అన్వేషించండి

Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం

Crime News: ప్రార్థనలు చేస్తే జబ్బులు తగ్గుతాయన్న నమ్మం బాలిక ప్రాణాలు తీసింది. బ్రెయిన్ ట్రూమర్‌తో బాధపడుతున్న పాపతో 40 రోజులపాటు ప్రార్థనలు చేయించిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

Prakasam District Crime News : అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి వెళ్లాలి... కానీ ఓ బాలికను చర్చిలో ఉంచి ప్రార్థనలు చేశారు. చివరకు ఆమె ప్రాణాలు పోయాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే చికిత్స చేయించే స్థోమత లేక ప్రార్థనలతో నయం చేయించాలని చూశామంటున్నారు తల్లిదండ్రులు. 

ప్రకాశం జిల్లా కలువాయి మండలం బాలాజీరేవుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య దంపతులకు 8 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె పేరు భవ్య శ్రీ. రెండు నెలల క్రితం ఆమెకు జబ్బు చేసింది. స్పృహతప్పి పడిపోవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. 

చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. చెన్నై కానీ,హైదరాబాద్‌ కానీ తరలించి మెరుగైన వైద్యం అందించకపోతే ప్రమాదమని హెచ్చరించారు. ముందు భయపడిపోయిన తల్లిదండ్రులకు వైద్యులు చెప్పిన సూచన కాస్త ఊరట కల్పించింది. మంచి వైద్యం అందిస్తే బాలికకు ప్రమాదం ఉండదని తేలింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లక్ష్మయ్య దంపతులు. 

Also Read: ఉప్పెన సినిమా క్లైమాక్స్ రిపీట్ - కాకపోతే కట్ చేసింది అమ్మాయే - శృంగారానికి నిరాకరించాడని కట్టలు తెగిన కోపం!

ఆసుపత్రికి వెళ్లే ముందు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుందామని కొన్ని రోజుల క్రితం చేజర్ల మండలంలోని అదురుపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్ బాలిక గురించి తెలుసుకున్నారు. ప్రార్థనలు చేస్తే బాలికకు నయమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. పాస్టర్ మాటలు విన్న బాలిక తల్లిదండ్రులు కొన్ని రోజులు అక్కడే ఉంచి ప్రార్థనలు చేయించారు. 

కొన్ని రోజుల ప్రార్థనలకు బాలిక చలాకీగా తిరగడం మొదలు పెట్టిందని అంటున్నారు. జబ్బు తగ్గుముఖం పట్టిందని ఆనందంతో వచ్చే వారికి అన్నదానం కూడా చేశారట. ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. కొద్ది రోజులకే మళ్లీ బాలిక అనారోగ్యం పాలైంది. చివరకు సోమవారం చనిపోయింది. 

విషయం తెలుసుకున్న బంధువులు వచ్చి చర్చి వద్ద ఆందోళన చేశారు. అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం అందించకుండా మోసం చేశారని ఆరోపించారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందని వైద్యులు చెబితే ప్రార్థనలతో ఎలా నయం చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా మోసం కాదా అంటూ నిలదీశారు. 

బాలిక తల్లిదండ్రులు వారితో మాట్లాడి... బాలికకు చికిత్స చేయించే ఆర్థిక స్థోతమ లేదని అందుకే దేవున్నే నమ్ముకున్నట్టు చెప్పారు. తమ అభ్యర్థన మేరకే పాస్టర్ ప్రార్థనలు చేశారని ఇందులో వేరే వాళ్ల తప్పులు లేవని చెప్పారు. తమ ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగిందని అంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. 

పోలీసులు పాస్టర్‌ను కూడా ప్రశ్నించారు. తల్లిదండ్రుల కోరిక మేరకే తాము బాలికను ఉంచి ప్రార్థనలు చేశామని తెలిపారు. తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Also Read: దెబ్బ తగిలిందని ఆస్పత్రికి వెళ్తే మహిళపై స్కానింగ్ సెంటర్ సిబ్బంది అసభ్య ప్రవర్తన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget