అన్వేషించండి

వైసీపీలో అంతర్యుద్ధం మొదలైంది- నిజాయితీపరులు ఉండలేకపోతున్నారు: చంద్రబాబు

లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రులంటే వారించాల్సిన సీఎం, కామ్ గా ఉన్నారంటే సైకో కాక ఇంకేంటన్నారు చంద్రబాబు వైసీపీలో కూడా అంతర్యుద్ధం మొదలైందని చెప్పారు.

వైసీపీలో కూడా అంతర్యుద్ధం మొదలైందని, కొంతమంది నిజాయితీ పరులు, సమాజం మేలుకోలేవారు ఆ పార్టీలో ఉండలేరని చెప్పారు చంద్రబాబు. అలాంటి వారంతా బయటకు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని కామెంట్స్ చేశారు.

ప్రజలే ఛాలెంజ్ చేసే సమయం వచ్చిందని చెప్పారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికల కోసమే జగన్, ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లారని, బాబాయ్ హత్య కేసు గురించి కూడా మాట్లాడారని విమర్శించారు. సోదరుడి కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారన్నారు. రాజ్యసభ సీట్లు 3 అమ్ముకున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకి 10వేలు కూడా ఇవ్వాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారని అన్నారు. అయితే ప్రజల్లో పోరాటం మొదలైందని, అది అ స్టాపబుల్ అని చెప్పారు.

లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రులంటే వారించాల్సిన సీఎం... కామ్ గా ఉన్నారంటే అతను సైకో కాక ఇంకెవరని ప్రశ్నించారు చంద్రబాబు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే, ఎవరిమీదైనా వేస్తారని, లేకపోతే తనపైనే వేసుకుంటాడని చెప్పారు. దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే సంపన్నుడు జగన్ అని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణ కేసులు ఆయనపైనే ఉన్నాయని చెప్పారు. జడ్జిలను కూడా బ్లాక్ మెయిల్ చేసిన ఘనత వైసీపీ నేతలకు దక్కుతుందన్నారు. జడ్జిలంటే వారికి భయం లేదని, గౌరవం లేదని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. నెల్లూరులో మంత్రి కాకాణి కోర్టు కేసు ఫైలు దొంగలు తీసుకెళ్లారని, అది ఎంతో ఇన్నోవేటివ్ ఐడియా అని ఎద్దేవా చేశారు. కోర్టులో సాక్ష్యాలను కూడా దొంగతనం చేయగలమన్న ధీమా వారికి ఉందని చెప్పారు. కాకాణిపై విసుర్లు.. 11 వ తేదీ మంత్రి కాగానే 13వతేదీ రాత్రి కోర్టులో కేసు ఫైల్ మాయమైందని, ఆ తర్వాత ఆయన వీరుడు లాగా అందరిపై విరుచుకుపడుతున్నారని చెప్పారు. అలాంటివారందరికీ బట్టలిప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు చంద్రబాబు.

మంత్రులకు బాధ్యత లేదని, సైకో చెప్పాడని, అందరూ సైకోలుగా మారారని అన్నారు చంద్రబాబు. అసెంబ్లీలో స్పీకర్, ఎమ్మెల్యేలు, మంత్రుల పద్ధతి బాగోలేదన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ నేతలు వెళ్లే పరిస్థితి లేదన్ను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేశారని, ఎస్సీ సబ్ ప్లాన్ తీసేశారని విమర్శించారు.

పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే కరవు ఉండేది కాదన్నారు, టీడీప హయాంలో పోలవరానికి సంబంధించి 72శాతం పనులు పూర్తయ్యాయని, అన్నీ పూర్తి చేసి 2020కి డ్యామ్ పూర్తి చేసేవాళ్లం అని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి సర్వ నాశనం చేసేసిందన్నారు చంద్రబాబు. 2024కి కూడా పోలవరం పూర్తి కాదని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు చెబుతున్నారన్నారు. కర్నూలుకి న్యాయరాజధాని తరలిస్తామన్న జగన్, ఇప్పుడు జ్యుడీషియల్ అకాడమీని కర్నూలులో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చూడలేక బాదుడే బాదుడు మొదలు పెట్టామని, ఏప్రిల్ లోల బాదుడే బాదుడికి జనం బాగా వచ్చారని, ఆ తర్వాత మహానాడుకి కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. సీఎం పర్యటనకు వస్తున్నారంటే, స్కూళ్లు మూసేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు టేకోవర్ చేస్తున్నారని, పెన్షన్ కట్, రేషన్ కట్ అంటూ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కొంతమంది ఇప్పుడే బయటపడటంలేదని, కానీ అందరూ తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

అవినీతి పరుడు దోచుకుంటాడు, అసమర్థుడు ఏమీ చేయకుండా ఉంటాడు. కానీ జగన్ ఇలాంటి వ్యక్తి అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తాడని చెప్పారు చంద్రబాబు. అన్నిటికీ ప్రజలు భయపడే రోజులొస్తున్నాయని.. 2022లో అన్నీ పీక్స్ కి వెళ్లాయి, 2023 ఒక హోప్ తో మొదలవ్వాలని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget