అన్వేషించండి

Kandukur Tdp News: కందుకూరు టీడీపీలోకి బీజేపీ లీడర్- ఆమె రాకతో అసెంబ్లీ సీటుపై మారుతున్న అంచనాలు

Kandukur News: కందుకూరు టీడీపీలో అసలైన ఫైట్‌ ఇప్పుడు మొదలు కానుందని నేతలు అంటున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన నళినీ దేవి సైకిల్ ఎక్కడంతో అక్కడ సీటు కోసం పార్టీలో హోరాహోరీ తప్పదని చెబుతున్నారు.

Nellore News: కొత్తగా నెల్లూరు జిల్లాలో చేరిన నియోజకవర్గం కందుకూరు. 1999 తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ(TDP)కి అవకాశమే రాలేదు. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రెండుసార్లు వైసీపీ(YSRCP) అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ టీడీపీ పాగా వేయాలనుకుంటోంది. అందు కోసం కాస్త బలంగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఇక్కడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఇంటూరి నాగేశ్వరరావు(Inturi Nageswara Rao) ఉన్నారు. దాదాపుగా ఆయనే టీడీపీ అభ్యర్థి అనే ప్రచారం జరిగింది. అయితే సడన్ గా ఇప్పుడు ఆయనకు పోటీ వస్తున్నారు ఓ మహిళా నేత. ఆమె టీడీపీలో సీనియర్ కాదు, అలాగని రాజకీయాలకు కొత్త మాత్రం కాదు. ప్రస్తుతం బీజేపీలో ఉండి, బీజేపీ కందుకూరు ఇన్ చార్జ్ గా ఉన్న ఉన్నం నళినీ దేవి(Unnam Nalini Devi) ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ కందుకూరు టికెట్ ఆమెకేననే ప్రచారం బలంగా జరుగుతోంది. ఆ హామీతోనే ఆమె టీడీపీలో చేరుతున్నారని కూడా తెలుస్తోంది. మరి ఎన్నికల వేళ చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారో వేచి చూడాలి. 

కందుకూరు ప్రత్యేకం..
ఏడాది క్రితం కందుకూరు నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. 2022 డిసెంబర్ చివర్లో కందుకూరులో జరిగిన టీడీపీ మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం సంచలనంగా మారింది. ఆ తర్వాత కందుకూరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ స్పందించిన తీరు, స్థానిక నేతలు బాధితుల్ని ఆదుకున్న తీరు స్థానిక ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ప్రమాదం వల్ల కందుకూరులో టీడీపీ క్రేజ్ తగ్గుతుందని అందరూ భావించినా.. వారికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అంటున్నారు. 

వైసీపీ సంగతేంటి..?
కందుకురూ వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఈసారి అంత టఫ్ ఫైట్ ఇచ్చేలా లేరు. ప్రస్తుతం పార్టీ ఆయనకు ఇంకా టికెట్ ఖరారు చేయలేదు. ఇటీవల అధిష్టానంతో మానుగుంటకు వ్యవహారం చెడిందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతల్ని ఘాటుగా విమర్శించాలని ఐప్యాక్ టీమ్ ఎమ్మెల్యేకి సూచించడంతో రాజకీయ కలకలం రేగింది. పక్క పార్టీలవారిని తిట్టి టికెట్ దక్కించుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నారు మానుగుంట. ఈ దశలో అసలాయనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో కూడా తెలియదు. 

టీడీపీలో ఎవరికి..?
ఇప్పటి వరకు ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోరాటాలు చేసిన ఉన్నం నళినీ దేవి సడన్ గా టీడీపీలోకి వస్తుండటంతో పరిస్థితులు మారిపోయాయి. మహిళ కావడంతో ఆమెకు అక్కడ టీడీపీ టికెట్ దక్కే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆ హామీతోనే ఆమె టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. 

ఉన్నం నళినీ దేవి కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై ముందు నుంచీ ఫోకస్ తో ఉన్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి స్థానికంగా పట్టుందని అంటున్నారు. స్థానికంగా ఆటల పోటీలు నిర్వహించి క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ లు అందిస్తుంటారామె. బీజేపీ తరపున వివిధ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరితో కూడా ఆమెకు సత్సంబంధాలున్నాయి. బీజేపీలో కూడా ఆమె చురుగ్గా ఎదుగుతున్నారు. అయితే ఆమె సడన్ గా టీడీపీ స్టాండ్ తీసుకోవడం విశేషం. టీడీపీలో స్థానిక నేతలు కూడా ఆమె రాకను స్వాగతిస్తున్నారు. అయితే ఇంటూరి నాగేశ్వరరావు వర్గం మాత్రం ఆమెతో పోటీ తప్పదని ఫిక్స్ అయింది. మరి కందుకూరు టికెట్ పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Virat Kohli : విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
Embed widget