అన్వేషించండి

CM Jagan: సంగం బ్యారేజ్ ప్రారంభించిన జగన్,  జాతికి అంకితం చేసిన సీఎం

నెల్లూరు జిల్లా సంగంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని సీఎం జగన్ ప్రారంభించారు. బ్యారేజ్ ప్రారంభోత్సవ సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించిన జగన్, అనంతరం పెన్నాకు హారతులిచ్చారు.

నెల్లూరు జిల్లా సంగంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని సీఎం జగన్ ప్రారంభించారు. బ్యారేజ్ ప్రారంభోత్సవ సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించిన జగన్, అనంతరం పెన్నాకు హారతులిచ్చారు. సీఎం జగన్ వెంట జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సంగం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకున్న జగన్ సంగం బ్యారేజ్ వద్దకు బస్సులో వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన నాయకులను సీఎం జగన్ కు పరిచయం చేశారు. అక్కడినుంచి నేరుగా బ్యారేజ్ ఆవిష్కర సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం పెన్నా నదికి ఆయన హారతి ఇచ్చారు. బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సమయంలో గౌతమ్ రెడ్డి సతీమణి, కుమార్తె.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. CM Jagan: సంగం బ్యారేజ్ ప్రారంభించిన జగన్,  జాతికి అంకితం చేసిన సీఎం

సంగంకు వచ్చిన సీఎం జగన్ కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర జలవనరు శాఖమంత్రి అంబటి రాంబాబు కూడా జగన్ వెంట ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తూమాటి మాధవ రావు, ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , మానుగుంట మహీధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, కిలివేటి సంజీవయ్య,  వరప్రసాద రావు, ఆనం రామనారాయణరెడ్డి.. జగన్ కు స్వాగతం పలికారు. 

సంగం బ్యారేజ్ కి 2008లో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయగా, నేడు ఆయన తనయుడు జగన్ హయాంలో ప్రాజెక్ట్ పూర్తయింది. పెన్నా డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువల కింద సుమారు 3,85,000 ఎకరాల ఆయకట్టు ఈ బ్యారేజ్ వల్ల సాగులోకి వస్తుంది. రూ. 335.80 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజ్ నిర్మించారు. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల పొదలకూరు సంగం మండలాల మధ్య గల రాకపోకల సమస్యలు పరిష్కారం అవుతుంది. బ్యారేజ్ లో 0.45 టీఎంసీల నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల భూగర్భజల మట్టం పెరిగి చుట్టుప్రక్కల గ్రామాలలోని త్రాగు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తీవ్ర వరద పరిస్థితులలో ఈ బ్యారేజీ వరద నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. సంగం బ్యారేజ్ పర్యాటకంగా కూడా ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ గా మారుతుంది. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకమునుపే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడంతో.. ఆయన పేరుని ఈ బ్యారేజ్ కి పెట్టారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
AI Generated Videos : AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
Vijay Deverakonda Rashmika: రోమ్‌లో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ - రష్మిక... వైరల్ ఫోటోలు
రోమ్‌లో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ - రష్మిక... వైరల్ ఫోటోలు
Ikkis Movie Collection: ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
Embed widget