అన్వేషించండి

Goutham reddy book : గౌతమ్ రెడ్డి 'చిరస్మరణీయుడు', సీఎం చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరణ

మంత్రి పదవిలో ఉండగా అకాల మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి జీవిత చరిత్రపై ఇప్పుడో పుస్తకం రూపొందింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మంత్రి పదవిలో ఉండగా అకాల మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి జీవిత చరిత్రపై ఇప్పుడో పుస్తకం రూపొందింది. ఆయన ప్రజా రాజకీయ జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జర్నలిస్ట్ విజయార్కె ఈ పుస్తకాన్ని అక్షరబద్ధం చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవలే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. జయంతి రోజున ఈ పుస్తకాన్ని ఆవిష్కరిద్దామనుకున్నా అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డ తండ్రి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి సోదరుడు ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారథి కూడా పుస్తకావిష్కరణకు హాజరయ్యారు.

Goutham reddy book : గౌతమ్ రెడ్డి 'చిరస్మరణీయుడు', సీఎం చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరణ

రాజకీయ నేపథ్యం ఉన్న మేకపాటి కుటుంబంలో గౌతమ్ రెడ్డి జన్మించారు. నవంబర్ 2, 1971లో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఆయన జన్మించారు. తండ్రి అడుగుజాడల్లో వ్యాపారవేత్తగా కెరీర్ ప్రారంభించారు. అప్పటికే రాజమోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ జగన్ తో పాటు రాజీనామా చేసి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేసి గెలిచారు. పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట ఉన్న అతికొద్దిమంది నేతల్లో రాజమోహన్ రెడ్డి ఒకరు. ఆ కృతజ్ఞతతోనే ఆ కుటుంబాన్ని తనతోపాటు రాజకీయాల్లో పైకి తెచ్చారు జగన్. రాజమోహన్ రెడ్డి తరపున గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. రాజకీయ ఉద్ధండుడు ఆనం రామనారాయణ రెడ్డిపైనే ఆయన గెలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి దఫా మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు గౌతమ్ రెడ్డి. కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను సమర్థంగా నిర్వహించారు.

2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రెండోసారి కూడా ఆత్మకూరు నుంచి గెలిచారు. యువ మంత్రిగా జగన్ కేబినెట్ లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నార. అయితే అనుకోకుండా ఆయన గుండెపోటుతో మరణించడం బాధాకరం. 2022 ఫిబ్రవరి 21న ఆయన హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించార. అప్పటికి ఆయన వయసు కేవలం 50 ఏళ్లు మాత్రమే. ఫిజికల్ గా ఫిట్ గా ఉండే గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాష్ట్ర రాజకీయాల్లో విషాదంగా మిగిలిపోయింది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబాన్నుంచి ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీఎం జగన్. విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిచారు. గౌతమ్ రెడ్డి పేరుమీదుగా సంగం బ్యారేజ్ ని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేశారు సీఎం జగన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
Embed widget