అన్వేషించండి

Vijayawada News: విజయవాడలో ప్రబలిన అతిసార - 9కి చేరిన మృతుల సంఖ్య, కలుషిత నీరే కారణమా?

Andhrapradesh News: విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో అతిసార లక్షణాలతో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Diarrhea Rampant In Vijayawada: విజయవాడ (Vijayawada) నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డయేరియా (Diarrhea) ప్రబలుతోంది. మొగల్రాజపురం, పాయకాపురం ప్రాంతాల్లో అతిసార లక్షణాలతో ఇప్పటివరకూ 8 మంది మృతి చెందారు. తాజాగా, మొగల్రాజపురంలో గల్లా కోటేశ్వరరావు అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. గత 5 రోజులుగా డయేరియా లక్షణాలతో 9 మంది మృతి చెందగా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో అతిసార లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. మొగల్రాజపురంలోనే ఆరుగురు విరేచనాలతో మృతి చెందగా.. పాయకాపురం, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు, ఓ బాలుడు మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క పాయకాపురం, మొగల్రాజపురం ప్రాంతాల్లోనే దాదాపు 50 మంది అతిసార బాధితులున్నట్లు తెలుస్తోంది. అయితే, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. మొగల్రాజపురంలోని సీపీఎం కార్యాలయంలో పడకలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. దాదాపు 250 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకూ ఒక్క దాని ఫలితమూ వెల్లడించలేదని.. త్వరగా వాటి వివరాలు అందించాలని బాధితులు కోరుతున్నారు.

కలుషిత నీరే కారణమా.?

కలుషిత నీరు తాగడం వల్లే అతిసార బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తాగునీటి సరఫరాలో కలుషిత నీరు కలవడం వల్లే డయేరియా ప్రబలిందని స్థానిక ప్రజలు అంటున్నారు. నగరంలోని చిట్టినగర్, మొగల్రాజపురం, ఆటోనగర్, కృష్ణలంక ఇతర ప్రాంతాల్లో కుళాయి నుంచి పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే, విజయవాడ మున్సిపాలిటీ అధికారులు మాత్రం అత్యంత సురక్షిత నీటినే సరఫరా చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. అతిసారతో ఎవరూ చనిపోలేదని.. మృతులకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అతిసార లక్షణాలతో జనం ఆస్పత్రుల పాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించి వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: AP Election Counting Updates: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈసీ మరో కీలక నిర్ణయం, రేపే ముహూర్తం!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget