అన్వేషించండి

Minister Kakani On Jagananna Colonies: జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకోని వారికి నోటీసులు- అధికారులకు మంత్రి కాకాణి ఆదేశం

నెల్లూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో జగనన్న కాలనీల నిర్మాణంపై ఆరా తీశారు మంత్రి గోవర్దన్ రెడ్డి. ప్రోగ్రెస్ సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీలో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని జిల్లాల్లో అధికారుల చొరవతో ఇళ్ల నిర్మాణం వేగవంతమైంది. కానీ మిగతా చోట్ల మాత్రం పనులు ముందుకు సాగడంలేదు. నెల్లూరు జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. దీనిపై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

నెల్లూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో జగనన్న కాలనీల నిర్మాణంపై ఆరా తీశారు మంత్రి గోవర్దన్ రెడ్డి. ప్రోగ్రెస్ సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు 58 వేల ఇళ్లు మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు 21.36 శాతం మాత్రమే ప్రారంభం కావడం ఏంటని గృహ నిర్మాణశాఖ అధికారులను నిలదీశారు మంత్రి కాకాణి. 227 లేఅవుట్లలో 131 చోట్ల నీటి వసతి కల్పించామని అధికారులు చెప్పగా... నీరు లేకపోతే నిర్మాణదారులు ఎందుకు ముందుకొస్తారన్నారు. ఇల్లు ప్రారంభించే నాటికి నీరు.. పూర్తయ్యే నాటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కొన్ని మండలాల్లో బిల్లులు చేసేందుకు అధికారులు లేరని చెప్పడంతో ఇంజినీరింగ్‌ సహాయకులను ఉపయోగించుకోవాలని తెలిపారు. వారు చేసిన వాటిని.. పరిశీలనలోకి తీసుకోని ఏఈలకు మెమోలు జారీ చేయాలని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. వారంలో పెండింగ్‌ బిల్లులు పూర్తి చేయాలని, ఏఈలు లేని చోట ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను ఇన్‌ ఛార్జులుగా పెట్టాలని సూచించారు.

ఇల్లు కట్టకపోతే నోటీసులివ్వండి..

జగనన్న లేఅవుట్లలో ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు రాని లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని, అప్పటికీ స్పందించకపోతే కట్టుకునేందుకు ఆసక్తిగా ఉన్న పేదలకు కేటాయించాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. లబ్ధిదారులు కొన్నిచోట్ల ముందుకు రాకపోవడంతో జగనన్న కాలనీల వ్యవహారం ఆలస్యమవుతోందని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఆయన ఇల్లు కట్టుకునేందుకు ముందుకు రాకపోతే లబ్ధిదారులకు నోటీసులివ్వాలన్నారు. ఇల్లు కట్టుకునే ఆసక్తి ఉన్నవారికే స్థలాలు ఇవ్వాలని సూచించారు. 

జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, నాడు-నేడ, ఉపాధిహామీ పనులు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కాకాణి. తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులకు అవసరమైన 8 రకాల సామగ్రిని విద్యాకానుక ద్వారా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది అమ్మఒడి చాలా మందికి అందలేదని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని.. ఈ పథకానికి ముందే నిర్దుష్టమైన నిబంధనలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందన్నారు. సాంకేతిక కారణాలతో అందని వారికి .. వెంటనే అందజేస్తామన్నారు. జిల్లాలో రూ. 162 కోట్లతో ఆర్‌అండ్‌బీ పనులు జరుగుతున్నాయని.. వాటికి సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget