అన్వేషించండి

Nellore Farmers Agitation: అన్నదాతలకు కడుపు మండింది - ఏం చేశారో చూడండి

అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది. ఎమ్మార్వో ఆఫీస్ ని చుట్టుముట్టారు.

Nellore Farmers Agitation: అర్జీలు ఇస్తుంటే పట్టించుకోలేదు, తమ కష్టాలు తీర్చండయ్యా అంటే ఎవరూ మాట వినలేదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటే కుదరదరన్నారు. దీంతో రైతులకు కడుపుమండింది. ఎమ్మార్వో ఆఫీస్ ని చుట్టుముట్టారు. తిండి, నిద్ర అన్నీ అక్కడే అంటున్నారు. రాత్రి పూట కూడా ఇంటికి వెళ్లలేదు. ఎమ్మార్వో ఆఫీస్ ముందే దోమతెరలు కట్టుకుని, చలిలో వణికిపోతూ అక్కడే పడుతున్నారు. తమ ఆందోళనను, ఆక్రోశాన్ని ఆ విధంగా వెలిబుచ్చారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ కోవూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన దీక్షను అర్ధరాత్రి కూడా కొనసాగించారు. చలిని, దోమల రొదను లెక్కచేయకుండా.. దోమతెరలు కట్టుకొని మరీ తమ ఆవేదనను వ్యక్తంచేశారు. 


Nellore Farmers Agitation: అన్నదాతలకు కడుపు మండింది - ఏం చేశారో చూడండి

రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు కుంటిసాకులు చెప్పి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మీరే మిల్లర్ల వద్దకు వెళ్లి అమ్ముకోవాలని చెబుతున్నారని వాపోయారు. పుట్టికి 850 కేజీలు కొలవాల్సి ఉండగా.. తరుగుల పేరుతో అదనంగా 150 కిలోలు కొలవాలంటున్నారని.. అదేమని అధికారులను ప్రశ్నిస్తే, సమాధానం సైతం చెప్పడం లేదని వాపోయారు.

కలెక్టర్ కూడా పట్టించుకోలేదు !  
కలెక్టర్‌‌కుచెప్పినా తమకు న్యాయం జరగలేదంటున్నారు రైతులు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించడం తప్ఫ. క్షేత్రస్థాయిలో రైతులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ అని అంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం అసలు సమస్యలను పరిష్కరించాలని, అధికారుల మాటలను నమ్మి రైతులకు అన్యాయం చేయొద్దని కోరుతున్నారు అన్నదాతలు. తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా నిరసన (Nellore Farmers) చేపట్టారు. 

రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు.. 
ఓవైపు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు తమకు మాత్రం న్యాయం జరగడంలేదంటున్నారు రైతులు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం ఎలా ఉన్నా రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అధికారులు వేసే కొర్రీల వల్ల చాలామంది రైతులు మిల్లర్ల వద్దకు వెళ్తున్నారని, నష్టపోతున్నారని చెబుతున్నారు. 

ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించకపోతే రైతులు తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైతులంతా తహశీల్దార్ కార్యాలయాల వద్దకు చేరుకుని దీక్షలు చేపడుతున్నారు. కోవూరులో ఇలా రాత్రి కూడా ఆఫీస్ ముందే నిద్రపోయి తమ ఆందోళన వెలిబుచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతు కష్టాన్ని మిల్లర్లు, దళారులు, కొందరు అధికారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలు అర్థం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. 

Also Read: Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా మరో అడుగు, వెనక్కి తగ్గేదేలే అంటున్న కేంద్రం

Also Read: Ysrcp Mp Avinash Reddy: ఆ మరక పోగొట్టుకునే ప్రయత్నాల్లో ఏపీ బీజేపీ, ఇప్పుడు రైతు సమస్యలపై ఫోకస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget