అన్వేషించండి

Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 

TDP Leader Nara Lokesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్ట పోయింది రైతులే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్ని వర్గాల వాళ్లను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అందరికంటే ఎక్కువగా అన్నదాతలనే నాశనం చేశారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలంతా ఆయనకు బుద్ధి చెప్పాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోట, రాజోలి జలాయశం ముంపు వాసులు సమస్సయలను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. 

యువగళం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా జమ్మలమడుగు నియోజక వర్గంలోని పెద్ద ముడియం మండలం సుద్దపల్లిలో రైతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గండికోట, రాజోలి జలాయశాయల సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో నష్ట పోయిన అన్నదాతలకు పది లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మాట ఇచ్చిన సీఎం... కొందరికే నష్ట పరిహారం ఇచ్చారని అన్నారు.

బండికి అడ్డంగా పడుకున్న రైతుల కోసం బండి కూడా ఆపలేరు..

"పోలవరం తీస్కోండి, గండికోట తీస్కోండి, రాజోలి తీస్కోండి. ఎన్నికల ముందట అబద్ధాలు తియ్యగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నడివీధిపై వదిలేసి వెళ్లిపోయాడు సీఎం. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పర్యటించినప్పుడు పరధాలు కడ్తరు. చెట్లను నరికేస్తరు. ఎక్కడ రైతులు రోడ్డుపైకి వస్తారో.. ఎక్కడ మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తరో అనే అనుమానంతో బతుకుతున్నడు జగన్. మొన్న చూశాం. హెలికాప్టర్ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి రోడ్డు మీద వెళ్తుంటే.. అప్పటికప్పుడు తెలుసుకన్న రైతులు ఒక ఐదుగురో, ఆరుగురో సాహసం చేసి ముఖ్యమంత్రి గారి బండికి అడ్డంగా పడుకున్నరు.

అయ్యా మీరు నాకు న్యాయం చేస్తా అన్నరు. ఏమాయే న్యాయం అని అడిగినందుకు పోలీసును పెట్టుకొని ఈడ్చుకొని ఎళ్లిపోయారు. పెద్ద మనసు ఉందని చెప్పుకుంటాడే కనీసం ఆగలా.. ఆగి మీ సమస్య ఏంటి, కాగితం ఇవ్వండి, నేను కనుక్కుంటా అని అడగలేకపోయాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే." - నారా లోకేష్

12 లక్షలు ఇస్తామని.. ఎలాంటి నిధులూ మంజూరు చేయలేదు..!

ముఖ్యంగా రాజోలి జలాశయం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుల సమస్యలన్నింటికీ సానుకూలంగా స్పందించిన వాళ్లందరికీ భరోసా ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు తీరుస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే వైఎస్సార్ జిల్లాలోని ప్రజలందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ మాయ మాటలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని.. కానీ వచ్చే ఎన్నికల్లలో ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా తమకే అధికారం కట్టబెడతారని జోస్యం చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Labor Adda: ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన
ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
Andhra Pradesh Government Schools: ప్రభుత్వ బడి ర్యాంక్ అదిరింది - కార్పొరేట్ శైలిలో విద్యాశాఖ ప్రచారం !
ప్రభుత్వ బడి ర్యాంక్ అదిరింది - కార్పొరేట్ శైలిలో విద్యాశాఖ ప్రచారం !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Price Hike India 2026: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Embed widget