అన్వేషించండి

Handicap Person Death : ఎస్సై వేధింపులతోనే చనిపోయాడా?- సంచలనం సృష్టిస్తున్న దివ్యాంగుడి మృతి

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో తిరుపతి అనే ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నెల్లూరు(Nellore) జిల్లా మర్రిపాడు(Marripadu) మండలం చుంచులూరులో ఓ దివ్యాంగుడి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. ఖాకీల వేధింపులతోనే తన బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆ వ్యక్తి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని.. తప్పు చేస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. 

చుంచులూరుకు చెందిన తిరుపతి అనే ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పొలం కంచె దొంగతనం నేపథ్యంలో తిరుపతి అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఎస్సై వెంకట రమణ కొట్టాడని అంటున్నారు. అప్పటికే రెండుసార్లు తీవ్రంగా కొట్టారని, మూడోసారి మళ్లీ పోలీస్ స్టేషన్ కి పిలవడంతో భయపడి తిరుపతి పురుగుల మందు తాగాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుపతి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.. 

అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లాలోనే అనంతసాగరం(Ananta Sagaram) మండలం గుడిగుంట్లకు చెందిన పొట్టపల్లి శ్రీనివాసులు, లక్ష్మమ్మ ఉపాధి నిమిత్తం చుంచులూరుకు వలస వచ్చారు. వారికి దివ్యాంగుడైన కుమారుడు తిరుపతి ఉన్నాడు. చుంచులూరులో ఆ కుటుంబం కృష్ణమూర్తి  అనే రైతుకి చెందిన పొలానికి కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉండేది. సరిగా నడవలేని తిరుపతి ఇంటి దగ్గరే ఉండేవాడు.  కృష్ణమూర్తికి చెందిన పొలం పక్కనే ఆందనేయ రెడ్డికి అనే వ్యక్తికి కూడా పొలం ఉండేది. ఆ పొలానికి వేసిన ఫెన్సింగ్ కంచెను ఎవరో దొంగతనం చేశారు. దొంగతనం చేసినవారిని విచారించే క్రమంల స్థానిక ఎస్సై వెంకట రమణ.. తిరుపతిని స్టేషన్ కి పిలిపించాడని సమాచారం. 

అయితే విచారణ పేరుతో ఎస్సై వెంకట రమణ తమ కుమారుడు తిరుపతిని స్టేషన్ కి పిలిపించి కొట్టేవాడని చెబుతున్నారు తిరుపతి తల్లిదండ్రులు. ఈ క్రమంలో తమ కుమారుడు తీవ్రంగా బాధపడేవాడని, కనిపించని దెబ్బలతో ఇబ్బంది పడ్డాడని అంటున్నారు. మూడోసారి కూడా పోలీసులు స్టేషన్‌ కు పిలవడంతో భయంతో తమ కుమారుడు తిరుపతి పురుగుల మందు తాగాడని చెబుతున్నారు తల్లిదండ్రులు. పురుగుల మందు తాగడంతో ముందుగా తిరుపతిని నెల్లూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు తమను అడ్డుకుని తమ కుమారుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ తమ కుమారుడు మరణించాడని చెప్పారు. తమ కుమారుడి మృతికి ఎస్సై వెంకట రమణ కారణం అంటూ వారు ఆరోపిస్తున్నారు. 


Handicap Person Death : ఎస్సై వేధింపులతోనే చనిపోయాడా?- సంచలనం సృష్టిస్తున్న దివ్యాంగుడి మృతి

పోలీస్ విచారణ.. 
దివ్యాంగుడు తిరుపతి మరణంపై ఖాకీలపైనే ఆరోపణలు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. విచారణ చేపట్టారు. ఎస్సైపై ఆరోపణలు రావడంతో.. విచారణ అధికారిగా అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరిని నియమించారు. తప్పు చేసిన వారెవరైనా క్షమించేది లేదని అంటున్నారు. పోలీసుల తరపున ఇబ్బందులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు జిల్లా ఎస్పీ విజయరావు. మొత్తమ్మీద తిరుపతి ఆత్మహత్య వ్యవహారంలో పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ ఉంది అనే ఆరోపణలు రావడంతో జిల్లాలో కలకలం రేగింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Amaravati Latest News: రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KKR VS SRH: స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
Perni Nani Fire: కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Embed widget