అన్వేషించండి

AP TDP chief : కొత్త ఏపీ టీడీపీ చీఫ్‌గా పల్లా శ్రీనివాస్ - త్వరలో అధికారిక ప్రకటన

Andhra Politics : ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ గా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Palla Srinivas as AP TDP chief  :  తెలుగదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. గాజువాల నుంచి 95వేలకుపైగా ఓట్ల మెజార్టీతో  మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

యువనేతకు చాన్సివ్వాలనుకున్న చంద్రబాబు                              

అయ్యన్న పాత్రుడితో పాటు మరికొంత మంది పేర్లను  కూడా పరిశీలించారు. అయితే యువకుడు అయిన పల్లా అయితేనే పార్టీ యాక్టివ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయనను ఎంపిక చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సేర.. పార్టీని పట్టించుకోవడం లేదని.. అందుకనే అదికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. ఈసారి అలాంటి సమస్య రాకుండా.. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పూర్తి స్థాయిలో ఉండేలా .. పల్లాను నియమిస్తున్నారు. 

ప్రజా ఉద్యమాలలో ముందున్న  పల్లా                 

పల్లా శ్రీనివాసరావు తండ్రి టీడీపీలో ఉండేవారు. కానీ పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి  విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నారు. ఆ  ఎన్నికల్లో ఓటమి తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపైనా స్పష్టమైన ముద్ర వేశారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. విశాఖలో పార్టీని నడిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించారు. 

వైసీపీ హయాంలో పల్లాకు అనేక వేధింపులు                         

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా పలు వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన ఆస్తులపై దాడులు చేశారు. ఓ భవనాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టారు. అయినా పల్లా శ్రీనివాసరవు వెనక్కి తగ్గలేదు. వైసీపీలోకి వస్తే మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. కానీ పల్లా టీడీపీని వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చినట్లుగా తెలుస్తోంది.  పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. సామాజిక సమీకరణాల్లో అది సాధ్యం కాలేదు. కృష్ణా జిల్లా నుంచి బీసీకి చాన్సివ్వాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకే పార్థసారధికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులు కావడం వల్ల .. బీసీ వర్గాల్లో మరింత ఆదరణ టీడీపీకి వస్తుందని భావిస్తున్నారు. 

       

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget