అన్వేషించండి

Balineni Episode: బాలినేని శ్రీనివాసులరెడ్డి గెలిచారా ఓడారా? లేదా బలిచేశారా? ఆ బెట్టు ఎందుకు?

జగన్ తో భేటీ తర్వాత బాలినేనికి తన భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేసినట్టుంది. అదే సమయంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, బాలినేని తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామంటూ ముందుగానే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కోఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత జగన్ బుజ్జగించడం, అయినా బాలినేని బెట్టువీడక పోవడం అన్నీ తెలిసిందే. అయితే ఆ తర్వాత వైసీపీ రియాక్షనే కాస్త వయలెంట్ గా ఉంది. అసలు కప్పులో టీయే లేదు, ఇక తుపానెక్కడిది అంటూ ఆ వ్యవహారాన్ని తీసిపారేసినట్టు మాట్లాడారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బాలినేని వ్యవహారాన్ని ఆయన అంత తేలిగ్గా ఎందుకు తీసేశారు అనేదే ఇప్పుడు తేలాల్సిన విషయం. అయితే ఈలోగా బాలినేనిపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు, ఆయనపై వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లు వైసీపీ-బాలినేని మధ్య దూరాన్ని పెంచుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. 

జగన్ చెప్పినా ఎందుకు ఒప్పుకోలేదు..
పార్టీకి బాలినేని అవసరం ఎంతైనా ఉంది, ఈ దశలో పార్టీ కూడా బాలినేనికి అంతే అవసరం. కానీ ఆయన డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. పార్టీ బాధ్యతలు తనకు వద్దన్నారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవాలి, నాక్కాస్త విశ్రాంతి కావాలంటున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ ఆ బాధ్యతల్ని ఆయన ఎందుకు మోశారు. పక్క జిల్లాల్లో సమస్యలు వచ్చినా వెళ్లి ఎందుకు చక్కబెట్టి వచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని డీల్ చేసింది బాలినేనే. ఎంపీ ఆదాలను వెంటబెట్టుకుని జగన్ ని కలిసి, ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జి పదవిని ఇప్పించింది కూడా ఆయనే. అలాంటి బాలినేని ఆ పెత్తనాన్ని ఎందుకు వదులుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకిలా జరిగింది..?

బాలినేనికి శతృత్వం ఎవరితో..?
జిల్లా రాజకీయాలకు సంబంధించి బాలినేని శ్రీనివాసులరెడ్డికి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ అంటే పడదనే ప్రచారం ఉంది. అయితే జిల్లాపై పెత్తనం కోసం సురేష్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అనుకోకుండా ఆయన మంత్రి పదవి ఉంది, బాలీనేని పదవి ఊడింది.. అంతే తేడా. అంతమాత్రాన పదవులు శాశ్వతం అని సురేష్ అనుకోలేదు, ఆయన జిల్లాపై పెత్తనం కోరుకోలేదు కూడా. కానీ జిల్లాలో తనకు మంత్రి పదవిపోయి, సురేష్ కి కొనసాగించడంతో బాలినేని బాగా ఫీలయ్యారని తెలుస్తోంది. 

బాలినేని పాత శత్రువు వైవీ సుబ్బారెడ్డి. బంధువులైనా కూడా వారి మధ్య సఖ్యత లేదనే విషయం అందరికీ తెలుసు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి పెత్తనం తగ్గిన తర్వాత మళ్లీ సుబ్బారెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఉత్తరాంధ్రకు వైవీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. పార్టీలో వైవీకి ప్రాధాన్యం పెరిగిందంటే, కచ్చితంగా అది బాలినేనికి ఇబ్బందే. అందుకే ఆయన కాస్త బెట్టు చూపించాలనుకున్నారు. పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు.

జగన్ నుంచి పిలుపు రాగానే సర్దుబాట్లు ఉంటాయని వెళ్లారు. కానీ అక్కడ బుజ్జగింపులేవీ లేవని తేలిపోయింది. రాజీనామాని జగన్ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు. బాలినేని తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అందుకే సజ్జలనుంచి టీ లేదు, కప్పు లేదు, తుపాన్ లేదు అనే మాటలు వినిపించాయి. ఒకరకంగా జగన్ తో భేటీ తర్వాత బాలినేనికి తన భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేసినట్టుంది. అదే సమయంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, బాలినేని తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామంటూ ముందుగానే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Bihar Assembly Elections 2025:ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు  ఏంటీ?
ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు ఏంటీ?
Ramachandrapuram Crime News: రామ‌చంద్ర‌పురంలో బాలిక అనుమానాస్ప‌ద మృతి; ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే డౌట్‌
రామ‌చంద్ర‌పురంలో బాలిక అనుమానాస్ప‌ద మృతి; ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే డౌట్‌
Andhra Pradesh New Districts : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 
Embed widget