కాకుండా సమాజం కోసం పని చేస్తూ అది కూడా మన సంస్కృతిలో భాగమనే విషయాన్ని రాం భూపాల్ రెడ్డి నిరూపించారని అన్నారు. 

రాం భూపాల్‌రెడ్డి గురించి.. 
రాం భూపాల్‌రెడ్డి గతంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులను ఆయన తన సొంత అవసరాల కోసం వాడుకోకుండా బాలికల విద్య కోసం ఖర్చు పెట్టారు. ‘సుకన్య సమృద్ధి యోజన’ కింద స్కాలర్‌షిప్‌లు పొందేలా చూశారు. 10 ఏళ్లు నిండిన 88 మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచేందుకు యడవల్లి పోస్టాఫీసులో తన బెనిఫిట్‌ల నుంచి రూ.25.71 లక్షలు జమ చేశారు. వారికి రూ.41 వేల వడ్డీ మొత్తం సమానంగా పంపిణీ అవుతుంటుంది. ఆ మొత్తం బాలికలకు 21 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి 88 ఖాతాలలో జమ అవుతూ ఉంటుంది. 

కర్నూలు జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా సుదీర్ఘకాలం పాటు రాం భూపాల్ రెడ్డి పని చేశారు. విద్యకు రామ్ భూపాల్ రెడ్డి చేసిన కృషికి గానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈయన అవార్డులను అందుకున్నారు.

ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ నెట్‌వర్క్, ఆల్ ఇండియా రేడియో వెబ్‌సైట్, న్యూస్ ఎయిర్ మొబైల్ యాప్‌లో ప్రసారం అవుతుంది. ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ AIR వార్తలు, DD వార్తలు, PMO, YouTube ఛానెల్‌ళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తొలుత ఈ కార్యక్రమం హిందీలో ప్రసారమైన వెంటనే ఆల్ ఇండియా రేడియో ఈ కార్యక్రమాన్ని దేశమంతా ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేసింది. ఇతర భాషలో మన్ కీ బాత్ అదే రోజు తిరిగి రాత్రి 8 గంటలకు మళ్లీ ప్రసారం అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget