అన్వేషించండి

Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం, అసలేం జరిగిందంటే!

శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం జీతాలు సరిగా ఇవ్వకుండా వేధిస్తోందని, కాలేజీ డీన్ కూడా తనను వేధిస్తున్నాడంటూ చెప్పాడు ఆ యువకుడు. గత్యంతరం లేక తాను కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. 

నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు స్పందన కార్యక్రమం ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కి తరలి వచ్చారు. వివిధ విభాగాల్లో అర్జీలు ఇచ్చారు. సడన్ గా కలెక్టరేట్ ముందు ఓ దివ్యాంగుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకోబోయాడు. ఆ విషయం గమనించిన కల కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. తన పేరు హేమంత్ కుమార్ అని, శ్రీచైతన్య కాలేజీ రామలింగాపురం బ్రాంచ్ ఇన్ చార్జ్ గా పనిచేస్తున్నానని, జీతాలు సరిగా ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని, కాలేజీ డీన్ కూడా తనను వేధిస్తున్నాడంటూ చెప్పాడు ఆ యువకుడు. గత్యంతరం లేక తాను కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. 


Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం, అసలేం జరిగిందంటే!

ఆరా తీస్తున్న పోలీసులు..
హేమంత్ కుమార్ టీపీ గూడూరు నివాసి అని తేల్చారు పోలీసులు. శ్రీచైతన్య కాలేజీలో పనిచేసేవాడని గుర్తించారు. అయితే శ్రీచైతన్య కాలేజీ డీన్, యాజమాన్యంపై హేమంత్ తీవ్ర ఆరోపణలు చేశాడు. డీన్ తనను మానసికంగా వేధిస్తున్నాడని చెప్పాడు. డీన్ వ్యవహార శైలితో తాము ఉద్యోగాలు చేయలేకపోతున్నామని అన్నాడు. అదే సమయంలో నాలుగున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా జీతాలివ్వడంలేదంటూ ఆరోపణలు చేశాడు హేమంత్. ఆయన ఆరోపణలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. 

నెల్లూరు కలెక్టరేట్ వద్ద గతంలో కూడా చాలామంది ఆత్మహత్యాయత్నం చేసిన ఉదాహరణలున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎవరూ చనిపోలేదు. స్పందన కార్యక్రమంకి వచ్చే బాధితులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారు. కొంతమంది ఏళ్లతరబడి తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటివారు ఆత్మహత్యాయత్నం చేశారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు సంస్థ జీతం ఇవ్వకపోతే దానికి కలెక్టరేట్ లో ఉన్నవారు ఎలాంటి సహాయం చేస్తారనేది తేలాల్సి ఉంది. హేమంత్ నిజంగానే జీతం కోసం ఆత్మహత్యాయత్నం చేశారా..? లేక ఇతర కారణాలున్నాయా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. 

ప్రస్తుతం హేమంత్ ని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వంశీకృష్ణ అనే యువకుడు బ్లేడుతో మణికట్టు దగ్గర గాయం చేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. తన తల్లిదండ్రులిద్దరూ తహశీల్దార్లుగా పనిచేసి రిటైర్ అయ్యారని, తన తల్లి కలెక్టరేట్ కి వచ్చినప్పుడు ఎవరో ఆమెను అవమానించారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. తన తల్లికి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తేల్చారు. ఇప్పుడు హేమంత్ కుమార్ కూడా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యా యత్నం చేయడంతో కలకలం రేగింది. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. విచారణ మొదలు పెట్టారు.  నెల్లూరు కలెక్టరేట్ ఎదుటే ఈ ఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది షాకయ్యారు. అక్కడి దుకాణదారులు కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. పక్కన ఉన్నవారు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget