అన్వేషించండి

Nara Lokesh: సీఐడీ విచారణకు లోకేశ్- కేసు విచారణ టీంలో అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను సీఐడీ అధికారులు విచారించనున్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ సీఐడీ ఆయన్ను విచారించనుంది. విచారణాధికారి జయరామ్ రాజ్ బృందం ఆధ్వర్యంలో లోకేశ్ ను విచారించనున్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుపై లోకేశ్ ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

కీలక పరిణామం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ కేసు విచారణాధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ జయరామరాజును సీఐడీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇకపై డీఎస్పీ విజయభాస్కర్ విచారణాధికారిగా ఉంటారని విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.


ఏ-14గా నారా లోకేశ్


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ నారా లోకేశ్ ను ఏ-14గా పేర్కొంటూ సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సీఐడీ విచారణకు అనుమతిచ్చిన ధర్మాసనం అధికారులకి పలు ఆదేశాలిచ్చింది. కాగా, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లోకేశ్ ను విచారించనున్నారు. మధ్యలో ఓ గంట భోజన విరామం ఇవ్వనున్నారు.

సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

విచారణ సమయంలో లోకేశ్ తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ ను ఒత్తిడి చెయ్యొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. హెరిటేజ్ కు సంబంధించిన ప్రశ్నలేవీ అడగొద్దని ధర్మాసనం సూచించింది. 

సీఐడీ ఏం చెబుతుందంటే.?

హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది. దీనిలో అక్రమాలు జరిగాయంటూ నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేసింది. 

ఖండించిన టీడీపీ

సీఐడీ నోటీసులపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు లేని, వేయని, కనీసం భూ సేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తోంది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలో రాష్ట్ర విభజనకు ముందు హెరిటేజ్ సంస్థకు కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని నిలదీస్తోంది.

చంద్రబాబు పిటిషన్ పై నేడు విచారణ

మరోవైపు స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, చంద్రబాబు వేసిన 3 బెయిల్ పిటిషన్లను సోమవారం హైకోర్టు తిరస్కరించింది. 

సీఐడీ వారెంట్లపైనా నేడు విచారణ

చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపైనా మంగళవారం విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత విజయవాడ ఏసీబీ కోర్డు విచారించనుంది. కాగా, అమరావతి రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై ఈ విచారణ జరగనుంది. చంద్రబాబుకు 2 కేసుల్లో రిమాండ్ విధించాలని సీఐడీ అదికారులు కోరారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget