అన్వేషించండి

Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం

Crime News: ప్రార్థనలు చేస్తే జబ్బులు తగ్గుతాయన్న నమ్మం బాలిక ప్రాణాలు తీసింది. బ్రెయిన్ ట్రూమర్‌తో బాధపడుతున్న పాపతో 40 రోజులపాటు ప్రార్థనలు చేయించిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

Prakasam District Crime News : అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి వెళ్లాలి... కానీ ఓ బాలికను చర్చిలో ఉంచి ప్రార్థనలు చేశారు. చివరకు ఆమె ప్రాణాలు పోయాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే చికిత్స చేయించే స్థోమత లేక ప్రార్థనలతో నయం చేయించాలని చూశామంటున్నారు తల్లిదండ్రులు. 

ప్రకాశం జిల్లా కలువాయి మండలం బాలాజీరేవుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య దంపతులకు 8 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె పేరు భవ్య శ్రీ. రెండు నెలల క్రితం ఆమెకు జబ్బు చేసింది. స్పృహతప్పి పడిపోవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. 

చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. చెన్నై కానీ,హైదరాబాద్‌ కానీ తరలించి మెరుగైన వైద్యం అందించకపోతే ప్రమాదమని హెచ్చరించారు. ముందు భయపడిపోయిన తల్లిదండ్రులకు వైద్యులు చెప్పిన సూచన కాస్త ఊరట కల్పించింది. మంచి వైద్యం అందిస్తే బాలికకు ప్రమాదం ఉండదని తేలింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లక్ష్మయ్య దంపతులు. 

Also Read: ఉప్పెన సినిమా క్లైమాక్స్ రిపీట్ - కాకపోతే కట్ చేసింది అమ్మాయే - శృంగారానికి నిరాకరించాడని కట్టలు తెగిన కోపం!

ఆసుపత్రికి వెళ్లే ముందు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుందామని కొన్ని రోజుల క్రితం చేజర్ల మండలంలోని అదురుపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్ బాలిక గురించి తెలుసుకున్నారు. ప్రార్థనలు చేస్తే బాలికకు నయమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. పాస్టర్ మాటలు విన్న బాలిక తల్లిదండ్రులు కొన్ని రోజులు అక్కడే ఉంచి ప్రార్థనలు చేయించారు. 

కొన్ని రోజుల ప్రార్థనలకు బాలిక చలాకీగా తిరగడం మొదలు పెట్టిందని అంటున్నారు. జబ్బు తగ్గుముఖం పట్టిందని ఆనందంతో వచ్చే వారికి అన్నదానం కూడా చేశారట. ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. కొద్ది రోజులకే మళ్లీ బాలిక అనారోగ్యం పాలైంది. చివరకు సోమవారం చనిపోయింది. 

విషయం తెలుసుకున్న బంధువులు వచ్చి చర్చి వద్ద ఆందోళన చేశారు. అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం అందించకుండా మోసం చేశారని ఆరోపించారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందని వైద్యులు చెబితే ప్రార్థనలతో ఎలా నయం చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా మోసం కాదా అంటూ నిలదీశారు. 

బాలిక తల్లిదండ్రులు వారితో మాట్లాడి... బాలికకు చికిత్స చేయించే ఆర్థిక స్థోతమ లేదని అందుకే దేవున్నే నమ్ముకున్నట్టు చెప్పారు. తమ అభ్యర్థన మేరకే పాస్టర్ ప్రార్థనలు చేశారని ఇందులో వేరే వాళ్ల తప్పులు లేవని చెప్పారు. తమ ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగిందని అంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. 

పోలీసులు పాస్టర్‌ను కూడా ప్రశ్నించారు. తల్లిదండ్రుల కోరిక మేరకే తాము బాలికను ఉంచి ప్రార్థనలు చేశామని తెలిపారు. తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Also Read: దెబ్బ తగిలిందని ఆస్పత్రికి వెళ్తే మహిళపై స్కానింగ్ సెంటర్ సిబ్బంది అసభ్య ప్రవర్తన

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget