అన్వేషించండి

Nellore Farmers Agitation: అన్నదాతలకు కడుపు మండింది - ఏం చేశారో చూడండి

అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది. ఎమ్మార్వో ఆఫీస్ ని చుట్టుముట్టారు.

Nellore Farmers Agitation: అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది. ఎమ్మార్వో ఆఫీస్ ని చుట్టుముట్టారు. తిండి, నిద్ర అన్నీ అక్కడే అంటున్నారు. రాత్రి పూట కూడా ఇంటికి వెళ్లలేదు. ఎమ్మార్వో ఆఫీస్ ముందే దోమతెరలు కట్టుకుని, చలిలో వణికిపోతూ అక్కడే పడుతున్నారు. తమ ఆందోళనను, ఆక్రోశాన్ని ఆ విధంగా వెలిబుచ్చారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ కోవూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన దీక్షను అర్ధరాత్రి కూడా కొనసాగించారు. చలిని, దోమల రొదను లెక్కచేయకుండా.. దోమతెరలు కట్టుకొని మరీ తమ ఆవేదనను వ్యక్తంచేశారు. 


Nellore Farmers Agitation: అన్నదాతలకు కడుపు మండింది - ఏం చేశారో చూడండి

రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు కుంటిసాకులు చెప్పి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మీరే మిల్లర్ల వద్దకు వెళ్లి అమ్ముకోవాలని చెబుతున్నారని వాపోయారు. పుట్టికి 850 కేజీలు కొలవాల్సి ఉండగా.. తరుగుల పేరుతో అదనంగా 150 కిలోలు కొలవాలంటున్నారని.. అదేమని అధికారులను ప్రశ్నిస్తే, సమాధానం సైతం చెప్పడం లేదని వాపోయారు.

కలెక్టర్ కూడా పట్టించుకోలేదు !  
కలెక్టర్‌‌కుచెప్పినా తమకు న్యాయం జరగలేదంటున్నారు రైతులు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించడం తప్ఫ. క్షేత్రస్థాయిలో రైతులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ అని అంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం అసలు సమస్యలను పరిష్కరించాలని, అధికారుల మాటలను నమ్మి రైతులకు అన్యాయం చేయొద్దని కోరుతున్నారు అన్నదాతలు. తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా నిరసన (Nellore Farmers) చేపట్టారు. 

రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు.. 
ఓవైపు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు తమకు మాత్రం న్యాయం జరగడంలేదంటున్నారు రైతులు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం ఎలా ఉన్నా రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అధికారులు వేసే కొర్రీల వల్ల చాలామంది రైతులు మిల్లర్ల వద్దకు వెళ్తున్నారని, నష్టపోతున్నారని చెబుతున్నారు. 

ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించకపోతే రైతులు తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైతులంతా తహశీల్దార్ కార్యాలయాల వద్దకు చేరుకుని దీక్షలు చేపడుతున్నారు. కోవూరులో ఇలా రాత్రి కూడా ఆఫీస్ ముందే నిద్రపోయి తమ ఆందోళన వెలిబుచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతు కష్టాన్ని మిల్లర్లు, దళారులు, కొందరు అధికారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలు అర్థం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. 

Also Read: Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా మరో అడుగు, వెనక్కి తగ్గేదేలే అంటున్న కేంద్రం

Also Read: Ysrcp Mp Avinash Reddy: ఆ మరక పోగొట్టుకునే ప్రయత్నాల్లో ఏపీ బీజేపీ, ఇప్పుడు రైతు సమస్యలపై ఫోకస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
CNG Car Safety Tips: ఒకవేళ CNG కారు పికప్ అకస్మాత్తుగా తగ్గిపోతే ఇంత డేంజరా? ఈ భాగాన్ని చెక్ చేయకుంటే కారు పనికిరాకుండా పోతుంది!
ఒకవేళ CNG కారు పికప్ అకస్మాత్తుగా తగ్గిపోతే ఇంత డేంజరా? ఈ భాగాన్ని చెక్ చేయకుంటే కారు పనికిరాకుండా పోతుంది!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
Embed widget