News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kakani On Pawan Kalyan : పవన్ కి మూడు కాదు 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏంచేయలేరు- మంత్రి కాకాణి

Kakani On Pawan Kalyan : నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ కల్యాణ్ పై ఆయన సెటైర్లు పేల్చారు. 30 ఆప్షన్లు ఉన్నా పవన్ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు

FOLLOW US: 
Share:

Kakani On Pawan Kalyan : నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ కల్యాణ్ పై ఆయన సెటైర్లు పేల్చారు. పవన్ కి మూడు ఆప్షన్లు కాదు కదా 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు కాకాణి. లోకేశ్, పవన్ కల్యాణ్ కి కనీసం వ్యవసాయంపై అవగాహన లేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. 10 పంటలు చూపిస్తే, అందులో కనీసం 5 పంటల పేర్లు కూడా చెప్పలేని లోకేశ్, పవన్ కి వ్యవసాయంపై వైసీపీని విమర్శించే అర్హత లేదన్నారు. పవన్ కి మూడు ఆప్షన్లు కాదు, 30 ఆప్షన్లు ఉన్నా కూడా వైసీపీకి వచ్చినా ఢోకా ఏమీ లేదన్నారు. 5 రూపాయలకు అన్నక్యాంటీన్లో 10 మందికి భోజనం పెడితే ఉపయోగం ఏంటని, వైసీపీ హయాంలో ప్రజలందరికీ సంక్షేమం అందుతోందని చెప్పారు. అన్న క్యాంటీన్లు తీసేశారంటూ వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని, చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఆగస్ట్ లో బ్యారేజీల ప్రారంభోత్సవం

నెల్లూరు జిల్లాకు సంబంధించి సంగం బ్యారేజ్, నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వీటి ప్రారంభోత్సవాలను వాయిదా వేశారు. గతంలో సీఎం జగన్ కూడా ఈ ఏడాది సంక్రాంతికి ప్రారంభోత్సవం ఉందన్నారు కానీ, అది దాటిపోయి ఆరు నెలలవుతోంది. ఇప్పుడు కాకాణి మరో కొత్త డెడ్ లైన్ ప్రకటించారు. రెండు బ్యారేజీలను పూర్తి చేసి ఆగస్ట్ లో ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ దేనని అన్నారు మంత్రి కాకాణి. మూడేళ్ల పాలనలో చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోలేకపోయామని, ఇప్పుడు ప్లీనరీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ చర్చించుకుంటామని చెప్పారు. రాష్ట్ర స్థాయి ప్లీనరీలో కొత్త నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. 

2024 ఎన్నికల్లో చావో రేవో 

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందని చెప్పారు మంత్రి కాకాణి. ఈ అక్కసుతోనే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్‌కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించి మహిళా పక్షపాతిగా జగన్ నిలిచారని చెప్పారు. శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంతే ముఖ్యం  అని, కార్యకర్తల త్యాగాలు, వారి పనితనం వల్లే తాము ఈరోజు ఇక్కడ ఉండగలిగామన్నారు. 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలసిన పరిస్థితి చంద్రబాబుకి వచ్చిందని, అందుకే ఆయన కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఎంతకైనా తెగిస్తారని అన్నారు. 

Published at : 30 Jun 2022 07:19 PM (IST) Tags: Nellore news kakani govardhan reddy Nellore Update nellore ysrcp Minister Kakani ysrcp pleanary

ఇవి కూడా చూడండి

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా

Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Chandrababu case :  రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ -  చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!