అన్వేషించండి

Nara Lokesh: చిత్తూరు జిల్లాలో డయాలసిస్ యూనిట్ - పాదయాత్రలో హామీని నెరవేరుస్తున్నానని మంత్రి లోకేశ్ ట్వీట్

Andhra News: చిత్తూరు జిల్లాలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు.

New Dialysis Unit In Bangarupalyam In Chittor District: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో (Bangarupalyam) డయాలసిస్ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రూ.3 కోట్లతో యూనిట్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. 'యువగళం' పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తైన సందర్భంగా శుక్రవారం ఈ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ డయాలసిస్ యూనిట్ ద్వారా రోజుకు 10 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహించే అవకాశం ఉందని.. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. కాగా, యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తైన సందర్భంగా గతేడాది బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ.. ఆనాడు శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'ఇది మంచి ప్రభుత్వం'

కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన క్రమంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం నుంచి 'ఇది మంచి ప్రభుత్వం' పేరిట ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని.. వరదలు, విపత్తుల సమయంలో ప్రజల్లోనే ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వీటిని నేతలంతా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఈ నెల 20వ తేదీ (శుక్రవారం) నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికీ చేరవేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని టీడీపీ వర్గాలు తెలిపాయి.

అటు, ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు.. శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే గ్రామసభలో శుక్రవారం పాల్గొనున్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించడం సహా ప్రతిపక్షం ఆరోపణల్ని తిప్పికొట్టేలా ప్రజలను చైతన్యం చేసే దిశగా సీఎం మాట్లాడనున్నట్లు ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇంటికి సైతం వెళ్లి వారితో మాట్లాడుతారని చెప్పారు. మరోవైపు, సీఎం పర్యటన క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం హోదాలో ఆయన తొలిసారి సిక్కోలులో పర్యటిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read: Andhra Politics : కేతిరెడ్డి, విడదల రజనీ కూడా జనసేన దారిలో - అపాయింట్‌మెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ !?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget