అన్వేషించండి

Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 

TDP Leader Nara Lokesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్ట పోయింది రైతులే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్ని వర్గాల వాళ్లను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అందరికంటే ఎక్కువగా అన్నదాతలనే నాశనం చేశారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలంతా ఆయనకు బుద్ధి చెప్పాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోట, రాజోలి జలాయశం ముంపు వాసులు సమస్సయలను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. 

యువగళం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా జమ్మలమడుగు నియోజక వర్గంలోని పెద్ద ముడియం మండలం సుద్దపల్లిలో రైతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గండికోట, రాజోలి జలాయశాయల సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో నష్ట పోయిన అన్నదాతలకు పది లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మాట ఇచ్చిన సీఎం... కొందరికే నష్ట పరిహారం ఇచ్చారని అన్నారు.

బండికి అడ్డంగా పడుకున్న రైతుల కోసం బండి కూడా ఆపలేరు..

"పోలవరం తీస్కోండి, గండికోట తీస్కోండి, రాజోలి తీస్కోండి. ఎన్నికల ముందట అబద్ధాలు తియ్యగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నడివీధిపై వదిలేసి వెళ్లిపోయాడు సీఎం. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పర్యటించినప్పుడు పరధాలు కడ్తరు. చెట్లను నరికేస్తరు. ఎక్కడ రైతులు రోడ్డుపైకి వస్తారో.. ఎక్కడ మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తరో అనే అనుమానంతో బతుకుతున్నడు జగన్. మొన్న చూశాం. హెలికాప్టర్ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి రోడ్డు మీద వెళ్తుంటే.. అప్పటికప్పుడు తెలుసుకన్న రైతులు ఒక ఐదుగురో, ఆరుగురో సాహసం చేసి ముఖ్యమంత్రి గారి బండికి అడ్డంగా పడుకున్నరు.

అయ్యా మీరు నాకు న్యాయం చేస్తా అన్నరు. ఏమాయే న్యాయం అని అడిగినందుకు పోలీసును పెట్టుకొని ఈడ్చుకొని ఎళ్లిపోయారు. పెద్ద మనసు ఉందని చెప్పుకుంటాడే కనీసం ఆగలా.. ఆగి మీ సమస్య ఏంటి, కాగితం ఇవ్వండి, నేను కనుక్కుంటా అని అడగలేకపోయాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే." - నారా లోకేష్

12 లక్షలు ఇస్తామని.. ఎలాంటి నిధులూ మంజూరు చేయలేదు..!

ముఖ్యంగా రాజోలి జలాశయం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుల సమస్యలన్నింటికీ సానుకూలంగా స్పందించిన వాళ్లందరికీ భరోసా ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు తీరుస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే వైఎస్సార్ జిల్లాలోని ప్రజలందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ మాయ మాటలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని.. కానీ వచ్చే ఎన్నికల్లలో ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా తమకే అధికారం కట్టబెడతారని జోస్యం చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
Embed widget