అన్వేషించండి

దమ్ముంటే టీడీపీ రెబల్స్ పై వేటు వేయండి- తెలుగుదేశానికి వైసీపీ ఎమ్మెల్యే సవాల్

చంద్రబాబుకి ఇలాంటి వ్యవహారాలు అలవాటేనన్నారు ప్రసన్న. గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో బేరాలు నడిపారని, ఓటుకు నోటు స్కామ్ లో అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయి ఏపీకి వచ్చారన్నారు.

వైసీపీకి దమ్ముంది కాబట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిందని, అలాంటి దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థికి ఓటు వేశారని, ఆవిషయం స్పష్టంగా తెలిసినా కూడా టీడీపీకి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదని చెప్పారు. 

10కోట్లకు బేరం..

తమ ఎమ్మెల్యేలు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి 10కోట్ల రూపాయలకు డీల్ ఫిక్స్ అయిందని చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు 10కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని చెప్పారు. చంద్రబాబుకి ఇలాంటి వవ్యవహారాలు అలవాటేనన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం రేవంత్ రెడ్డితో బేరాలు నడిపారని, ఓటుకు నోటు స్కామ్ లో అరెస్ట్ చేస్తారనే భయంతో ఏపీకి పారిపోయి వచ్చారన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ఓట్లని నోట్లతో కొన్నారని చెప్పారు. 

చంద్రబాబుకి సిగ్గులేదు, బుద్ధి లేదు, అసలాయన మనిషే కాదు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఒక్కసీటేనని, తమకు ఆరు సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారాయన. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 52 సచివాలయాల పరిధిలో 57 వేల 379 గడపలు తిరిగానని చెప్పుకొచ్చారు. 

పట్టభద్రుల గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం నాలుగేనని గుర్తు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి, దానికే సంబరాలు చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ గెలుపుతో జగన్ గజ గజ వణుకుతున్నారంటూ పచ్చ పత్రికల్లో రాయిస్తున్నారని, అలా ప్రచారం చేయించుకుని ఆనందపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

జగన్ సింహం లాంటి వారని, సింహం కడుపున పుట్టిన సింహం అని చెప్పారు ప్రసన్న. చంద్రబాబు, తన దత్తపుత్రుడితో కలసి వచ్చినా, ఎన్ని జన్మలెత్తినా జగన్ ని ఏం చేయలేరనన్నారు. 30 సంవత్సరాల పాటు ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. 

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా అందులో ముగ్గురు నెల్లూరు జిల్లావారే కావడం విశేషం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది. నెల్లూరు నాయకులే జగన్ కి వెన్నుపోటు పొడిచారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే నెల్లూరు జిల్లా నాయకులు ఈ వ్యవహారంపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ముగ్గురు బయటకు వెళ్లిపోగా, మిగిలిన ఎమ్మెల్యేలు, తామంతా జగన్ తోన్ ఉన్నామని చెప్పుకోవడంలో భాగంగా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు పేరు చెబితేనే తీవ్ర స్థాయిలో మండిపడే ప్రసన్న కుమార్ రెడ్డి, తాజాగా మరోసారి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కూడా ఒక గెలుపేనా అన్నారు. ఒక్కసీటు గెలిచి రెచ్చిపోతున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepali Gang Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Neha Shetty Gold Jewellery: అంతా బంగారమే, పుత్తడి బొమ్మలా ముస్తాబైన రాధిక!
అంతా బంగారమే, పుత్తడి బొమ్మలా ముస్తాబైన రాధిక!
Embed widget