అన్వేషించండి

EBC Nestham: ఈసారి బటన్ నొక్కింది జగన్ కాదు, మాజీ మంత్రి బాలినేని - ఎందుకంటే?

సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా బాలినేని ఎక్కడున్నారో కనుక్కొని ఆయన్ను సభా వేదికవద్దకు తీసుకొచ్చారు.

సంక్షేమ కార్యక్రమాల నిధులు విడుదల చేసే సందర్భంలో సీఎం జగన్ ల్యాప్ టాప్ బటన్ నొక్కడం ఆనవాయితీ. ఆయన ల్యాప్ టాప్ బటన్ నొక్కిన తర్వాత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్టు స్క్రీన్ పై వారి జాబితా కనపడుతుంది. అయితే ఈసారి ఈబీసీ నేస్తం విడుదల సందర్భంగా మార్కాపురంలో జరిగిన సభలో నిధులు విడుదలయ్యాయి. కానీ ల్యాప్ టాప్ పై బటన్ నొక్కింది సీఎం జగన్ కాదు. మాజీ మంత్రి బాలినేని. దీనికో ప్రత్యేక కారణం ఉంది. 

ఈబీసీ నేస్తం నిధుల విడుదల కోసం ఈరోజు సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లారు. ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. అయితే ఈ సభలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అవమానం జరిగింది. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు జగన్ కి అనుమతి ఇవ్వలేదు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్లాలని చెప్పారు. దీంతో బాలినేని నొచ్చుకున్నారు. అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు. 

ఈబీసీ నేస్తం సభ ప్రారంభమైనా బాలినేని సభా ప్రాంగణంలోకి రాలేదు. స్టేజ్ పై కూడా బాలినేని లేకుండానే కార్యక్రమం మొదలైంది. జిల్లా నేతలతోపాటు మంత్రులు.. సీఎం జగన్ తో కలసి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు మీడియాలో బాలినేని వ్యవహారం హైలెట్ గా మారింది. ఆయన అలిగారని, సొంత జిల్లాలోనే తనకు అవమానం జరిగిందని వెనక్కి వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. అటు స్టేజ్ పై బాలినేని కనపడకపోవడంతో జగన్ కూడా ఆరా తీశారు. బాలినేని అలిగి వెళ్లిపోయారని తేలడంతో ఆయనకు కబురు పంపించారు. వెంటనే ఆయన్ను సభా ప్రాంగణానికి తీసుకు రావాలని అధికారుల్ని ఆదేశించారు. 

జగన్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా బాలినేని ఎక్కడున్నారో కనుక్కొని ఆయన్ను సభా వేదికవద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆయన వేదికనెక్కారు. సభ ప్రారంభంలో బాలినేని అక్కడ లేకపోయినా సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా ఆయన మార్కాపురం వచ్చారు. జగన్ తోపాటు వేదికపైకి వచ్చారు. సరిగ్గా నిధుల విడుదల సమయంలో బాలినేని స్టేజ్ ఎక్కారు. జగన్ ఆయన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆయనతోనే ల్యాప్ టాప్ పై బటన్ నొక్కించి నిధులు విడుదల చేశారు. దీంతో బాలినేని అలకపాన్పు దిగారు. సీఎం జగన్ పర్యటనలో బాలినేని వ్యవహారం కలకలం రేపినా చివరకు నేరుగా జగనే చొరవ తీసుకుని సమస్య పరిష్కరించారు. బాలినేని అలక తీర్చారు. 

ఈబీసీ నేస్తం కార్యక్రమం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ.. ఇతర ఓసీ కులాలలోని పేద మహిళలకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈబీసీ వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget