అన్వేషించండి

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం - 2025 నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యం

Bhogapuram Airport: ఏపీలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు రూ.5 వేల కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ  ఏడాది మే 3న ఏపీ సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు భూమి పూజ చేసి లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5 వేల కోట్లతో దీన్ని అభివృద్ధి చేయమన్నారు. 2025 నాటికి 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పనులు పూర్తి చేయాలన్నదే లక్ష్యంతో జీఎంఆర్ సంస్థ అడుగులు వేస్తోంది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం 2,203 ఎకరాలు కేటాయించింది.  నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు.

పొడవైన రన్ వే

కీలకమైన రన్ వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఓ క్రమంలో లేకపోవడంతో తొలుత సగటును పది అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు. 

నేరుగా రోడ్డు అనుసంధానం

చెన్నై -  కోల్ కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు 8 సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీని కోసం 25 ఎకరాల భూసేకరణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ముక్కం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

సమీపంలోని స్టాఫ్ క్వార్టర్లు

విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

అన్ని అడ్డంకులను అధిగమించి

విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. 4 గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించి, మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. త్వరలోనే ఎయిర్ పోర్టు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

KA Paul: బొత్స నా కాళ్ల వద్ద కూర్చుని గెలిపించాలని వేడుకున్నాడు: కేఏ పాల్
బొత్స నా కాళ్ల వద్ద కూర్చుని గెలిపించాలని వేడుకున్నాడు: కేఏ పాల్
Veligonda Credit Theft: వైఎస్సార్‌ స్వప్నం వెలిగొండ మేం పూర్తి చేశాం.. చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు: జగన్‌
వైఎస్సార్‌ స్వప్నం వెలిగొండ మేం పూర్తి చేశాం.. చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు: జగన్‌
Sanatana Dharma Protection: సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి పరిరక్షణ మనందరి బాధ్యత - బీజేపీ టెంపుల్ సెల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి పరిరక్షణ మనందరి బాధ్యత - బీజేపీ టెంపుల్ సెల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
Veligonda Project: మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర.. రేపు వెలిగొండ వద్ద కలుద్దాం: సీఎం చంద్రబాబు
మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర.. రేపు వెలిగొండ వద్ద కలుద్దాం: సీఎం చంద్రబాబు

వీడియోలు

Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ
BCCI Central Contracted Players Fitness Test | బెంగళూరులో టీమిండియా ఫిట్‌నెస్ క్యాంప్
SKY Breaks Silence On T20 Captaincy | టీ20 కెప్టెన్సీ మార్పుపై సూర్యకుమార్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss 10 Charan Mahadev | బిగ్ బాస్ 10 కామనర్ చరణ్ మహదేవ్ రియల్ లైఫ్
Women's T20 Asia Cup 2026 | మహిళల టీ20 ఆసియా కప్ 2026

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti vs Harish Rao: పదవుల కోసం హరీష్ రావు నీచ రాజకీయాలు, కేసీఆర్‌పై సైతం క్షుద్రపూజలు: మంత్రి పొంగులేటి కౌంటర్
పదవుల కోసం హరీష్ రావు నీచ రాజకీయాలు, కేసీఆర్‌పై సైతం క్షుద్రపూజలు: మంత్రి పొంగులేటి కౌంటర్
Vikarabad Railway Station: 40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి
40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి
Bhadradri Kothagudem Crime News: ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు
ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
Hair Thinning : జుట్టు రాలిపోతూ.. పలుచగా మారుతోందా? కారణాలు, హెయిర్ డెన్సిటీ పెంచుకునే చిట్కాలు ఇవే
జుట్టు రాలిపోతూ.. పలుచగా మారుతోందా? కారణాలు, హెయిర్ డెన్సిటీ పెంచుకునే చిట్కాలు ఇవే
Korean Kanakarju OTT : ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nepal Flash Floods: నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Adivasi March: రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు
Embed widget