అన్వేషించండి

Nara lokesh letter to CM Jagan: ఆ విషయం మీరు మరిచినా నేను మరిచిపోలేదు- సీఎం జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ

Nara Lokesh News: ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జగన్ అగ్రిగోల్డ్ విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వంపై, తనపై చేసిన ఆరోప‌ణ‌లు, చిమ్మిన విషాన్ని ఇంకా తాము మరచిపోలేదన్నారు లోకేష్.

Nara Lokesh Open Letter To AP CM YS Jagan: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ఈమేరకు ఆయన సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు లోకేష్. వారి అలసత్వానికి బాధితులు బలైపోతున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అగ్రిగోల్డ్ తరపున అప్పటి ప్రతిపక్షనేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. అప్పుడు తమపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. 

ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జగన్ అగ్రిగోల్డ్ విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వంపై, తనపై చేసిన ఆరోప‌ణ‌లు, చిమ్మిన విషాన్ని ఇంకా తాము మరచిపోలేదన్నారు లోకేష్. ఆ విషయాలన్నీ జగన్ మరచిపోయి ఉంటారేమోనని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పుట్టిందని, ఆయ‌న హ‌యాంలోనే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. అప్పుడు జరిగిన తప్పుని టీడీపీ సరిదిద్దే ప్రయత్నం చేసిందన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ అగ్రిగోల్డ్ ఆస్తులుగా ఉన్న 21 వేల ఎక‌రాలు అటాచ్ చేసి, యాజ‌మాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితుల‌కు న్యాయం చేసిందని చెప్పారు లోకేష్. అయినా కూడా అప్పటి ప్రతిపక్ష వైసీపీ తమపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిందన్నారు. "ప్ర‌తిప‌క్ష‌నేత‌గా హామీలిచ్చి గ‌ద్దెనెక్కాక మీరు చేసిన మోసంతో రోడ్డున‌ప‌డిన అగ్రిగోల్డ్ బాధితులు యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో న‌న్ను క‌లిసి గోడు వెళ్ల‌బోసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇస్తామ‌న్న సొమ్ములేవి? మా టీడీపీ ప్ర‌భుత్వం డిపాజిట‌ర్ల‌కి ఇవ్వ‌డానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయ‌కుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు త‌గ్గించి, 22 వారాల త‌రువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్న మీ తీరుతో బాధితులు మ‌రింత బాధ‌ప‌డ్డారు." అంటూ తన లేఖలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు లోకేష్. 

ఏ ఒక్క‌రి కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా
వైసీపీ వచ్చాక 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, వారిలో ఏ ఒక్క‌రి కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు లోకేష్. రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామని మాటిచ్చి తప్పారని జగన్ పై మండిపడ్డారు. క‌నీసం ప‌రామ‌ర్శలకు కూడా వెళ్లలేదన్నారు. ఇదేనా మీ మాన‌వ‌త్వం? అని నిలదీశారు. 2014-19 మ‌ధ్య‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన‌ 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల తమ ప్రభుత్వం కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎక్స్  గ్రేషియా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. అయితే అప్పట్లో అగ్రిగోల్డ్ తో టీడీపీ లాలూచీ పడిందని, అగ్రిగోల్డ్ భూముల్ని లోకేష్ కొట్టేశారని వైసీపీ ఆరోపణలు చేసిందని అన్నారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు.

ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయ‌లేదు
జగన్ సీఎం అయి ఐదేళ్ల‌వుతున్నా అగ్రిగోల్డ్ కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా ఎందుకు అటాచ్ చేయ‌లేదని ప్రశ్నించారు నారా లోకేష్. అగ్రిగోల్డ్ ఆస్తులపై జగన్, ఆయన అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా 10 లక్షలకు పైగా ఉన్న డిపాజిటర్లకు వారికి రావాల్సిన రూ.3080కోట్లను చెల్లించి న్యాయం చేయాల‌ని కోరుతున్నానని లేఖలో ప్రస్తావించారు నారా లోకేష్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget