అన్వేషించండి

Nara lokesh letter to CM Jagan: ఆ విషయం మీరు మరిచినా నేను మరిచిపోలేదు- సీఎం జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ

Nara Lokesh News: ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జగన్ అగ్రిగోల్డ్ విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వంపై, తనపై చేసిన ఆరోప‌ణ‌లు, చిమ్మిన విషాన్ని ఇంకా తాము మరచిపోలేదన్నారు లోకేష్.

Nara Lokesh Open Letter To AP CM YS Jagan: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ఈమేరకు ఆయన సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు లోకేష్. వారి అలసత్వానికి బాధితులు బలైపోతున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అగ్రిగోల్డ్ తరపున అప్పటి ప్రతిపక్షనేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. అప్పుడు తమపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. 

ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జగన్ అగ్రిగోల్డ్ విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వంపై, తనపై చేసిన ఆరోప‌ణ‌లు, చిమ్మిన విషాన్ని ఇంకా తాము మరచిపోలేదన్నారు లోకేష్. ఆ విషయాలన్నీ జగన్ మరచిపోయి ఉంటారేమోనని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పుట్టిందని, ఆయ‌న హ‌యాంలోనే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. అప్పుడు జరిగిన తప్పుని టీడీపీ సరిదిద్దే ప్రయత్నం చేసిందన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ అగ్రిగోల్డ్ ఆస్తులుగా ఉన్న 21 వేల ఎక‌రాలు అటాచ్ చేసి, యాజ‌మాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితుల‌కు న్యాయం చేసిందని చెప్పారు లోకేష్. అయినా కూడా అప్పటి ప్రతిపక్ష వైసీపీ తమపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిందన్నారు. "ప్ర‌తిప‌క్ష‌నేత‌గా హామీలిచ్చి గ‌ద్దెనెక్కాక మీరు చేసిన మోసంతో రోడ్డున‌ప‌డిన అగ్రిగోల్డ్ బాధితులు యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో న‌న్ను క‌లిసి గోడు వెళ్ల‌బోసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితుల‌కు ఇస్తామ‌న్న సొమ్ములేవి? మా టీడీపీ ప్ర‌భుత్వం డిపాజిట‌ర్ల‌కి ఇవ్వ‌డానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయ‌కుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు త‌గ్గించి, 22 వారాల త‌రువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్న మీ తీరుతో బాధితులు మ‌రింత బాధ‌ప‌డ్డారు." అంటూ తన లేఖలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు లోకేష్. 

ఏ ఒక్క‌రి కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా
వైసీపీ వచ్చాక 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, వారిలో ఏ ఒక్క‌రి కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు లోకేష్. రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామని మాటిచ్చి తప్పారని జగన్ పై మండిపడ్డారు. క‌నీసం ప‌రామ‌ర్శలకు కూడా వెళ్లలేదన్నారు. ఇదేనా మీ మాన‌వ‌త్వం? అని నిలదీశారు. 2014-19 మ‌ధ్య‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన‌ 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల తమ ప్రభుత్వం కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎక్స్  గ్రేషియా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు లోకేష్. అయితే అప్పట్లో అగ్రిగోల్డ్ తో టీడీపీ లాలూచీ పడిందని, అగ్రిగోల్డ్ భూముల్ని లోకేష్ కొట్టేశారని వైసీపీ ఆరోపణలు చేసిందని అన్నారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు.

ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయ‌లేదు
జగన్ సీఎం అయి ఐదేళ్ల‌వుతున్నా అగ్రిగోల్డ్ కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా ఎందుకు అటాచ్ చేయ‌లేదని ప్రశ్నించారు నారా లోకేష్. అగ్రిగోల్డ్ ఆస్తులపై జగన్, ఆయన అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా 10 లక్షలకు పైగా ఉన్న డిపాజిటర్లకు వారికి రావాల్సిన రూ.3080కోట్లను చెల్లించి న్యాయం చేయాల‌ని కోరుతున్నానని లేఖలో ప్రస్తావించారు నారా లోకేష్.

టాప్ హెడ్ లైన్స్

Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Pawan Kalyan Names New Plant: తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget