అన్వేషించండి

అమరావతి రాజధాని కాదు- చంద్రబాబు గేటెడ్ కమ్యూనిటీ: మంత్రి కాకాణి

చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. తనకి ఓట్లు వేసిన ప్రజల గురించి పట్టించుకోకుండా అసెంబ్లీకి మొహం చాటేసి కూర్చున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకి సిగ్గు, శరం ఏదీ లేదని.. అందుకే ఆయన తనకి ఓట్లు వేసిన ప్రజల గురించి పట్టించుకోకుండా అసెంబ్లీకి మొహం చాటేసి కూర్చున్నారని మండిపడ్డారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. రెండు రోజుల అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ కోసం అధికార పక్షం ప్రయత్నిస్తుంటే టీడీపీ రాద్ధాంతం చేసి బయటకు పారిపోయిందని అన్నారాయన. అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన డైరెక్షన్లో టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అవడానికే ప్రయత్నిస్తున్నారని, ప్రజల గురించి మాట్లాడే అవసరం వారికి లేదన్నారు.

సిగ్గుంటే చంద్రబాబు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు మంత్రి కాకాణి. నారా హమారా, అమరావతి హమారా అంటూ యాత్రలు చేస్తున్నారని, అది రాజధాని యాత్ర కాదని, చంద్రబాబు పాపాల యాత్ర అని మండిపడ్డారు. అమరావతి రాజధాని కాదని, అది చంద్రబాబు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు. అక్కడ చంద్రబాబు, ఆయన వర్గానికి చెందిన కొంతమంది మాత్రమే ఉంటారన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అక్కడ టీడీపీ నేతలు భూములెలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు కాకాణి. అమరావతిలో టీడీపీ నేతలు ఎక్కడెక్కడ భూములు కొన్నారో సాక్ష్యాధారాలతో తాము రుజువు చేశామని, కానీ వారి బుకాయింపులు మాత్రం ఆగలేదన్నారు. రాజధాని వస్తుందని వారికి ముందే తెలిసి భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇంతకంటే రుజువులు కావాలా అని ప్రశ్నించారు కాకాణి. 

శ్రీలంకలా ఏపీ కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అందుకే పదే పదే అదే ప్రస్తావన తెస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సెక్యూరిటీ లేకుండా ప్రజలకు కనపడితే బాది పడేస్తారని, బాదుడే బాదుడు అంటే అర్థం ప్రజలే చూపిస్తారని అన్నారు కాకాణి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే తాము ధైర్యంగా గడప గడపకు తిరుగుతున్నామని చెప్పారు కాకాణి. కానీ టీడీపీ బాదుడే బాదుడు అంటూ ఫొటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటోందని మండిపడ్డారాయన. అసలు చంద్రబాబు ఏం చేశారని జనంలోకి వస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. 

ఉద్యోగాలివ్వలేదంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, అసలు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకి లేదన్నారు కాకాణి. ఉద్యోగాలివ్వలేదంటూ రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు, ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. తాను ఉద్యోగాలు ఇవ్వలేకపోయానంటూ చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాకాణి. ఉద్యోగాల పేరుతో మోసం చేశారని అన్నారు. 

కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దామని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు మంత్రి కాకాణి. గతంలో కూడా ఇవే నిధులు ఉన్నాయాని, అప్పుడు ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. ఏపీలో సమగ్రంగా స్కూల్స్ అభివృద్ధి చేసామని, హాస్టల్స్ అభివృద్ధి చేశామని చెప్పారు. 

గుమ్మడికాయల దొంగలు..

శాసన మండలిలో కూడా టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని మండిపడ్డారు కాకాణి గోవర్దన్ రెడ్డి. గత ప్రభుత్వాలు వ్యవసాయం శుద్ధ దండగ అని అన్నామని తమ నేతలు అంటే.. లోకేష్ చటుక్కున లేచి తామెక్కడన్నామని ప్రశ్నించారని, గుమ్మడికాయల దొంగ అంటే లోకేష్ భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించారు కాకాణి. 

టీడీపీ హయాంలో 10 మందికి ఇన్నోవా కార్లు మరో 10మందికి లోన్లు ఇచ్చారని, నీరు చెట్టుకింద పనులు చేయకుండా నిధులు భోం చేశారని చెప్పారు. నీరు చెట్టు కింద ఎంత ఆయకట్టు స్థిరీకరించారో చెప్పాలన్నారు. తమకి అనుకూలమైనవారికి మాత్రమే వారి హయాంలో పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, వైసీపీ హయాంలో అర్హులందరికీ లబ్ధి చేకూరిందని చెప్పారు కాకాణి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Embed widget