అన్వేషించండి

YS Jagan At Gautham Reddy Condolence Meeting: నేను లేకపోతే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో: ఏపీ సీఎం జగన్

నెల్లూరు నగరంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. చిన్నప్పటి నుంచి తనకు గౌతమ్ రెడ్డితో పరిచయం ఉందని, గౌతమ్ లేడన్న విషయం ఇంకా నమ్మలేకపోతున్న అన్నారు.

Gautham Reddy Condolence Meeting In Nellore:  చిన్నప్పటి నుంచి తనకు గౌతమ్ రెడ్డితో పరిచయం ఉందని, ఏపీ మాజీ మంత్రి ఇక లేరన్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను లేకపోతే గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి కూడా వచ్చి ఉండేవాడు కాదేమోనని అన్నారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు నగరంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి తాను బయటకు అడుగు వేసినప్పుడు కాంగ్రెస్ తో తమకు యుద్ధం మొదలైందని చెప్పారు. గౌతమ్ రెడ్డి వల్లే అప్పట్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా తనతో కలసి అడుగు వేశారని, తన ప్రతి అడుగులో గౌతమ్ తోడుగా ఉన్నారని చెప్పారు. 

నా కంటే గౌతమ్ పెద్దవాడు.. 
తనకంటే గౌతమ్ రెడ్డి (Gautham Reddy Elder Than AP CM YS Jagan) ఓ ఏడాది పెద్దవాడని, కానీ తనకంటే పెద్ద అని మనసులో పెట్టుకోలేదని, తనని ఓ అన్నగా భావించేవారని చెప్పారు. నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధిస్వావంటూ తనను కూడా గౌతమ్ ప్రేరేపించేవారని గుర్తు చేసుకున్నారు. కాలక్రమంలో గౌతమ్ ని తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగాడని గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంచి మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్.. ఇలా మొత్తం 6 శాఖలకు  ఆయన మంత్రిగా వ్యవహరించి ఏపీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని అన్నారు. చివరి క్షణాల్లో కూడా దుబాయ్ కి వెళ్లొచ్చిన తర్వాత తనను కలిసేందుకు టైమ్ అడిగారని, ఆలోపే ఇలా జరిగిందని గుర్తు చేసుకున్నారు జగన్.

ఆ బాధ ఎప్పటికీ తీరదు 
మంచి స్నేహితుడు, మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధ తనకు ఎప్పటికీ తీరదన్నారు సీఎం జగన్. మంచి వ్యక్తిని కోల్పోయాం కానీ, ఆ కుటుంబానికి తనతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందన్నారు. ఆ లోటు భర్తీ చేయలేం కానీ, ఆయన అందరి మనసుల్లో ఉన్నారని చెప్పారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కాలేజీ గురించి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) తనకు చెప్పారని, ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరిగే విషయాలను తన దృష్టికి తెచ్చారని అన్నారు. అన్నిటినీ కచ్చితంగా పూర్తి చేస్తామని, సంగం బ్యారేజ్ పనుల్ని మే 15లోపు పూర్తి చేసి, సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడతామన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభించే టైమ్ లో మేకపాటి కుటుంబాన్ని ఆహ్వానిస్తామని, మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అనే పేరు పెట్టి, గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామన్నారు జగన్. అన్నిరకాలుగా ఆ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నట్టు చెప్పారు జగన్. 

Also Read: AP BJP : సోము వీర్రాజును తొలగిస్తున్నారా ? ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రేస్ ప్రారంభమైపోయింది !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget