అన్వేషించండి

EBC Nestham: ఈసారి బటన్ నొక్కింది జగన్ కాదు, మాజీ మంత్రి బాలినేని - ఎందుకంటే?

సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా బాలినేని ఎక్కడున్నారో కనుక్కొని ఆయన్ను సభా వేదికవద్దకు తీసుకొచ్చారు.

సంక్షేమ కార్యక్రమాల నిధులు విడుదల చేసే సందర్భంలో సీఎం జగన్ ల్యాప్ టాప్ బటన్ నొక్కడం ఆనవాయితీ. ఆయన ల్యాప్ టాప్ బటన్ నొక్కిన తర్వాత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్టు స్క్రీన్ పై వారి జాబితా కనపడుతుంది. అయితే ఈసారి ఈబీసీ నేస్తం విడుదల సందర్భంగా మార్కాపురంలో జరిగిన సభలో నిధులు విడుదలయ్యాయి. కానీ ల్యాప్ టాప్ పై బటన్ నొక్కింది సీఎం జగన్ కాదు. మాజీ మంత్రి బాలినేని. దీనికో ప్రత్యేక కారణం ఉంది. 

ఈబీసీ నేస్తం నిధుల విడుదల కోసం ఈరోజు సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లారు. ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. అయితే ఈ సభలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అవమానం జరిగింది. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు జగన్ కి అనుమతి ఇవ్వలేదు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్లాలని చెప్పారు. దీంతో బాలినేని నొచ్చుకున్నారు. అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు. 

ఈబీసీ నేస్తం సభ ప్రారంభమైనా బాలినేని సభా ప్రాంగణంలోకి రాలేదు. స్టేజ్ పై కూడా బాలినేని లేకుండానే కార్యక్రమం మొదలైంది. జిల్లా నేతలతోపాటు మంత్రులు.. సీఎం జగన్ తో కలసి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు మీడియాలో బాలినేని వ్యవహారం హైలెట్ గా మారింది. ఆయన అలిగారని, సొంత జిల్లాలోనే తనకు అవమానం జరిగిందని వెనక్కి వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. అటు స్టేజ్ పై బాలినేని కనపడకపోవడంతో జగన్ కూడా ఆరా తీశారు. బాలినేని అలిగి వెళ్లిపోయారని తేలడంతో ఆయనకు కబురు పంపించారు. వెంటనే ఆయన్ను సభా ప్రాంగణానికి తీసుకు రావాలని అధికారుల్ని ఆదేశించారు. 

జగన్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా బాలినేని ఎక్కడున్నారో కనుక్కొని ఆయన్ను సభా వేదికవద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆయన వేదికనెక్కారు. సభ ప్రారంభంలో బాలినేని అక్కడ లేకపోయినా సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా ఆయన మార్కాపురం వచ్చారు. జగన్ తోపాటు వేదికపైకి వచ్చారు. సరిగ్గా నిధుల విడుదల సమయంలో బాలినేని స్టేజ్ ఎక్కారు. జగన్ ఆయన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆయనతోనే ల్యాప్ టాప్ పై బటన్ నొక్కించి నిధులు విడుదల చేశారు. దీంతో బాలినేని అలకపాన్పు దిగారు. సీఎం జగన్ పర్యటనలో బాలినేని వ్యవహారం కలకలం రేపినా చివరకు నేరుగా జగనే చొరవ తీసుకుని సమస్య పరిష్కరించారు. బాలినేని అలక తీర్చారు. 

ఈబీసీ నేస్తం కార్యక్రమం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ.. ఇతర ఓసీ కులాలలోని పేద మహిళలకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈబీసీ వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget