అన్వేషించండి

Anil Kumar Yadav : ఎన్టీఆర్ కొడుకులు చంద్రబాబుకు దాసోహం, మనవళ్లైనా టీడీపీని లాక్కోండి- అనిల్ కుమార్

Anil Kumar Yadav : టీడీపీని నారా వారి నుంచి నందమూరి మనవాళ్లు తీసుకోవాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.

Anil Kumar Yadav : నారా వారి నుంచి నందమూరి కుటుంబం టీడీపీని స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ పేర్లు పెట్టుకుంటే కాదు టీడీపీని లాక్కోవాలని హితవు పలికారు. కొడుకులు చేయలేనటువంటి పనినీ మనవళ్లు అయినా చేసి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నందుకు టీడీపీ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. 

టీడీపీని లాక్కోండి 

"నందమూరి వంశానికి మళ్లీ చెబుతున్నా... మీ తాతగారు పెట్టిన పార్టీని ఇప్పటికైనా లాక్కోండి. ఆ నారా వారికి పార్టీని దానం చేయకుండా మీ పార్టీని కనీసం మనవళ్లు అయినా తీసుకోండి. ఎన్టీఆర్ కడుపును పుట్టినవారంతా చంద్రబాబుకు దాసోహం. కనీసం మనవాళ్లు అయినా చంద్రబాబు దాసోహం అనకుండా పార్టీని స్వాధీనం చేసుకోండి. నందమూరి తారక రామారావు అని పేరు పెట్టుకుంటే కాదు ఆయన పెట్టిన పార్టీని లాక్కోండని మళ్లీ చెబుతున్నా. "- మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 

మళ్లీ జగనే సీఎం 

 సీఎం జగన్ ఆలోచన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  రాష్ట్రంలో  విద్వేషాలు రెచ్చగొడుతూ రైతులు పేరిట పాదయాత్ర అని చెప్పి ఒక డ్రామా కంపెనీ తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ కేవలం 28 గ్రామాలకు ప్రతిపక్ష పార్టీగా ఉందన్నారు. త్వరలోనే ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు పారిపోతారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటారని అన్నారు. మూడు రాజధానులు ఆలోచన విధానంతో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నానన్నారు. 

అమరావతి గ్రామాలకే ప్రతిపక్షనేత 

2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్ కు మకాం మార్చాల్సిందేనని అనిల్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2024లో కూడా జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నేత కాదని కేవలం అమరావతి గ్రామాలకు మాత్రమే ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముందుచూపుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని, 2024 తర్వాత ఆయన అక్కడికే మకాం మార్చాల్సి వస్తుందని చెప్పారు. 

హైదరాబాద్ కు మకాం 

"అమరావతి గురించి మాట్లాడుతున్న బడా నేతలంతా వేల ఎకరాలు ఆ ప్రాంతంలో కొన్నారు. మీ అభివృద్ధి, మీ వేల కోట్ల పెట్టుబడులు పోతాయన్న ఆలోచన తప్ప రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్న ఆలోచన. సీఎం జగన్ చెప్పినట్లు అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ. లక్ష కోట్లు కావాలి. అలా కాకుండా వికేంద్రీకరణ చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇవాళ కేవలం 28 గ్రామాలకు ప్రతిపక్షనేతగా మారిపోయారు. 2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్ కు మకాం మార్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. " - అనిల్ కుమార్ 

Also Read : జగన్ రెడ్డి సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియా- య‌నమల హాట్‌ కామెంట్స్

Also Read : రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఫోకస్ పెట్టండి- అధికారులకు సీఎం జగన్ సూచన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
iPhone 16 Discount: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
Rammohan Naidu: ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
Embed widget